logo

లోకేశ్‌ పాదయాత్రతో యువతకు భవిత

తెదేపా బలోపేతానికి, యువత భవిష్యత్తుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర కొండంత బలమని ఎన్‌ఆర్‌ఐ అమెరికా తెలుగు యువత కనెక్టికట్‌ ప్రధాన కార్యదర్శి కేతినేని వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 27 Mar 2023 02:35 IST

అమెరికాలో కేకు కోస్తున్న తెదేపా తెలుగు యువత

పాలసముద్రం: తెదేపా బలోపేతానికి, యువత భవిష్యత్తుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర కొండంత బలమని ఎన్‌ఆర్‌ఐ అమెరికా తెలుగు యువత కనెక్టికట్‌ ప్రధాన కార్యదర్శి కేతినేని వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పాదయాత్ర చేపట్టి 50 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆదివారం అమెరికాలో ఎన్‌ఆర్‌ఐల ఆధ్వర్యంలో కేకు కోసి సంబరాలు నిర్వహించామని చెప్పారు. తెదేపా ఎన్‌ఆర్‌ఐ తెలుగు యువత ప్రతినిధులు ప్రదీప్‌, త్రినాథ్‌, యోగేష్‌, నాగశ్రీ, యశస్వి, దుర్గాప్రసాద్‌, పవన్‌, సైదా, మనోజ్‌, భాను, సునీల్‌, శ్రీని పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని