logo

ఎట్టకేలకు అతికించేశారు

మండలంలో ఆదివారం జరిగిన ఆసరా పథకానికి సంబంధించిన చెక్కు పంపిణీ కార్యక్రమం కోసం అధికారులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.

Updated : 27 Mar 2023 12:17 IST

న్యూస్‌టుడే, వెదురుకుప్పం: మండలంలో ఆదివారం జరిగిన ఆసరా పథకానికి సంబంధించిన చెక్కు పంపిణీ కార్యక్రమం కోసం అధికారులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వేదికపై బ్యానరులో స్థానిక ఎమ్మెల్యే, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి చిత్ర పటం లేకుండానే పథక ప్రచార చిత్రాలు, ముఖ్యమంత్రి చిత్రాలతో ఏర్పాటు చేశారు. సభకు ఉపముఖ్యమంత్రి హాజరయ్యే లోపు లోపాన్ని గుర్తించిన యంత్రాంగం హడావిడిగా ఆయన చిత్రపటాన్ని బ్యానరుకు అతికించేశారు. ఈ విషయాన్ని గుర్తించిన పలువురు ప్రజలు అధికారులు, నేతల అత్యుత్సాహమే కారణమని చర్చించుకోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని