logo

నీట మునిగి యువకుడి మృతి

నీటమునిగి ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్‌, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పోలినాయుడుపల్లి గ్రామానికి చెందిన రమేష్‌ కుమారుడు ప్రవీణ్‌ (23) చదువు పూర్తయ్యి ఉద్యోగం కోసం కొన్ని రోజుల్లో అమెరికా వెళ్లనున్నాడు.

Published : 27 Mar 2023 02:35 IST

ప్రవీణ్‌ (పాతచిత్రం)

పళ్లిపట్టు, న్యూస్‌టుడే: నీటమునిగి ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్‌, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పోలినాయుడుపల్లి గ్రామానికి చెందిన రమేష్‌ కుమారుడు ప్రవీణ్‌ (23) చదువు పూర్తయ్యి ఉద్యోగం కోసం కొన్ని రోజుల్లో అమెరికా వెళ్లనున్నాడు. అదే గ్రామానికి చెందిన సుబ్రమణి కుమారుడు సాయికుమార్‌ (23) తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు ఆంజనేయర్‌నగర్‌లో ఉన్న పెదనాన్నను చూసేందుకు శనివారం వెళ్తుండగా అతనితో పాటు స్నేహితులు ప్రవీణ్‌, అప్పారెడ్డి గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్‌ కూడా వెళ్లారు. సాయంత్రం ముగ్గురూ కలిసి మద్యం సేవించడానికి స్థానిక చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ మత్స్యకారులు చేపలు పట్టేందుకు ఉంచిన తెప్ప ఎక్కి కొంతదూరం వెళ్లారు. ప్రమాదవశాత్తు తెప్ప బోల్తాపడటంతో ముగ్గురూ చెరువులో పడ్డారు. ఈత తెలిసిన సాయికుమార్‌, ప్రేమ్‌కుమార్‌లు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ప్రవీణ్‌ నీటమునిగాడు. సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని యువకుడి కోసం గాలింపు చేపట్టారు. చీకటి పడటంతో వెనుదిరిగారు. మళ్లీ ఆదివారం ఉదయం గాలించినా మృతదేహం లభించలేదు. మధ్యాహ్నం ప్రవీణ్‌ మృతదేహం నీటిపై తేలుతుండగా గమనించి ఒడ్డుకు చేర్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని