ఆటల్లో చిరుతలు
కబడ్డీ, ఖోఖో.. ఎంతో క్లిష్టమైన క్రీడలు. ఆట సాధనలో గాయాల సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ క్రీడల్లో అధిక శాతం మంది గ్రామీణులే సత్తా చాటుతుంటారు.
నిత్య సాధన
జాతీయ స్థాయి పతకాలే లక్ష్యం
న్యూస్టుడే, చిత్తూరు(క్రీడలు): కబడ్డీ, ఖోఖో.. ఎంతో క్లిష్టమైన క్రీడలు. ఆట సాధనలో గాయాల సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ క్రీడల్లో అధిక శాతం మంది గ్రామీణులే సత్తా చాటుతుంటారు.. నిత్య సాధనతో ప్రతిభకు పదును పెట్టి అత్యద్భుత ఆటతీరుతో ఆటల బరిలో విజృంభిస్తున్నారు వీరు.. ప్రత్యర్థి ఎవరైనా లెక్కించక.. పోరాటపటిమలో ధీరులనిపిస్తున్నారు. జాతీయ స్థాయి రాణింపే లక్ష్యమని అంటున్నారు జిల్లాకు చెందిన ఆటగాళ్లు.
కేక పెట్టిస్తాడు
రాజు ఖోఖో ఆటగాడు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు. ఐరాల మండలం స్వస్థలం. గ్రామీణ వ్యవసాయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చాడు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. రాజు చిన్ననాటి నుంచి ఆటల్లో చురుకు. పాఠశాల స్థాయి నుంచి ఖోఖో సాధన చేస్తూ ఆటలో నైపుణ్యం సాధించాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో తలపడి పతకాల్ని గెలిచాడు. 2019లో చిత్తూరులో జరిగిన అండర్-19 స్కూల్ గేమ్స్లో ప్రాతినిథ్యం వహించాడు. ఈ పోటీల్లో జిల్లా జట్టు రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలవడంతో జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించాడు. ఇంకా అసోసియేషన్ మీట్లో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాడు. జాతీయ స్థాయి పోటీల్లో రాణించడమే లక్ష్యంగా.. నిత్యం సాధన చేస్తున్నాడు.
భళా ఎగోమి..
ఎగోమి కబడ్డీ క్రీడాకారిణి. స్వస్థలం నగరి మండలం. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఎగోమి డిగ్రీ వరకూ చదివింది. చిన్ననాటి నుంచి కబడ్డీ అంటే ఆసక్తి. ఆరో తరగతి నుంచి ఇందులో సాధన చేస్తోంది. పాఠశాల స్థాయిలో నాలుగు సార్లు రాష్ట్ర జూనియర్స్, కళాశాల స్థాయిలో రెండు సార్లు సీనియర్స్ విభాగాల్లో జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహించింది. ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో విధులు నిర్వర్తిస్తోంది. ఇటు ఉద్యోగం చేస్తూనే అటు క్రీడల్లో సాధనకు అవసరమైన సమయాన్ని కేటాయిస్తోంది. త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ప్రస్తుతం సాధన చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోచుకునే ఎమ్మెల్యేలు కావాలా..?
[ 28-03-2024]
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్వగ్రామం తుమ్మలగుంటకు చెందిన వైకాపా నేతలు రాష్ట్ర సాహితీ అకాడమీ డైరెక్టర్ దొడ్ల గౌరీ, పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దొడ్ల కరుణాకర్రెడ్డి, నరసింహమూర్తి, రేవంత్ తదితరులు చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. -
వృద్ధులు.. దివ్యాంగుల ఓట్లపై వాలంటీర్ల గురి
[ 28-03-2024]
చిత్తూరు జిల్లా పంచాయతీ, గూడూరు, న్యూస్టుడే: దివ్యాంగులైన ఓటర్లు, వృద్ధులకు కల్పించిన వెసులుబాటును వైకాపా అడ్డదారుల్లో వాడుకునే ఎత్తుగడ చేస్తోంది. -
అనిశా వలలో ఆర్ఐ
[ 28-03-2024]
స్థానిక తహసీల్దారు కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తున్న రెడ్డెప్ప బుధవారం సాయంత్రం లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కాడు -
శ్రీవారి సేవలో రామ్చరణ్ దంపతులు
[ 28-03-2024]
శ్రీవారిని ప్రముఖ సినీనటుడు రామ్చరణ్, ఉపాసన దంపతులు కుమార్తె క్లింకార ఇతర కుటుంబసభ్యులతో సుప్రభాత సేవలో దర్శించుకున్నారు -
బకాయిలిస్తేనే మరమ్మతులు
[ 28-03-2024]
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నియంత్రికలు మండుతున్నాయి.. ఎండలు తీవ్రమవడం.. విద్యుత్తు వినియోగం పెరగడం.. అధిక లోడు, సాంకేతిక కారణాలతో దగ్ధమవుతున్న వాటి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.. -
విధుల నుంచి వాలంటీర్ తొలగింపు
[ 28-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గుడుపల్లె మండలం యామగానిపల్లె సచివాలయం క్లస్టర్-4 వాలంటీర్ నాగరాజును విధుల నుంచి తొలగించామని ఎంసీసీ నోడల్ అధికారులు.. జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక పంపారు -
నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
[ 28-03-2024]
సార్వత్రిక పాఠశాల పదో తరగతి, ఇంటర్మీడియేట్ పరీక్షల్లో విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన నలుగురు ఉపాధ్యాయులను విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ డీఈవో దేవరాజు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మత్తు.. చిత్తు
[ 28-03-2024]
ఎన్నికల వేళ ప్రజలను మత్తులో ముంచేందుకు రాజకీయ పార్టీలు సర్వం సిద్ధం చేసుకున్నాయి. ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత భారీగా పొరుగు మద్యం స్వాధీనం చేసుకుంటున్నారు. -
రెండో రోజూ హైడ్రామా!
[ 28-03-2024]
రేణిగుంట మండలం పీసీఆర్ గోదాము వద్ద బుధవారం హైడ్రామా నడిచింది. రామకృష్ణాపురం సమీపంలోని గోదాము వద్ద హైడ్రామా మంగళవారం జరగ్గా.. అది కొనసాగింది. -
‘మేం కలిసి పనిచేసినా మంత్రి రోజా ఓడిపోతుంది’
[ 28-03-2024]
నగరిలో మంత్రి రోజా, అసమ్మతి నాయకులు మధ్య సయోధ్య కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. -
ఈ రంగులు మారవా.. సార్..!
[ 28-03-2024]
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి దాదాపు 12 రోజులు గడిచినా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం ఎన్నికల సంఘం అంటే కాసింత గౌరవం కాదుకదా.. భయం కూడా కొందరు అధికారుల్లో లేకపోవడం గమనార్హం -
కోడ్ అమలులో నిర్లక్ష్యం...
[ 28-03-2024]
ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చి రోజలు గడుస్తున్నా సచివాలయాలపై సీఎం జగన్ చిత్రాలు నేటికీ దర్శనమిస్తూనే ఉన్నాయి. -
యువకుడి ఆత్మహత్య
[ 28-03-2024]
ప్రేమించిన యువతి మాట్లాడక పోవడంతో వింజంకు చెందిన ధనుష్(20) బుధవారం సాయంత్రం ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. -
తెదేపాలో చేరిక
[ 28-03-2024]
మాజీ కార్పొరేటర్ అన్నపూర్ణ సహా ఎనిమిదో డివిజన్కు చెందిన పలువురు వైకాపా మహిళలు బుధవారం తెదేపాలో చేరారు. -
తెదేపా కార్యకర్తలపై ‘బైండోవర్’ వేధింపులు
[ 28-03-2024]
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక సందర్భంగా తెదేపా కార్యకర్తలపై పెట్టిన కేసు కొట్టేసినా.. ఇప్పుడు బైండోవర్ పేరుతో పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. -
వారికి సిద్ధం.. ప్రజలకు కష్టం
[ 28-03-2024]
తిరుపతి(ఆర్టీసీ), న్యూస్టుడే: వైకాపా ఎన్నికల ప్రచారంలో భాగంగా తలపెట్టిన ‘మేమంతా సిద్ధం’ సభలకు జిల్లాలోని ఆర్టీసీ బస్సులు పెద్దఎత్తున కేటాయించారు. -
పెద్దిరెడ్డికి ఇసుకే అల్పాహారం.. మైన్స్ మధ్యాహ్న భోజనం: చంద్రబాబు
[ 28-03-2024]
దుర్మార్గాలు చేసేవారిని శాశ్వతంగా వదిలించుకునే సమయం ఆసన్నమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి