నిధులు రావు.. నీళ్లు పారవు
వ్యవసాయ రంగ పురోభివృద్ధికి దోహదపడుతూ రైతులు, కూలీల ఆర్థిక స్థితిలో మార్పులు తీసుకురావడంలో జలవనరుల శాఖది కీలక పాత్ర.
నాలుగేళ్లుగా నిస్తేజంలో జలవనరుల శాఖ అధికారులు
బైరెడ్డిపల్లె మండలం కైగల్ గ్రామ సమీపంలో దెబ్బతిన్న చెరువు మొరవ(పాతచిత్రం)
వ్యవసాయ రంగ పురోభివృద్ధికి దోహదపడుతూ రైతులు, కూలీల ఆర్థిక స్థితిలో మార్పులు తీసుకురావడంలో జలవనరుల శాఖది కీలక పాత్ర. శాఖకు గత ప్రభుత్వాలు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చి నిధులు విడుదల చేసేవి. నాలుగేళ్లుగా పరిస్థితి మారింది. నిధులు మంజూరు చేయాలంటూ ఆ శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నా అవి బుట్టదాఖలవుతున్నాయి. ఫలితంగా చెరువులకు మరమ్మతులు చేయక భూములు బీళ్లుగా మారుతున్నాయి. హంద్రీ- నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ పనులు చేసిన గుత్తేదారులకూ నాలుగేళ్లుగా బిల్లులు రాకపోవడంతో ఆ పనులూ పూర్తి కాలేదు.
ఈనాడు డిజిటల్, చిత్తూరు : రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలోనే ఎక్కువ చెరువులు ఉన్నాయి. 100 ఎకరాలలోపు విస్తీర్ణంలో 3,761 చెరువులు ఉండగా.. వాటి పరిధిలో 65,642 ఎకరాల ఆయకట్టు ఉంది. 100 ఎకరాల కన్నా ఎక్కువ విస్తీర్ణం ఉన్న 230 చెరువుల ద్వారా 47,349 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. సుమారు 1.13 లక్షల ఎకరాలు చెరువుల కిందే సాగవుతున్నాయి. రెండేళ్లుగా కురిసిన భారీ వర్షాలకు ఇంతటి కీలకమైన జలవనరులు దెబ్బతిన్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి అధికంగా వరద చేరడంతో గండ్లు, కోతలకు గురయ్యాయి. మొత్తంగా 1,318 చెరువులకు నష్టం వాటిల్లింది. అప్పట్లో తాత్కాలిక మరమ్మతులు చేసినా శాశ్వతంగా చేయలేదు. పనులు చేపట్టడానికి ఇదే సరైన సమయమైనా నిధులు విడుదల కాక ఏం చేయలేని దుస్థితిలో జలవనరుల శాఖ అధికారులు ఉన్నారు.
నీరు- చెట్టు బిల్లులు రూ.150 కోట్లు
భూగర్భ జలాలను పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గత ప్రభుత్వ హయాంలో జలవనరుల శాఖ పరిధిలో నీరు- చెట్టు కింద ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 900 పనులు చేశారు. చెరువుల్లో పూడికతీత, సప్లయ్ ఛానళ్ల పునరుద్ధరణ వంటి అభివృద్ధి పనులు జరిగాయి. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ విచారణ పేరిట బిల్లులను నిలిపేశారు. దీంతో కొందరు గుత్తేదారులు హైకోర్టును ఆశ్రయించి అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకుని బిల్లులు పొందారు. మరికొందరికి చెల్లింపులు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వ ఒత్తిడితో ఉన్నతాధికారులు నిధులు విడుదల చేయకపోవడంతో క్షేత్రస్థాయిలోని ఉద్యోగులు కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. ఇప్పటికీ సుమారు రూ.150 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. దీనికితోడు అప్పట్లో పనిచేసిన కొందరు అధికారులు నాణ్యత విషయంలో సరైన చర్యలు తీసుకోలేదని భావించిన సర్కారు వారికి తాఖీదులు ఇచ్చింది. ఈ కారణాలతో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో చేపట్టే పనులంటేనే గుత్తేదారులు వణికిపోతున్నారు. ఫలితంగా గతంలో క్షణం తీరిక లేకుండా ఉన్న అధికారులు, సిబ్బంది ప్రస్తుతం కార్యాలయాల్లో ఖాళీగా ఉంటున్నారు.
హంద్రీ- నీవా బకాయిలు రూ.30 కోట్లు
గతంలో హంద్రీ- నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ పనులు చేపట్టిన గుత్తేదారులకు మరో రూ.30 కోట్ల వరకు బకాయిలు రావాలి. నాలుగేళ్లుగా సీఎఫ్ఎంఎస్లో బిల్లులు అప్లోడ్ చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నా నిధులు లేకపోవడంతో సాఫ్ట్వేర్ తీసుకోవడంలేదు. ప్రస్తుతం ఎంతోకొంత పనులు జరుగుతున్నది హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టులోనే. పుంగనూరు నియోజకవర్గంలోని రెండు రిజర్వాయర్లతోపాటు కుప్పం బ్రాంచ్ కాలువ (కేబీసీ) పరిధిలోనే చేపడుతున్నారు. జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధి సంస్థ ఈ పనులు చేస్తుండటంతో వారికి మాత్రం త్వరగా బిల్లులు వస్తున్నాయని గుత్తేదారు వర్గాల్లో చర్చ జరుగుతోంది. పెండింగ్ బిల్లులు ప్రభుత్వం త్వరగా మంజూరు చేస్తే అటు చెరువులు ఇటు హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు ఆయకట్టు కింద రైతాంగానికి ప్రయోజనం చేకూరుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ బీ‘మాయ’
[ 25-04-2024]
ఆపత్కాలంలో కుటుంబానికి తోడుగా నిలుస్తోన్న చంద్రన్న బీమాపై జగనన్న ప్రభుత్వం వచ్చీరాగానే అక్కసు చూపించింది. రెండేళ్లు అరకొరగా అమలు చేసి చివరకు కుటుంబంలో ఒక్కరికే బీమా అవకాశం ఇవ్వడం శాపంగా మారింది. -
భరత్ నామినేషన్ ర్యాలీకి పక్క రాష్ట్రాల జనం
[ 25-04-2024]
కుప్పంలో వైకాపా అభ్యర్థి భరత్ నామినేషన్ ర్యాలీకి బుధవారం రాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తమిళనాడు, కర్ణాటక గ్రామాల నుంచి భారీఎత్తున జన సమీకరణ చేయడం చర్చనీయాంశమైంది. -
ఆలస్యమైనా వేటు తప్పదు..!
[ 25-04-2024]
అధికార పార్టీ నేతల మాటలకు తానా.. తందానా అంటూ వంతపాడుతున్న అధికారులపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటోంది. విచారణ ప్రక్రియ ఆలస్యమైనా.. చర్యలు మాత్రం పక్కా. రాష్ట్ర నిఘా విభాగాధిపతి, విజయవాడ సీపీ, చిత్తూరు సీఐలపై వేటు ఘటనల్లో ఇది స్పష్టమైంది. -
ప్రజల జోలికొస్తే ఊరుకోం
[ 25-04-2024]
చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు తాము అండగా ఉంటామని, అమాయక ప్రజల కొస్తే ఎంతటి వారైనా ఊరుకునేది లేదని తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ హెచ్చరించారు. -
జులై దర్శన టికెట్లు క్షణాల్లో..
[ 25-04-2024]
శ్రీవారి జులై నెల ఆన్లైన్ దర్శన టికెట్లకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. జులై నెలకు సంబంధించి అంగప్రదక్షిణం టికెట్లను బుధవారం విడుదల చేయగా నాలుగు నిమిషాల వ్యవధిలో.. -
మండిపోతున్నా పట్టక..!
[ 25-04-2024]
సూర్యుడు భగభగ మండిపోతున్నాడు.. వారం రోజులుగా ఎండలు 42-45 డిగ్రీలకు చేరాయి.. విద్యుత్తు వినియోగం మరింతగా పెరిగింది.. గృహ, వ్యవసాయ రంగానికి విద్యుత్తు వినయోగం అధికమైంది.. -
ఒకటి నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
మే ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు ఓటర్లకు బీఎల్వోల ద్వారా ఓటరు స్లిప్పులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
‘శోకో’పాధ్యాయ పాఠశాలలు
[ 25-04-2024]
జగన్ పాలనలో బడి పిల్లలు, పంతుళ్ల బతుకులు అతలాకుతలమయ్యాయి. జీవో 117 వారి జీవితాల్లో చీకట్లు నింపింది. విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మాణం అవుతుందని కొఠారి కమిషన్ చెబితే.. పాఠాలు చెప్పేవారిని ఇబ్బందులు పెట్టాలంటుంది జగన్ కమిషన్. -
ఆరో రోజు.. 63 నామినేషన్లు
[ 25-04-2024]
రిటర్నింగ్ అధికారి షన్మోహన్కు.. ఎంపీ అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు (తెదేపా), భూలక్ష్మీ (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), గణపతి (వీసీకే పార్టీ), దగ్గుమళ్ల రాధే (తెదేపా), జయకర్ (స్వతంత్ర), రవి (స్వతంత్ర), మునికృష్ణ (స్వతంత్ర), విజయకుమార్ (బీఎస్పీ)లు నామపత్రాలు సమర్పించారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ సంస్థల కరస్పాడెంట్ నాయుని చంద్రశేఖర్మూర్తి బుధవారం తెలిపారు. -
‘నగరిలో రోజాను ఓడించండి’
[ 25-04-2024]
నగరిలో రోజాను ఓడించాలని.. ఇండియా కూటమి తరఫున పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రాకేష్రెడ్డిని గెలిపించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి పిలుపునిచ్చారు. పుత్తూరు అంబేడ్కర్ భవనంలో బుధవారం సీఐటీయూ సమావేశం జరిగింది. -
వైఎస్ఆర్ బీమా.. జగన్ డ్రామా
[ 25-04-2024]
సీఎం జగన్ వైఎస్ఆర్ బీమా ద్వారా పేదలను ఆదుకుంటామని ఆర్భాటపే ప్రకటనలు చేశారు. ఏడాదికి రూ.15 ప్రీమియం కడితే 18-50 సంవత్సరాల లోపు అయితే సహజ మరణానికి రూ.లక్ష, 18-70 సంవత్సరాల వరకు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించారు. -
చిత్తూరు నగరం.. పసుపు మయం
[ 25-04-2024]
చిత్తూరు నగరం పసుపుమయమైంది. తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ బుధవారం తన నామినేషన్ను అట్టహాసంగా దాఖలు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన తెదేపా, జనసేన, భాజపా శ్రేణులతో నగర వీధులు జనసంద్రమయ్యాయి. -
మంత్రి పేరుతో.. విధ్వంసం
[ 25-04-2024]
నగరంలోని లీలామహల్ కూడలి నుంచి కరకంబాడి వెళ్లే మార్గంలో ఇటీవలే స్మార్ట్సిటీ నిధులతో నిర్మించిన రోడ్డును అడ్డదిడ్డంగా తవ్వేశారు. లీలామహల్ సమీపంలో తన అల్లుడు నిర్మించిన బహుళ అంతస్థుల వాణిజ్య భవనం అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటుకు సుమారు 150 మీటర్ల స్మార్ట్సిటీ రోడ్డును మంత్రి పీఏ తన పలుకుబడి ఉపయోగించి ధ్వంసం చేశారు. -
హస్తకళలూ.. విస్తుపోయాయి
[ 25-04-2024]
హస్తకళా గ్రామం అన్నారు. అన్ని హస్తకళలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి కళాకారులకు చేయూత.. మార్కెటింగ్.. పర్యాటకులను ఆకర్షించి ఆశించిన రీతిలో మార్కెటింగ్ వసతి తదితర ప్రయోజనాలంటూ హామీలు గుప్పించారు. -
నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారం మధ్యాహ్నం మూడు గంటలతో ముగియనుంది. జిల్లా వ్యాప్తంగా ఒక లోక్సభ, ఏడు శాసనసభ స్థానాలకు సంబంధించి ఈనెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
ఏమబ్బా.. కాస్త చూసుకుపోండి
[ 25-04-2024]
‘ఏమబ్బా.. పోస్టల్ బ్యాలెట్కు ఫారం - 12 ఇచ్చావా.. ఏంటి పరిస్థితి.. కాస్త చూసుకుపోండి.. తెలుసుకదా ఎవరికి ఓటు వేయాలో..’ ఇదీ కొందరు పోలీసు అధికారులు తమ సిబ్బందితో అంటున్న మాటలు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు