ఆరు వరుసలు.. ‘ఆగని ప్రమాదాలు’
జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ జరిగినా ప్రమాదాలు తగ్గడం లేదు. బ్లాక్స్పాట్లుగా గుర్తించిన ప్రదేశాల్లోనే ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంది.
పెరిగిన హాట్, బ్లాక్ స్పాట్లు
నాలుగేళ్లు.. 1,748 మంది మృతి
న్యూస్టుడే, తిరుపతి (నేరవిభాగం): జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ జరిగినా ప్రమాదాలు తగ్గడం లేదు. బ్లాక్స్పాట్లుగా గుర్తించిన ప్రదేశాల్లోనే ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంది. నగరాలు.. గ్రామాలకు అనుసంధానంగా ఉన్న హాట్స్పాట్ల వద్ద ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటోంది. అక్కడ అండర్, ఫ్ల్లైఓవర్ వంతెనలు లేకపోవడం.. ఆ కూడళ్లలో అపసవ్య దిశగా రాకపోకలు జరుగుతుండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసు, రవాణా శాఖ గుర్తించింది. రెండేళ్లలో జిల్లాలో 48 ప్రమాదాలు జరగ్గా.. 12 మంది మృత్యువాత పడ్డారు.
హత్యా ఘటనల కన్నా రోడ్డు ప్రమాదాల ద్వారానే ఎక్కువ మంది మరణిస్తున్నారు. మనిషి ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదనే విషయాన్ని గుర్తించండి. ఇతర శాఖల సహకారంతో ప్రమాదాల కట్టడికి కృషి చేయండి.
అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ తిరుపతి, చిత్తూరు జిల్లాల పోలీసు అధికారులకు ఇచ్చిన ఆదేశాలు.
15 బ్లాక్ స్పాట్లు
జిల్లాల పునర్విభజనతో తిరుపతి జిల్లాలో బ్లాక్స్పాట్ల సంఖ్య పెరిగింది. ఏడాదిలో మూడు ప్రమాదాలు జరిగే 15 ప్రాంతాలను బ్లాక్స్పాట్లుగా తేల్చారు. జాతీయ రహదారి- 16లోని హోలీ క్రాస్ సర్కిల్, కోటపోలూరు క్రాస్ రోడ్డు, చిల్లకూరు బైపాస్ సర్కిల్, బీవీ పాళెం చెక్పోస్టు, ఆదిశంకర కాలేజ్ సెంటర్, ఎన్హెచ్- 71 రహదారిలోని లింగంనాయుడు పల్లె క్రాస్ రోడ్డు, ఏఎం పుత్తూరు శివం కల్యాణ మండపం కూడలి, శ్రీకాళహస్తి రైల్వేస్టేషన్ ఎదురు సర్కిల్, మేర్లపాక పద్మావతి హోటల్ సర్కిల్ బ్లాక్స్పాట్గా గుర్తించారు. ఎన్హెచ్- చంద్రగిరి మండలంలోని అగరాల సర్కిల్తోపాటు మన్నూరు పోలూరు క్రాస్ రోడ్డు, హౌసింగ్ బోర్డు కాలనీ సర్కిల్, భాకరాపేట ఘాట్ కల్యాణిడ్యాం- గంగమ్మ గుడి సర్కిల్, తొట్టంబేడు మండలం శ్రీకాళహస్తి- నాయుడుపేట మార్గంలోని కూడలిని బ్లాక్ స్పాట్లుగా తేల్చారు.
ఆగిన అప్రమత్తత చర్యలు
కునుకు తీయడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం.. వేకువజామున 3 నుంచి 5 గంటల లోపు వాహనదారులను అప్రమత్తం చేసే కార్యక్రమం గతంలో జరిగేది. జాతీయ రహదారుల్లో వెళుతున్న వాహనాలను పోలీసులు ఆపి డ్రైవరును దింపి.. వారితో మాట్లాడి ముఖం కడుక్కోమని అప్రమత్తం చేసి పంపేవారు. దూరం నుంచి విశ్రాంతి లేకుండా ప్రయాణించే వాహనదారులు అప్రమత్తమయ్యేవారు. ప్రస్తుతం ఈ తరహా చర్యలు చేపట్టడం లేదు.
9 హాట్ స్పాట్లు
గాజులమండ్యం సర్కిల్ నుంచి రామానుపల్లి కూడలి వరకు ఉన్న 9 ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించారు. ఎన్హెచ్- 716లోని రామానుజపల్లి చెక్పోస్టుతోపాటు ఎన్హెచ్ 205లోని ఆర్సీపురం జంక్షన్, అవిలాల హరిజనవాడ సర్కిల్, ఓటేరు క్రాస్, తనపల్లి క్రాస్, దామినీడు వాటర్ ట్యాంకు కూడలి, తూకివాకం విలేజ్ సర్కిల్, గాజులమండ్యం కూడలి, తూకివాకం ఆర్ఓబీలను హాట్స్పాట్లుగా తేల్చారు. తిరుపతి నుంచి దక్షిణం వైపు ఉన్న గ్రామాలకు వెళ్లే జాతీయ రహదారి కూడళ్లు నిత్యం రద్దీ కారణంగా ప్రమాద నిలయాలుగా మారాయి. దాతలు అందజేసిన సైన్బోర్డులు, బారికేడ్లు కొన్నిచోట్లే ఉన్నాయి.ఎవరు ఎటువైపు వస్తారో తెలియని పరిస్థితి.
కూడళ్లలో వంతెనలు అవసరం
ప్రమాదకర కూడళ్ల వద్ద అండర్, ఫ్లైౖఓవర్ వంతెనల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం. సి.మల్లవరం కూడలి వద్ద ఫ్ల్లైఓవర్ బ్రిడ్జి, రామానుజపల్లి, ఆర్సీపురం, తాజ్ సర్కిల్, తిరుచానూరు క్రాస్, గూడూరు పట్టణం వద్ద అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశాం. గాజులమండ్యం సర్కిల్ నుంచి రామానుజపల్లి కూడలి వరకు సర్వీసు రోడ్డు విస్తరణకు జిల్లా కమిటీలో చర్చ జరిగింది. తూకివాకం వద్ద ఉన్న ఫ్ల్లైఓవర్ వంతెన రెండో లైను ఏర్పాటు చేయాలని కోరాం.
కె.సీతారామిరెడ్డి, జిల్లా రవాణాధికారి, తిరుపతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
[ 19-04-2024]
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
మా ఇష్టం.. ‘అన్నీ పెద్దాయన’కే..
[ 19-04-2024]
ఆయనో ‘పెద్ద’ మంత్రి.. పైగా రాష్ట్రంలోనే నంబర్-2గా పేరుంది.. దీనికితోడు కీలక శాఖలన్నీ ఆయన గుప్పిట్లోనే ఉన్నాయి.. ఇంకేం ఆయన ఎవరికీ ఫలానా పనిచేయండి అని చెప్పనవసరం లేదు.. -
భర్తీ చేయక.. బాధపెట్టేరూ..!
[ 19-04-2024]
‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం’.. ప్రతిపక్షనేతగా ప్రజాసంకల్ప యాత్రలో జగన్ రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ ఇది. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
[ 19-04-2024]
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
ప్రజలు తెదేపా వైపు చూస్తున్నారు..
[ 19-04-2024]
రాష్ట్ర ప్రజలు వైకాపా పాలనతో విసిగిపోయి తెదేపా వైపు చూస్తున్నారని చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి వీఎం థామస్ అన్నారు. గురువారం పెనుమూరుకు చెందిన వైకాపా నాయకులు విశ్వప్రకాష్నాయుడు, -
‘వైకాపా పాలనకు రోజులు దగ్గరపడ్డాయి’
[ 19-04-2024]
నగరి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతిలోని తన స్వగృహం నుంచి బయల్దేరి తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలోని తన తండ్రి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడి... -
జగనన్న తీరేంటంటే.. ఐదేళ్లూ చూశామంతే..!
[ 19-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించుకోవడంలో జగనన్న పనితనం మామూలుగా లేదు.. ఎన్నికలకు ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ అని మాయమాటలు చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు సీఎం జగన్.. -
న్యాయమూర్తుల సేవలు స్ఫూర్తిదాయకం
[ 19-04-2024]
కేసుల పరిష్కారంలో న్యాయమూర్తుల సేవలు అందరికి స్ఫూర్తిదాయకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. గురువారం రాత్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసమూర్తి, -
‘చంద్రబాబు ప్రత్యర్థిగా జగన్ నిలబడినా ఓటమే’
[ 19-04-2024]
కుప్పం నుంచి ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి బరిలో నిలిచినా ఓటమి ఖాయమని, ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి దాన్ని వృథా చేసుకోవద్దని, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఓటేసి విలువను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కోరారు. -
అభివృద్ధి చేసినందునే మరోమారు టికెట్
[ 19-04-2024]
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినందునే వెంకటేగౌడకు ఈ దఫా టికెట్ దక్కిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. -
వర్క్ ఆర్డర్లు క్లోజ్ చేయకపోతే వేతనాల్లో రికవరీ
[ 19-04-2024]
వర్క్ ఆర్డర్లను నెలాఖరులోగా క్లోజ్ చేయకపోతే వేతనాల నుంచి రికవరీ చేస్తామని విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్ ఎస్ఏవో శ్రీనివాసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్