చెరువు.. చెర
తిరుపతి పరిసర ప్రాంతాల్లో భూములు అధిక ధరలు పలుకుతున్నాయి. ఈ క్రమంలో ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు అధికార పార్టీకి చెందిన నేతలు కొందరు వాలిపోతున్నారు.
రూ.మూడు కోట్ల విలువైన భూముల ఆక్రమణ
కబ్జా చేసిన భూమిలో నిర్మాణాలు
తిరుపతి పరిసర ప్రాంతాల్లో భూములు అధిక ధరలు పలుకుతున్నాయి. ఈ క్రమంలో ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు అధికార పార్టీకి చెందిన నేతలు కొందరు వాలిపోతున్నారు. ప్రభుత్వ భూములకు తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పేదవాడు మూడు సెంట్ల భూమని ఆక్రమించుకుని గుడిసె నిర్మిస్తే చాలు పోలీసు బలగాలు, జేసీబీలతో వచ్చి నేలమట్టం చేసే రెవెన్యూ అధికారులు... కోట్లాది రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నా.. కనీసం స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుచానూరు ముఖద్వారం సమీపంలో మల్లగుంట చెరువును కొందరు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నా కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయడకపోవడం గమనార్హం.
న్యూస్టుడే, తిరుపతి(నగరం): తిరుచానూరు ముఖద్వారంలో సర్వేనం.265/3లో గతంలో మల్లంగుంట పేరుతో చెరువు ఉండేది. కాలక్రమేణా పూర్తిగా ఎండిపోవడంతో చుట్టు పక్కల నివాసం ఉండే పేదలు ఇళ్లు నిర్మించుకుంటూ వచ్చారు. దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా.. ఐదు ఎకరాలకు పైగా ఖాళీ స్థలం మిగిలినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించి అప్పట్లో భూములు కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకున్నారు. తిరుచానూరు బస్టాండ్ ఏర్పాటు చేసేందుకు చెరువును కూడా పరిశీలించారు. కొన్ని రోజుల పాటు ఇక్కడ బస్టాండ్ నిర్మించేందుకు చేసిన ప్రతిపాదనలు చివరకు మధ్యలోనే నిలిచిపోయాయి. దాదాపు పదిహేను సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న మల్లంగుంట చెరువును కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తిరుచానూరు సమీప పంచాయతీలకు చెందిన అధికార పార్టీ నేతలు తమ రాజకీయ పలుకుబడి ఉపయోగించి దాదాపు రెండు ఎకరాల్లో యంత్రాంగం సహకారంతో కొద్దికొద్దిగా నిర్మాణలు చేపడుతున్నారు. దాదాపు రూ.మూడు కోట్ల విలువైన స్థలంలో నిర్మాణలు జరుగుతున్నా కనీసం రెవెన్యూ యంత్రాంగం అడ్డుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తప్పుడు పత్రాలతో భూములు ఆక్రమిస్తున్నా.. అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా స్థానికులు కబ్జాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆ వెంటనే అధికారులు కబ్జాదారులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి వివరాలు అందించి వారి చేత బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు స్పందించి చెరువు స్థలం ఆక్రమణకు గురికాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు
మల్లంగుంట చెరువు ఆక్రమించుకున్నట్లు తమకు ఫిర్యాదు అందలేదు. ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. చెరువు భూములు కబ్జాచేయడం చట్టరీత్యా నేరం. రెవెన్యూ సిబ్బందిని పంపించి వివరాలు తెలుసుకుంటా.
లోకేశ్వరి, తహసీల్దారు, తిరుపతి గ్రామీణ మండలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
[ 19-04-2024]
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
మా ఇష్టం.. ‘అన్నీ పెద్దాయన’కే..
[ 19-04-2024]
ఆయనో ‘పెద్ద’ మంత్రి.. పైగా రాష్ట్రంలోనే నంబర్-2గా పేరుంది.. దీనికితోడు కీలక శాఖలన్నీ ఆయన గుప్పిట్లోనే ఉన్నాయి.. ఇంకేం ఆయన ఎవరికీ ఫలానా పనిచేయండి అని చెప్పనవసరం లేదు.. -
భర్తీ చేయక.. బాధపెట్టేరూ..!
[ 19-04-2024]
‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం’.. ప్రతిపక్షనేతగా ప్రజాసంకల్ప యాత్రలో జగన్ రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ ఇది. -
పేదల పాలిట.. వినాసికారే..!
[ 19-04-2024]
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
ప్రజలు తెదేపా వైపు చూస్తున్నారు..
[ 19-04-2024]
రాష్ట్ర ప్రజలు వైకాపా పాలనతో విసిగిపోయి తెదేపా వైపు చూస్తున్నారని చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి వీఎం థామస్ అన్నారు. గురువారం పెనుమూరుకు చెందిన వైకాపా నాయకులు విశ్వప్రకాష్నాయుడు, -
‘వైకాపా పాలనకు రోజులు దగ్గరపడ్డాయి’
[ 19-04-2024]
నగరి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతిలోని తన స్వగృహం నుంచి బయల్దేరి తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలోని తన తండ్రి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడి... -
జగనన్న తీరేంటంటే.. ఐదేళ్లూ చూశామంతే..!
[ 19-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించుకోవడంలో జగనన్న పనితనం మామూలుగా లేదు.. ఎన్నికలకు ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ అని మాయమాటలు చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు సీఎం జగన్.. -
న్యాయమూర్తుల సేవలు స్ఫూర్తిదాయకం
[ 19-04-2024]
కేసుల పరిష్కారంలో న్యాయమూర్తుల సేవలు అందరికి స్ఫూర్తిదాయకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. గురువారం రాత్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసమూర్తి, -
‘చంద్రబాబు ప్రత్యర్థిగా జగన్ నిలబడినా ఓటమే’
[ 19-04-2024]
కుప్పం నుంచి ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి బరిలో నిలిచినా ఓటమి ఖాయమని, ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి దాన్ని వృథా చేసుకోవద్దని, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఓటేసి విలువను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కోరారు. -
అభివృద్ధి చేసినందునే మరోమారు టికెట్
[ 19-04-2024]
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినందునే వెంకటేగౌడకు ఈ దఫా టికెట్ దక్కిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. -
వర్క్ ఆర్డర్లు క్లోజ్ చేయకపోతే వేతనాల్లో రికవరీ
[ 19-04-2024]
వర్క్ ఆర్డర్లను నెలాఖరులోగా క్లోజ్ చేయకపోతే వేతనాల నుంచి రికవరీ చేస్తామని విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్ ఎస్ఏవో శ్రీనివాసులు పేర్కొన్నారు.