logo

చంద్రబాబుపై కరపత్రాల పంపిణీపై ఫిర్యాదు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అవినీతి ఆరోపణలతో ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేయడంపై తెదేపా నాయకులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published : 27 Mar 2023 03:25 IST

పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న తెదేపా నాయకులు

వరదయ్యపాళెం, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అవినీతి ఆరోపణలతో ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేయడంపై తెదేపా నాయకులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలో పంపిణీ చేసిన ఈ కరపత్రాలను చిరునామా లేకుండా అసత్య ఆరోపణలతో బురదచల్లుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏఎస్సై షణ్ముగంనకు విన్నవించారు. కార్యక్రమంలో మండల తెదేపా మాజీ ఉపాధ్యక్షుడు బుర్రా సుబ్బయ్య, తెలుగు యువత నాయకులు ఎన్‌.హరిప్రసాద్‌చౌదరి, శ్రీపతి, లీలారామ్‌, అభిరామ్‌చౌదరి(జశ్వంత్‌), కుమార్‌, సురేష్‌రెడ్డి, క్రిష్ణ, చంద్ర పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు