ప్రదర్శనలు ఔరా..
ఏ పోటీలో అయినా తాము సిద్ధం అంటూ ముందు వరుసలో ఉండి ప్రతిభ చాటుతున్నారు ఆ విద్యార్థులు.. మండలంలోని గోపాలకృష్ణాపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు వివిధ రంగాల్లో రాణిస్తూ పాఠశాల పేరును మండల, జిల్లా స్థాయిలో ఇనుమడింపజేస్తున్నారు.
రాణిస్తున్న విద్యార్థులు
విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న హెచ్ఎం సుబ్బరాయన్, ఉపాధ్యాయుడు కేడీ సారథి(పాత చిత్రం)
న్యూస్టుడే, పుత్తూరు: ఏ పోటీలో అయినా తాము సిద్ధం అంటూ ముందు వరుసలో ఉండి ప్రతిభ చాటుతున్నారు ఆ విద్యార్థులు.. మండలంలోని గోపాలకృష్ణాపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు వివిధ రంగాల్లో రాణిస్తూ పాఠశాల పేరును మండల, జిల్లా స్థాయిలో ఇనుమడింపజేస్తున్నారు.. ఇటీవల నిర్వహించిన జాతీయ సైన్స్ మేళాలోనూ తమ ప్రతిభకు పదును పెట్టి చక్కటి ప్రదర్శలు రూపొందించి ప్రముఖుల నుంచి బహుమతులు, ప్రశంసలు అందుకున్నారు.
ఎకో ఫ్రెండ్లీ హౌస్..
గోపాలకృష్ణాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని లోహిత ఎకో ఫ్రెండ్లీ హౌస్ను సిద్ధం చేసి తన ప్రతిభ చాటింది. దీని ద్వారా పర్యావరణాన్ని కాపాడేలా జీవ వైవిధ్య భరిత ఇళ్లను రూపొందించారు. దీన్ని అందరికీ ఆదర్శంగా, అత్యంత ఉపయుక్తంగా తయారు చేశారు. పచ్చటి చెట్లు, కాలుష్య రహిత ఇంటి నిర్మాణం చేపట్టడం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలగదని తన మేథస్సుకు పనిపెట్టి మరీ ఈ వినూత్న ప్రాజెక్టు రూపొందించడం గమనార్హం.
సోలార్ వర్కింగ్ మోడల్..
గోపాలకృష్ణాపురం జడ్పీ ఉన్నత పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు సంతోష్. సౌర కుటుంబాన్ని.. సూర్యుడు మిగిలిన గ్రహాలను వాటి భ్రమణాలను చేసి చూపాడు. గ్రహాల భ్రమణం, సూర్యుడి నుంచి అవి ఎంత దూరంలో ఉన్నాయి.. వాటి ఆకారాలు, పరిమాణాలు చాలా చక్కగా చూపి తన ప్రతిభ చాటాడు. తద్వారా పలువురు ప్రముఖులచే ఔరా అనిపించుకున్నాడు. తద్వారా జిల్లా స్థాయిలో అవార్డులు సాధించాడు.
చాలా సంతోషం..
తమ పాఠశాల విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి పాఠశాల పేరు ఇనుమడింపజేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి విద్యార్థి తమలో దాగిఉన్న ప్రతిభను వెలికితీయాలి. విద్యార్థులు అందరూ అన్ని రంగాల్లో రాణించేందుకు కృషిచేయాలి.
- సుబ్బరాయన్, ప్రధానోపాధ్యాయుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రులకు జగన్ జబ్బు
[ 23-04-2024]
కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా పేదలకు వైద్య సేవలు అందిస్తామని, ప్రభుత్వ వైద్యశాలలను రోగులకు అనుగుణంగా అప్గ్రేడ్ చేసి ఆ మేరకు సేవలు విస్తరిస్తామని సీఎం జగన్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో హామీ ఇచ్చారు. -
ఫ్యాను పార్టీలో ఉక్కపోత
[ 23-04-2024]
వైకాపాలో అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయి. ఐదేళ్లలో ఆ పార్టీలో గౌరవం దక్కలేదని, ప్రజలకు ఏం చేయలేకపోయామనే భావనతో ఉన్న నాయకులు, కార్యకర్తలు విసిగివేశారి సైకిల్ ఎక్కుతున్నారు. -
‘పది’లో 11 మెట్లు పైకెక్కి
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో గతేడాది 17వ స్థానంలో నిలిచిన జిల్లా.. ఈ విడత ఆరో స్థానానికి చేరింది.. ముఖ్యంగా ఈసారి బాలికలదే పైచేయి. జిల్లాలో 20,939మంది(బాలురు 10,793మంది, బాలికలు 10,146మంది) విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. -
44 నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని చిత్తూరు లోక్సభ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం 44 నామినేషన్లు దాఖలయ్యాయి. -
మాటల్లో బాగా.. చేతల్లో దగా..
[ 23-04-2024]
అధికారంలోకి వచ్చాక ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయేలా ఫిట్మెంట్ ఇస్తామని ఎన్నికల సందర్భంగా సీఎం జగన్ హామీ ఇచ్చారు.. సీఎం అయ్యాక జగన్ ఉద్ధరిస్తారని భావిస్తే నమ్మకంగా ముంచేశారని వాపోతున్నారు. -
ఆ ఆలయం అందరికీ సెంటిమెంట్
[ 23-04-2024]
ఎన్నికల్లో పలు సెంటిమెంట్లు చూస్తుంటాం. ఆ గుడిలో పూజలు చేసి.. నామపత్రాలు దాఖలు చేస్తే.. గెలుపు తథ్యమని.. ఫలానా చోట నుంచి ప్రచారం ప్రారంభిస్తే విజయం సులువుగా వరిస్తుందని నాయకులు నమ్మి ఆచరిస్తుంటారు. -
వైకాపా పాలనలో కేసుల పరంపర
[ 23-04-2024]
అమరనాథరరెడ్డి మీద వైకాపా ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా కేసులు నమోదు చేసింది. ఈ విషయం ఎన్నికల అధికారులకు అయన సమర్పించిన అఫిడవిట్లో పొందుపరిచారు. -
ఏడాదిలోపే.. నాణ్యత లోపాలు
[ 23-04-2024]
శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం దేశవిదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఈక్రమంలో శ్రీవారి దర్శనంతోపాటు మెరుగైన వసతిని తితిదే నుంచి ఆశిస్తారు. -
జగన్ అరెస్టుతో నాకేంటి సంబంధం: కిరణ్
[ 23-04-2024]
వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తే తనకేంటి సంబంధమని మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట పార్లమెంట్ ఎన్డీయే అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి ప్రశ్నించారు. -
నాటకాల జగన్.. సీఎం పదవికి అనర్హుడు
[ 23-04-2024]
గత ఎన్నికల్లో కోడికత్తి, బాబాయ్పై గొడ్డలి వేటు నాటకాలు ఆడి గద్దెనెక్కిన జగన్.. అరాచక పాలన సాగించారు. మళ్లీ ఇప్పుడు గులకరాయి డ్రామాకు తెరతీశారు. -
దంపతులపై వైకాపా నాయకుల దాడి అమానుషం
[ 23-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు నామినేషన్కు వెళ్లారని ముస్లిం దంపతులపై వైకాపా నాయకులు దాడి చేసి, చంపేస్తామని బెదిరించడం అమానుషమని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. -
ఈ ఆస్పత్రుల్లో ఎలా జగన్..
[ 23-04-2024]
ప్రభుత్వాసుపత్రుల్లో అసౌకర్యాలు తాండవిస్తున్నాయి. రోగులకు సరిపడా గదులు లేవు.. వరండాల్లోనే వైద్యసేవలు పొందాల్సిన దుస్థితి. -
పూతలపట్టులో.. తెదేపాకు ఒక్క అవకాశమివ్వండి...!
[ 23-04-2024]
పూతలపట్టులో తెదేపాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపుతానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీ మోహన్ అన్నారు. -
ఉత్తీర్ణత పెరిగి.. స్థానం దిగజారి
[ 23-04-2024]
పది పరీక్ష ఫలితాలు జిల్లాను కాస్త నిరుత్సాహ పరిచాయి. గతేడాది రాష్ట్రస్థాయిలో ఎనిమిదో స్థానంలో నిలవగా ఈసారి రెండు స్థానాలు దిగజారి పదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
జగనన్న పీఆర్సీ.. తీరని ద్రోహం
[ 23-04-2024]
ఎంతసేపు వెట్టిచాకిరీ చేయించుకున్నారే తప్ప ఈ ఐదేళ్లలో ఏనాడూ తమపక్షాన నిలబడింది లేదని.. నిజానికి జగనన్న పాలనలో వాలంటీర్కు ఇచ్చిన విలువకూడా ఇవ్వలేదని.. నెరవేరని హామీలు, రివర్స్ పీఆర్సీనే అందుకు నిదర్శనమన్న ఆవేదన ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా