నిధులు అందక.. పనులు సాగక
పురపాలక సంఘంగా ఏర్పాటైంది.. ఎన్నికలు పూర్తై.. అధికార పార్టీ ఛైర్మన్ గిరి సాధించుకుంది.. ఎన్నికల సమయంలో పురపాలక సంఘ పరిధిలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు.
కుప్పం పురపాలికలో కానరాని అభివృద్ధి
సమస్యలతో ప్రజల అవస్థలు
చీగలపల్లెలో మురుగునీటి కాలువ నిర్మాణానికి గుంతలు తీసి వదిలేసిన దృశ్యం
కుప్పం పట్టణం, న్యూస్టుడే: పురపాలక సంఘంగా ఏర్పాటైంది.. ఎన్నికలు పూర్తై.. అధికార పార్టీ ఛైర్మన్ గిరి సాధించుకుంది.. ఎన్నికల సమయంలో పురపాలక సంఘ పరిధిలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా మురుగునీటి కాలువల నిర్మాణానికి వార్డుల పరిధిలో నెలల క్రితం గుంతలు తవ్వారు.. వాకింగ్ ట్రాక్ నిర్మించేందుకు పనులు చేపట్టి అర్ధాంతరంగా వదిలేశారు. ఇలా రూ.66 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభమై నిధులు మంజూరు కాకపోవడంతో గుత్తేదారులు పనులు నిలిపేశారు. ఏ వార్డు చూసినా పురోగతి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
రాధాక్రిష్ణారోడ్డులో మురుగుకాలువపై నిలిచిన వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులు
పాలకవర్గం, అధికారుల మనస్పర్థలతో
పట్టణం రామచంద్రారోడ్డు నుంచి ప్రధాన రహదారి నేతాజీ రోడ్డుకు అనుసంధానంగా రూ.2 కోట్ల వ్యయంతో వాకింగ్ ట్రాక్ నిర్మించేందుకు పురపాలక సంఘ పాలకవర్గం, అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా మనస్పర్థలు రావడంతో నిర్మాణ పనులను అర్ధాంతరంగా నిలిపేశారు. ఇలా ఓ వైపు జరిగిన అభివృద్ధికి నిధులు మంజూరు కాక.. కొత్త పనులు ముందుకు సాగక నిధుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వార్డుల్లో ఇదీ పరిస్థితి..
కుప్పం పురపాలక సంఘ పరిధిలోని 25 వార్డుల్లో తొమ్మిది వార్డులు మినహా మిగిలిన 16 వార్డుల్లో మురుగునీటి కాలువల నిర్మాణం ప్రారంభించారు. వార్డుల్లో చేసిన పనులకు సంబంధించి బిల్లులు అందక పోవడంతో మిగిలిన వార్డుల్లో మురుగునీటి కాలువల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నారు. దీంతో నెలల క్రితం తవ్విన గుంతలపైనే భయం భయంగా రాకపోకలు సాగిస్తున్నట్లు స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఎన్టీఆర్ కాలనీ, చీగలపల్లె, షికారీ కాలనీ, జయప్రకాష్ రోడ్డు, మోడల్ కాలనీ తదితర ప్రాంతాలలో పనులు అర్ధాంతరంగా ఆగి దర్శనమిస్తున్నాయి. నాలుగు నెలల క్రితం మురుగునీటి కాలువ నిర్మాణానికి తీసిన గుంతలపై బండలు పరుచుకొని రాకపోకలు సాగించాల్సి పరిస్థితి దాపురించిందని పురపాలక ప్రజలు వాపోతున్నారు. చీగలపల్లెలోని వీధుల్లో మురుగునీటి కాలువ గుంత నిండి ప్రమాదకరంగా మారింది.
బిల్లుల కోసం ప్రతిపాదనలు
వార్డుల పరిధిలో ఇప్పటి వరకు రూ.12 కోట్ల వరకు అభివృద్ధి పనులు జరిగాయి. పలువార్డుల్లో 80 శాతం పనులు పూర్తి కావడంతో వాటికి సంబంధించిన రూ.12 కోట్ల బిల్లుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. పలుచోట్ల కూలీలు లభించకపోవడంతో నిర్మాణాలు నిలిచాయి. వాటిని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.
రవిరెడ్డి, పురపాలక కమిషనర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెరువులను చెరబడుతున్న వైకాపా నేతలు
[ 29-03-2024]
వైకాపా నేతల కబంధ హస్తాల్లో చెరువులు చిక్కుకున్నాయి. కుదిరితే కబ్జా చెయ్.. లేదంటే మట్టి తవ్వి సొమ్ము చేసుకో అన్న చందంగా వైకాపా నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. -
భూసార పరీక్షలెక్కడ జగనన్నా..!
[ 29-03-2024]
భూమిలో సూక్ష్మ పోషకాల లోపాన్ని తెలుసుకుని తదనుగుణంగా చర్యలు చేపడితే అన్నదాతలు అధిక దిగుబడులు సాధించి అప్పుల ఊబి నుంచి బయటపడతారన్నది ఉద్దేశం.. అందుకు భూసార పరీక్షలు తప్పనిసరి. -
స్వర్ణరథంపై ప్రమాణాల స్వామి విహారం
[ 29-03-2024]
శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారు సిద్ధిబుద్ధి సమేతుడై స్వర్ణరథంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ గురువారం రాత్రి భక్తులను అలరించారు. -
అల్పాదాయాల్లోనే.. స్వయం సహాయక సంఘాలు
[ 29-03-2024]
గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలను వైకాపా సర్కార్ ఉపయోగించుకోవడం లేదు. 80 శాతం రాయితీతో స్వయం సహాయ సంఘాలకు ఇచ్చే రుణం సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేదు. -
నియమావళి అమలు చేయాలనిపిస్తేగా?
[ 29-03-2024]
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి పది రోజులు దాటింది. కోడ్ను పక్కాగా అమలు చేయాల్సిన యంత్రాంగం కొన్నిచోట్ల తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. నేటికీ కొన్నిచోట్ల అధికార వైకాపా రంగులు దర్శన మిస్తూనే ఉన్నాయి. -
‘ఓటమి భయంతోనే దోచుకున్న సొత్తు విదేశాలకు’
[ 29-03-2024]
ఓటమి భయంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దోచుకున్న ధనాన్ని విదేశాలకు తరలిస్తున్నారని చిత్తూరు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు, గురజాల జగన్మోహన్ ఆరోపించారు. స్థానిక తెదేపా జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. -
ప్రైవేటు వాహనానికి ప్రభుత్వ స్టిక్కర్
[ 29-03-2024]
ఆయన అధికార పార్టీ మండల స్థాయి నాయకుడు.. ఆయన కోడలు రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్పర్సన్ వారి స్వంత వాహనంపై ప్రభుత్వ వాహనమంటూ స్టిక్కర్ తలిగించుకున్నారు. -
అధికారుల అనుమతి తర్వాతే వాలంటీర్ల రాజీనామాకు ఆమోదం
[ 29-03-2024]
ప్రభుత్వ భవనాలపై పార్టీ రంగులుంటే అవి అభ్యంతరాల కింద రావు. ఆ రంగులు ఎప్పట్నుంచో ఉన్నవే. ప్రభుత్వ భవనాలపై పార్టీ చిహ్నాలు, నేతల ఫొటోలు ఉంటే ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. -
గరం గరం.. పశుగ్రాసం
[ 29-03-2024]
వర్షాలు ఎండమావులయ్యాయి.. చెరువులు, కుంటలు బీటలు వారాయి.. భూగర్భ జలాలు అండుగంటిపోయాయి.. సాగు భూములు బీళ్లుగా మారుతున్నాయి.. ఈ క్రమంలో పశుగ్రాసం కొరత తీవ్రమైంది.. పశుపోషణకు రైతన్నలు నానా తంటాలు పడుతున్నారు. -
పుంగనూరులో ట్రేడింగ్ మోసగాడు
[ 29-03-2024]
తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ఆశ చూపి ట్రేడింగ్ మోసానికి పాల్పడుతున్న ఇద్దరిని తెలంగాణ రాజధాని సైబరాబాబ్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. -
జగన్ సర్కార్పై మత్స్యకారులు గుర్రు
[ 29-03-2024]
‘మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వైకాపా అడుగు ముందుకేస్తోంది. వాకాడు మండలం రాయదొరువు వద్ద మత్స్యకారుల వలసల నివారణ, స్థితిగతులు మెరుగు పరచడానికి ఇక్కడ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం’. -
చెరబట్టి.. నీరు వెల్లగొట్టి..!
[ 29-03-2024]
భానుడి ప్రతాపంతో ఎండాకాలంలో దాహార్తి తిప్పలు తప్పవని ముందే గుర్తించినా వైకాపా నేతల ఆక్రమణల పర్వంతో జిల్లాలోని అత్యధిక చెరువులు నీరు లేక ఒట్టిపోయాయి. -
అరాచకాన్ని వీడి.. ప్రగతి బాట
[ 29-03-2024]
రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న అరాచక పాలనకు చరమగీతం పాడే రోజు సమీపిస్తోందని వైకాపా నేతలు గ్రహిస్తున్నారు. -
దేవుడి పేరు చెప్పి.. కాలువ కబ్జా..!
[ 29-03-2024]
అధికార పార్టీ నేతలకు చెరువులు.. పంట కాలువలంటే లెక్కలేకుండాపోయింది. నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఏకంగా తుమ్మలగుంట చెరువునే మాయం చేసినట్లు ఆరోపణలుండగా చోటామోటా నాయకులు కాలువ పోరంబోకు భూములపై పడుతున్నారు. -
తిరుమల నడకదారిలో చిరుత
[ 29-03-2024]
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోమారు చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈనెల 25, 26వ తేదీ తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని, అటవీశాఖ ఏర్పాటుచేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత సంచారం గుర్తించినట్లు తితిదే అటవీశాఖ డీఎఫ్వో శ్రీనివాసులు వెల్లడించారు. -
బహిర్గతమైన వైకాపా కుమ్ములాటలు
[ 29-03-2024]
కేవీబీపురం వైకాపాలో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గురువారం రాత్రి వైకాపా మండల బీసీˆసెల్ అధ్యక్షుడు హరిబాబు, మండల కోఆప్షన్ మెంబర్ జాకీర్ హుస్సేన్ మధ్య జరిగిన గొడవలే నిదర్శనం. -
పీ అండ్ పీవో వ్యవస్థ నిర్వీర్యం
[ 29-03-2024]
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎప్పటికప్పుడు కొత్త వాహకనౌకలను రూపొందించి, మానవాళి అవసరాలకు అనుగుణంగా ఉపగ్రహాలను తయారు చేసి, కక్ష్యలోకి పంపుతోంది. -
ఊరించి.. కొర్రీలతో వంచించి
[ 29-03-2024]
మీకు నేనున్నా.. మీ కష్టనష్టాలు తీరుస్తా.. అంటూ తన పాదయాత్ర సమయంలో ఇంటర్, డిగ్రీ ఒప్పంద అధ్యాపకులకు హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి జగనన్న చివరకు మాటతప్పి మడమ తిప్పేశారు. -
ఈ లెక్కలు బయటకు రావా..?
[ 29-03-2024]
కులగణన సర్వే ప్రక్రియ ముగిసినా.. ప్రభుత్వం దాని వివరాలు నేటికీ వెల్లడించలేదు. ఎన్నికలకు ముందు హడావుడిగా చేపట్టిన సర్వే ప్రక్రియ జిల్లాలో ఫిబ్రవరిలోనే ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్