పరికరాలు మూలన.. సిబ్బంది బదిలీపైన
ప్రభుత్వ ఆసుపత్రిలో అతి ముఖ్యమైన హెచ్ఐవీ పరీక్ష కేంద్రంలో ల్యాబ్టెక్నీషియన్ పోస్టు 6 నెలలుగా ఖాళీగా ఉంది. దీంతో అక్కడ సంబంధిత పరీక్షలు చేసేవారు లేకుండా రోగులు తిరిగి వెళ్లిపోతున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు తప్పని అవస్థలు
హెచ్ఐవీ పరీక్ష కేంద్రం
పలమనేరు, న్యూస్టుడే: ప్రభుత్వ ఆసుపత్రిలో అతి ముఖ్యమైన హెచ్ఐవీ పరీక్ష కేంద్రంలో ల్యాబ్టెక్నీషియన్ పోస్టు 6 నెలలుగా ఖాళీగా ఉంది. దీంతో అక్కడ సంబంధిత పరీక్షలు చేసేవారు లేకుండా రోగులు తిరిగి వెళ్లిపోతున్నారు. ఈ కేంద్రం దాదాపు ఇక్కడ మూతపడినట్టే. ఇక్కడున్న వ్యక్తి బదిలీ మీద బంగారుపాళ్యం వెళ్లిపోవడంతో ఆ పోస్టును ఇంకా భర్తీ చేయలేదు. సాధారణ ల్యాబ్ పరీక్షలైతే శిక్షణ పొందినవారు ఎవరైనా చేయవచ్చు. హెచ్ఐవీ కావడంతో సంబంధిత శిక్షకుడే చేయాలి. దాంతో ఆసుపత్రిలో పరీక్షలకు అంతరాయం ఏర్పడింది. దాంతో ఆ కేంద్రం నిరంతరం ఖాళీగా దర్శనమిస్తుంటుంది. ఇక చిన్న పిల్లల వార్డులోని ముఖ్యమైన పరికరాలు మూలన పడ్డాయి.
ఫొటో థెరపీ పరికరం
ప్రతి గర్భిణికి అవసరం
ప్రతి గర్భిణీ హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవాలి. ఎవరైనా దంపతులు, లేదా ప్రజలు ఇతర వ్యాధులకు సంబంధించి ఏదైనా సందేహాలున్నా ప్రభుత్వ ఆసుపత్రిలోనే హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవాలి. అంతేకాకుండా ఆసుపత్రిలో ఇందుకు సంబంధించి కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం పరీక్షలు నిర్వహించి హెచ్ఐవీ ఉంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి హిమోగ్లోబిన్, 6 నెలలకు ఒకసారి సీడీ4 పరీక్షలు చేయాలి. తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాల్సిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం ముఖ్యమైన పోస్టును భర్తీ చేయడకుండా వదిలేసింది. ఫలితంగా ఒకవైపు రోగులు, మరోవైపు కొత్తగా పరీక్షించుకోవాల్సిన వారికి ఇబ్బందులు తప్పటం లేదు.
మరమ్మతులకు గురవడంతో
ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న పిల్లల వార్డులో అత్యవసరమైన ఫొటో థెరపీ పరికరాలు మూడు పనిచేయడం లేదు. ఉన్నవి నాలుగైతే.. అందులో 3 ఒక్కసారిగా మరమ్మతులకు గురయ్యాయి. చిన్న పిల్లలు పుట్టిన వెంటనే జాండిస్ వస్తుందని లేదా వచ్చిన తరువాత ఈ పరికరంలో ఉంచుతారు. ఇవి ఇప్పుడు పనిచేయకపోవడంతో పిల్లలను తీసుకుని చిత్తూరుకు పోవాల్సి వస్తోంది. అధికారులు ఇలాంటి అత్యవసరమైన వాటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వినవస్తున్నాయి.
ఉన్నతాధికారులకు నివేదించాం
హరగోపాల్, వైద్యాధికారి, ప్రభుత్వాసుపత్రి, పలమనేరు
హెచ్ఐవీ పరీక్ష కేంద్రంలోని ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు భర్తీ చేయాల్సి ఉంది. ఉన్నతాధికారులకు సమాచారాన్ని తెలియచేశాం. ఇక ఫొటో థెరఫి పరికరాలను మరమ్మతు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిలోద‘కౌలు’
[ 24-04-2024]
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. కౌలుదారీ చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి రైతులు నష్టపోకుండా ఆదుకుంటాం. కౌలురైతులకు గుర్తింపు కార్డులిచ్చి బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు అందేలా చేస్తాం’. -
‘సిద్ధం సభలు వెలవెలబోతున్నాయి’
[ 24-04-2024]
సీఎం జగన్ కోడికత్తి తరహాలో ప్రజల సానుభూతి పొందాలన్న ప్రయత్నం విఫలైంది.. నుదుటిపై చిన్నపాటి దెబ్బ తగిలితే ఆ పార్టీ నాయకులు హత్యాయత్నం అంటూ హడావుడి చేస్తున్నారు.. అని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. -
బ్యానర్లు తొలగించరు.. నిబంధనలు వర్తింపజేయరు
[ 24-04-2024]
గత నాలుగు రోజుల్లో వరుసగా ఉల్లంఘనలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల అధికారులు సైతం పక్షపాతం చూపుతూ వైకాపా నాయకులైతే ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతున్నారు. -
గోపాలమిత్ర.. జగన్ మౌన పాత్ర
[ 24-04-2024]
మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా.. నన్ను గెలిపించండి.. మీ వెన్నంటి ఉంటా.. -
ఐదోరోజు 24 నామినేషన్ల దాఖలు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. చిత్తూరు ఎంపీ స్థానానికి సంబంధించి రిటర్నింగ్ అధికారి షన్మోహన్కు.. అభ్యర్థులు జగపతి (కాంగ్రెస్), రమేష్ (ఆలిండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ), భూలక్ష్మి(పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), జయకర్(స్వతంత్ర) నామినేషన్లు సమర్పించారు. -
ఏడేళ్ల చిన్నారికి పెద్ద కష్టం
[ 24-04-2024]
పట్టణంలోని ఈస్టుపేటకు చెందిన ఆటో డ్రైవర్ ప్రేమకుమార్, సుభాషిణి దంపతుల కుమార్తె జెస్సిక (7). ఏడాది కిందట తీవ్ర అనారోగ్యానికి గురైంది. -
‘వైకాపాను నమ్ముకొని.. నడిరోడ్డుపైకి వచ్చా’
[ 24-04-2024]
వైకాపా ఆవిర్భావం నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తే తగిన ప్రాధాన్యం దక్కలేదని 11వ డివిజన్ వైకాపా నాయకుడు, మాజీ కార్పొరేటర్ మార్తాళ్ భర్త శివకుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. -
నమ్ముకుంటే.. మోసపోయాం
[ 24-04-2024]
రాత్రింబవళ్లు పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషిచేసిన గోపాలమిత్రల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది.. తాను అధికారంలోకి రాగానే గోపాలమిత్రలను క్రమబద్ధీకరించి, వేతనాలు పెంచుతానని ప్రజాసంకల్ప పాదయాత్రలో నేటి సీఎం జగన్ నాడు హామీ ఇచ్చారు. -
‘అరాచక పాలనకు అంతం పలకాలి’
[ 24-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెదేపా ప్రచారం జోరందుకుంది. చిత్తూరు నగరం, గుడిపాల, చిత్తూరు గ్రామీణ మండలాల్లో నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. -
బస్టాండా.. అదెక్కడ..?
[ 24-04-2024]
నియోజకవర్గ కేంద్రమైన జీడీనెల్లూరులో బస్టాండు, బస్షెల్టరు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజూ ఇక్కడి నుంచి చిత్తూరు, తిరుపతి, వేలూరు, బెంగుళూరు, చెన్నై నగరాలతోపాటు సరిహద్దున ఉన్న తమిళనాడు, కర్నాటక రాష్ట్ర ప్రాంతాలకు బస్సులు ఎక్కుతుంటారు. -
కుమారుడి కోసమే ‘కరుణ’
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తన కుమారుడు అభినయ్రెడ్డిని గెలిపించుకునేందుకు తిరుపతి ఎమ్మెల్యే, తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తాపత్రయపడుతున్నా కాలం కలసి రావడం లేదు. -
వైకాపాకు వర్తించని నిబంధనలు.. అడుగడుగునా ఉల్లంఘనలు
[ 24-04-2024]
సత్యవేడు వైకాపా అభ్యర్థి నూకతోటి రాజేష్ నామినేషన్ కార్యక్రమంలో మంగళవారం ఎన్నికల నిబంధనలను గాలికి వదిలేసినా అధికారులు పట్టించుకోలేదు.
తాజా వార్తలు (Latest News)
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ