logo

పేదల సంక్షేమానికి తెదేపా తొలి ప్రాధాన్యం

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పేదల అభ్యున్నతి, సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇచ్చిందని ఆ పార్టీ నేతలు బీఎల్‌ సంజయ్‌, ఊకా విజయకుమార్‌ అన్నారు.

Published : 30 Mar 2023 02:23 IST

ఎన్టీఆర్‌ విగ్రహానికి హారతి ఇస్తున్న తెదేపా నాయకులు

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పేదల అభ్యున్నతి, సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇచ్చిందని ఆ పార్టీ నేతలు బీఎల్‌ సంజయ్‌, ఊకా విజయకుమార్‌ అన్నారు. బుధవారం తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నగరంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి నాయకులు పాలాభిషేకం చేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ ప్రారంభించిన తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చిన ఘనత నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కే దక్కిందని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు శ్రీధర్‌వర్మ, బుల్లెట్‌ రమణ, దంపూరి భాస్కర్‌యాదవ్‌, మహేష్‌యాదవ్‌, సురేంద్రనాయుడు, సదాశివం, ఆనంద్‌గౌడ్‌, తులసీరామ్‌, ఆర్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఆవిర్భావ వేడుకల్లో తిరుపతి నాయకులు.. హైదరాబాద్‌లో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, కార్పొరేటర్‌ ఆర్సీ మునికృష్ణ, నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని