logo

చంద్రగిరి వైకాపా అభ్యర్థిగా మోహిత్‌రెడ్డి..!

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పోటీ చేయనున్నారు.

Published : 30 Mar 2023 02:23 IST

ఈనాడు-తిరుపతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే వైకాపా అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మోహిత్‌రెడ్డి పేరును ఖరారు చేసినట్లు ఎమ్మెల్యే వర్గీయులు చెబుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రానున్న ఎన్నికల్లో ఆయన బదులుగా మోహిత్‌రెడ్డికి టికెట్‌ ఇచ్చే ప్రతిపాదనను ముఖ్యమంత్రి తెరమీదకు తెచ్చినట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈయన తిరుపతి గ్రామీణ ఎంపీపీగా ఉన్నారు. గడప గడపకు కార్యక్రమంలోనూ ఆయనే పాల్గొంటున్నారు. ఎన్నికల తర్వాత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని