బలవంతంగా దీక్ష భగ్నం
చిందేపల్లె రహదారి కోసం శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి వినుత చేపట్టిన నిరశన దీక్షను పోలీసులు బలవంతంగా బుధవారం భగ్నం చేశారు.
పోలీసులపై రాళ్లు రువ్విన స్థానికులు
ఆందోళన కారులపై పోలీసుల లాఠీఛార్జి
ఏర్పేడు, న్యూస్టుడే: చిందేపల్లె రహదారి కోసం శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి వినుత చేపట్టిన నిరశన దీక్షను పోలీసులు బలవంతంగా బుధవారం భగ్నం చేశారు. రేణిగుంట-నాయుడుపేట ప్రధాన రహదారి నుంచి రాచగున్నేరి సమీపంలోని ఎలక్ట్రో స్టీల్ పరిశ్రమ మీదుగా గ్రామానికి వెళ్లే రహదారికి అడ్డంగా పరిశ్రమ యాజమాన్యం గోడ నిర్మించడంతో కొద్ది రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. గ్రామస్థులకు మద్దతుగా వినుత, ఆమె భర్త చంద్రబాబుతో కలిసి చిందేపల్లెలోని శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయంలో సోమవారం నుంచి నిరశన దీక్షను చేపట్టారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పోలీస్లు పెద్దఎత్తున ఆలయం వద్దకు చేరుకుని బలవంతంగా దీక్షను భగ్నం చేసి అత్యవసర వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే అత్యవసర వాహనంతో పాటు పోలీసు వాహనాలు ముందుకు కదలకుండా స్థానికులు అడ్డుకున్నారు. పోలీస్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో గాజులమండ్యం సీఐ ఆరోహణరావు, బీఎన్కండ్రిగ ఎఎస్సై శివకుమార్ గాయ పడ్డారు. ఈ క్రమంలో పోలీసులు స్థానికులపై లాఠీఛార్జి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జనసేన కార్యకర్తలు, స్థానికులను పోలీస్లు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిబంధన మీరి.. దూసుకొచ్చి..
[ 20-04-2024]
నామినేషన్ దాఖలు సమయంలో ఆర్వో కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు నిలిచిపోవాలన్న నిబంధనను పుంగనూరులో వైకాపా శ్రేణులు అతిక్రమించాయి -
వైకాపా రంగుల పలకలు తొలగించారు
[ 20-04-2024]
పోలింగ్ కేంద్రాలు కల్గిన బడి ఆవరణలో వైకాపా రంగులతో ఏర్పాటు చేసిన సిమెంటు బెంచీలకు రంగుల పలకలను అధికారులు తీయించారు. -
రాష్ట్ర విభజనకు కారకుడైన కిరణ్కుమార్రెడ్డి
[ 20-04-2024]
ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకొచ్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. -
తెదేపా నేతపై దాడి
[ 20-04-2024]
పులిచెర్ల మండలం రేణుమాకులపల్లె పంచాయతీ బి.వడ్డిపల్లెకు చెందిన తెదేపా నాయకుడు సుబ్బరాజుపై స్థానిక వైకాపాకి చెందిన రెడ్డప్ప, వెంకటరమణ అన్నదమ్ములు దాడి పాల్పడ్డారు -
నేడు జిల్లాకు తెదేపా అధినేత రాక
[ 20-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు జిల్లాలో శనివారం పర్యటించనున్నారు. ఉదయం 10:40 గంటలకు గూడూరులోని వరగాలి క్రాస్రోడ్డు సమీపంలోని హెలిపాడ్ చేరుకుంటారు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం