logo

శివ.. శివా.. ఎన్నాళ్లిలా..!

భరద్వాజతీర్థంలోని రాతి వనం వద్ద శివపార్వతుల విగ్రహాలను, పరివార దేవతామూర్తులను పాలిథిన్‌ తొడుగులు అమర్చి అక్కడ పెట్టేశారు.

Published : 30 Mar 2023 02:22 IST

న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి: భరద్వాజతీర్థంలోని రాతి వనం వద్ద శివపార్వతుల విగ్రహాలను, పరివార దేవతామూర్తులను పాలిథిన్‌ తొడుగులు అమర్చి అక్కడ పెట్టేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా సాంస్కృతిక ఉత్సవాలకు సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు. ఉత్సవాలు పూర్తయ్యాక ఇలా వదిలేశారు. ఇకనైనా వీటిని వర్షం పడని, ఎండ తీవ్రత కన్పించని చెట్ల కింద కాస్తంత అందంగా పెట్టే విధంగా అధికారులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఆలస్యమైతే విగ్రహాల రూపురేఖలు మారిపోయే ప్రమాదముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని