logo

ఆనం పోటీ చేయాలని కోరుకుంటున్నా : నేదురుమల్లి

ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని రాష్ట్ర కమ్యూనిటీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌, వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

Updated : 30 Mar 2023 03:27 IST

కౌన్సిలర్లతో సమీక్షిస్తున్న రామ్‌కుమార్‌రెడ్డి

వెంకటగిరి, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని రాష్ట్ర కమ్యూనిటీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌, వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నేదురుమల్లి నివాసంలో బుధవారం పురపాలక కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆనం గాల్లో మేడలు కట్టి ప్రజలను భ్రమలో పెట్టారని, ఆయన గతంలో ఏ హామీలు ఇచ్చారో తనకు తెలియదని, తాను చేయాల్సిన పనులు తాను చేస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపార్టీ సిద్ధాంతం నచ్చుతుందో ఆ పార్టీ తరఫున ఆనం పోటీచేస్తే నియోజకవర్గ ప్రజలు వారి ఆత్మ ప్రబోధానుసారం ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. అనంతరం పురపాలక బడ్జెట్‌, కౌన్సిల్‌ సమావేశంపై ఆయన చర్చించారు. అసైన్‌మెంట్‌ కమిటీపై ఆర్డీవో కిరణ్‌కుమార్‌, తహసీల్దారుతో సమీక్షించారు. తక్కువ మందికి లబ్ధి చేకూరుతున్నట్లు గుర్తించామని, మరింత మందికి పట్టాలు అందించేలా  చూడాలన్నారు. పుర అధ్యక్షురాలు భానుప్రియ, ఉపాధ్యక్షుడు బాలయ్య, సమన్వయకర్త ఢిల్లీబాబు, పద్మశాలీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని