logo

వేదవర్సిటీ సందర్శన

శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని బుధవారం దిల్లీలోని అక్షరధామ్‌కు చెందిన స్వామినారాయణ సంస్థల పీఠాధిపతి భద్రేశ్‌దాస్‌ స్వామి సందర్శించారు.

Published : 30 Mar 2023 02:22 IST

భద్రేశ్‌దాస్‌స్వామికి స్వాగతం పలుకుతున్న ఇన్‌ఛార్జ్‌ వీసీ రాణీసదాశివమూర్తి

తిరుపతి(సాంస్కృతికం): శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని బుధవారం దిల్లీలోని అక్షరధామ్‌కు చెందిన స్వామినారాయణ సంస్థల పీఠాధిపతి భద్రేశ్‌దాస్‌ స్వామి సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వర్సిటీ ఇన్‌ఛార్జ్‌ వీసీ ఆచార్య రాణీసదాశివమూర్తి వేదవర్సిటీలో జరుగుతున్న బోధన, పరిశోధనల ప్రగతిని గురించి వివరించారు. వేదపఠనం, పరిశోధనల అంశంలో వేదవర్సిటీతో కలిసి పనిచేయడానికి అక్షరధామ్‌ స్వామినారాయణ సంస్థలతో అవగాహన(ఎంఓయూ) కుదుర్చుకుంటున్నట్లు చెప్పారు. రిజిస్ట్రార్‌ ఏవీ రాధేశ్యామ్‌, తదితరులు పాల్గొన్నారు.

శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 7వ స్నాతకోత్సవానికి సిద్ధమౌతోంది. 2021-22 విద్యాసంవత్సరంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీలు, ఇతర కోర్సులు పూర్తిచేసిన వారు ఏప్రిల్‌ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ మేరకు ప్రత్యేక నోటిఫికేషన్‌ను వెలువరించారు. స్నాతకోత్సవ నిర్వహణ తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని