చిరు వ్యాపారం.. కుటుంబానికి ఆదాయం
గాంధీపురం పంచాయతీలోని పలువురు మహిళలు స్వయం సహాయ సంఘాల్లో సభ్యులుగా ఉంటూ రుణాలు పొంది చిరు వ్యాపారాలు నిర్వహిస్తూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు.
తిరుపతి (గ్రామీణ), చంద్రగిరి, న్యూస్టుడే: గాంధీపురం పంచాయతీలోని పలువురు మహిళలు స్వయం సహాయ సంఘాల్లో సభ్యులుగా ఉంటూ రుణాలు పొంది చిరు వ్యాపారాలు నిర్వహిస్తూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లిస్తూ ఉపాధి బాటలో ముందుకు సాగుతున్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు.
పిల్లల్ని ఉన్నతంగా చదివిస్తూ..
నా పేరు సరళ. భర్త దయాల్ ఎలక్ట్రికల్ పనులు చేస్తారు. ఒక్కరి సంపాదనతో ఇద్దరు పిల్లల్ని చదివించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో 2010లో పొదుపు సంఘంలో సభ్యురాలిగా చేరాను. రూ.లక్ష రుణం తీసుకుని మాస్ సంస్థ సహకారంతో చిల్లర దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నా. ప్రతి నెలా ఈ దుకాణం ద్వారా సుమారు రూ.16 వేలు సంపాదిస్తున్నాను. దీంతో కొంతమేర ఆర్థికంగా ఇబ్బందులు తీరాయి. మా అమ్మాయి అగ్రికల్చరల్ డిగ్రీ, అబ్బాయి బీటెక్ చదువుతున్నారు.
ఇల్లు నిర్మించుకున్నాం
నా పేరు సంగీత. నా భర్త రమేష్ డ్రైవర్గా పనిచేస్తూ వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. మాకు ఇద్దరు పిల్లలు. ఒక్కరి సంపాదనతో వారిని ఉన్నత చదువులు చదివించాలంటే కష్టమే. ఈ క్రమంలోనే 2010లో సంగీత మాత పొదుపు సంఘంలో సభ్యురాలిగా చేరా. రూ.1.50 లక్షల రుణం తీసుకుని ఫ్యాన్సీ దుకాణం ఏర్పాటు చేసుకున్నా. నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్నాను. ఆర్థికంగా కొంతమేర ఇబ్బందులు తీరడంతో ఒక ఇల్లు నిర్మించుకున్నాం. అమ్మాయి ఎస్వీయూలో ఎమ్మెస్సీ చదువుతోంది. అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు.
పండ్ల వ్యాపారంతో లాభాలు
నా పేరు లావణ్య. చంద్రగిరి మండలం కొత్తపేటలోని భారతీనగర్. నా భర్త శివకుమార్ తిరుపతిలో టాక్సీ డ్రైవరుగా పనిచేస్తారు. ఆయన సంపాదన సరిపోవడం లేదు. నేను మూడేళ్ల క్రితం శ్రీకృష్ణమహిళా సంఘంలో సభ్యురాలిగా చేరి తొలుత రూ.50 వేలు రుణ సదుపాయం పొంది చంద్రగిరి బస్టాండు ప్రాతంలో నాలుగుచక్రాల తోపుడుబండిపై పండ్లవ్యాపారం మొదలుపెట్టా. సీజన్కు అనుగుణంగా లభించే వివిధ రకాల పండ్లు విక్రయిస్తున్నా. రోజుకు ఖర్చులు పోనూ రూ.600 వరకు వస్తోంది. దీంతో సంఘంలో తీసుకున్న రుణం సకాలంలో చెల్లిస్తూ మరో మారు రూ.లక్ష రుణం పొంది ముగ్గురు పిల్లలను చదివిస్తున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న ‘ఘోర’ముద్ద
[ 20-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు మంచి నాణ్యమైన భోజనం అందించేందుకు జగనన్న గోరుముద్ద కార్యక్రమం ప్రవేశపెట్టామని, రోజూ మెనూ ప్రకారం భోజనం అందిస్తామని సీఎం జగన్ చెప్పారు. -
పెద్దిరెడ్డి.. ప్ర‘జల’ ఆశలకు గండి
[ 20-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తర్వాత వైకాపాలో నంబరు 2గా, రాయలసీమ జిల్లాల్లో పెత్తనం చెలాయిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిందే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శాసనం.. కాంట్రాక్టులన్నీ ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే. -
రెండో రోజు 16 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం 16 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని జిల్లా ఎన్నికల అధికారి షన్మోహన్ తెలిపారు. -
ఎమ్మెల్సీ భరత్ను ఆపేసిన పోలీసులు..
[ 20-04-2024]
చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప నామినేషన్ దాఖలు సందర్భంగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన వైకాపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ను ప్రధాన గేటు వద్దే పోలీసులు ఆపివేశారు -
వైకాపా భూస్మాసురులు
[ 20-04-2024]
పేదలకు దక్కాల్సిన డీకేటీ భూములు వైకాపా అభ్యర్థుల సొంతమయ్యాయి. ఈ మేరకు వారే ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్లలో పేర్కొనడం గమనార్హం. -
చీకట్లోనే తనిఖీలు.. చిక్కేరా ఉల్లం‘ఘనులు’
[ 20-04-2024]
అసలే చంద్రగిరి.. తాయిలాలు.. ప్రలోభాలు తారస్థాయిలో జరుగుతున్న వేళ నియోజకవర్గంలోని ఓ తనిఖీ కేంద్రం దుస్థితి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. -
లోక్సభకు 3.. శాసనసభకు 17
[ 20-04-2024]
జిల్లా వ్యాప్తంగా రెండోరోజు తిరుపతి లోక్సభ స్థానానికి మూడు, ఏడు శాసనసభ స్థానాలకు 17 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు -
కుప్పం గడ్డ.. చంద్రబాబు అడ్డా
[ 20-04-2024]
పురపాలిక పరిధిలోని లక్ష్మీపురం శ్రీవరదరాజులస్వామి దేవాలయంలో నారా భువనేశ్వరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. -
‘గురు’తర బాధ్యత ఇదేనా జగన్?
[ 20-04-2024]
బోధన సరిగ్గా చేయడంలేదంటూ చిత్తూరు మండలంలోని మాపాక్షి జడ్పీ పాఠశాలలోని హెచ్ఎంను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అందరి ఎదుటే మందలించారు. -
నిబంధన మీరి.. దూసుకొచ్చి..
[ 20-04-2024]
నామినేషన్ దాఖలు సమయంలో ఆర్వో కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు నిలిచిపోవాలన్న నిబంధనను పుంగనూరులో వైకాపా శ్రేణులు అతిక్రమించాయి -
వైకాపా రంగుల పలకలు తొలగించారు
[ 20-04-2024]
పోలింగ్ కేంద్రాలు కల్గిన బడి ఆవరణలో వైకాపా రంగులతో ఏర్పాటు చేసిన సిమెంటు బెంచీలకు రంగుల పలకలను అధికారులు తీయించారు. -
రాష్ట్ర విభజనకు కారకుడైన కిరణ్కుమార్రెడ్డి
[ 20-04-2024]
ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకొచ్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. -
తెదేపా నేతపై దాడి
[ 20-04-2024]
పులిచెర్ల మండలం రేణుమాకులపల్లె పంచాయతీ బి.వడ్డిపల్లెకు చెందిన తెదేపా నాయకుడు సుబ్బరాజుపై స్థానిక వైకాపాకి చెందిన రెడ్డప్ప, వెంకటరమణ అన్నదమ్ములు దాడి పాల్పడ్డారు -
నేడు జిల్లాకు తెదేపా అధినేత రాక
[ 20-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు జిల్లాలో శనివారం పర్యటించనున్నారు. ఉదయం 10:40 గంటలకు గూడూరులోని వరగాలి క్రాస్రోడ్డు సమీపంలోని హెలిపాడ్ చేరుకుంటారు.