యువికా.. అంతరిక్ష కలల వేదిక
ఈ విశ్వం నిగూఢ రహస్యాల అనంత నిధి.. ఎందుకు.. ఎలా.. అన్న కుతూహలమే దాన్ని ఛేదించే ఏకైక ఆయుధం. విద్యార్థిదశలోనే ప్రతిభగల చిన్నారులను గుర్తించి వారికి అంతరిక్ష సాంకేతికత, పరిజ్ఞానం, అనువర్తనాలపై అవగాహన కల్పించి భావి శాస్త్రవేత్తలను తయారు చేయడం లక్ష్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అడుగులు వేస్తోంది.
ఇస్రో ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
నమోదుకు ఏప్రిల్ 3 ఆఖరు తేదీ
శ్రీహరికోట: ఈ విశ్వం నిగూఢ రహస్యాల అనంత నిధి.. ఎందుకు.. ఎలా.. అన్న కుతూహలమే దాన్ని ఛేదించే ఏకైక ఆయుధం. విద్యార్థిదశలోనే ప్రతిభగల చిన్నారులను గుర్తించి వారికి అంతరిక్ష సాంకేతికత, పరిజ్ఞానం, అనువర్తనాలపై అవగాహన కల్పించి భావి శాస్త్రవేత్తలను తయారు చేయడం లక్ష్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అడుగులు వేస్తోంది. యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా-2023) పేరుతో ఇస్రో ‘యువ శాస్త్రవేత్తల’ కార్యక్రమానికి 2019లో శ్రీకారం చుట్టింది. అప్పటి ఇస్రో అధిపతి డా.శివన్ ‘సంవాద్ విత్ స్టూడెంట్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమమే నాసా నిర్వహిస్తోంది. ఇదే తరహాలోనే ఇస్రో దేశంలోని గ్రామీణ విద్యార్థులు సైన్సు పట్ల ఆకర్షితులయ్యేలా... సంబంధిత రంగాల్లో వారిని నిష్ణాతులుగా తయారు చేయడమే యువికా లక్ష్యం. ఈ ఏడాది మే 15 నుంచి 26 వరకు రెండువారాలపాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది.
రెండు జిల్లాల విద్యార్థులకు అవకాశం
చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఈ ఏడాది ఎనిమిదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి, 9వ తరగతిలో ప్రవేశించే విద్యార్థులు ఇందుకు అర్హులు. ఇందులో తిరుపతి జిల్లాలో 18,920, చిత్తూరు జిల్లాలో 18,253 మంది ఉన్నారు. వీరందరికీ యువికా ఓ సువర్ణావకాశం. ఇస్రో అధిపతితో ముఖాముఖిలో పాల్గొనే అవకాశం ఉంటుంది.
* దేశ వ్యాప్తంగా 120 మంది విద్యార్థులను యువికా కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేలా ఇస్రో ప్రణాళికలు రూపొందించింది. 2023-24లో తొమ్మిదో తరగతి చదువనున్న విద్యార్థులను ఎంపిక చేస్తారు. కార్యక్రమానికి ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేస్తారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, రాష్ట్ర సిలబస్ చదివే విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం. ఇస్రోలోని వివిధ అంశాలపై అవగాహన కల్పించి, సీనియర్ శాస్త్రవేత్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. విద్యార్థులకు అవసరమైన పరిశోధన, ఉపగ్రహాల తయారీపై ఆచరణాత్మక(ప్రాక్టికల్) అనుభవాన్ని పెంపొందిస్తారు. విద్యార్థుల పూర్తి ఖర్చులను ఇస్రోనే భరిస్తుంది. వసతి, భోజనం కల్పిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిలోద‘కౌలు’
[ 24-04-2024]
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. కౌలుదారీ చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి రైతులు నష్టపోకుండా ఆదుకుంటాం. కౌలురైతులకు గుర్తింపు కార్డులిచ్చి బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు అందేలా చేస్తాం’. -
‘సిద్ధం సభలు వెలవెలబోతున్నాయి’
[ 24-04-2024]
సీఎం జగన్ కోడికత్తి తరహాలో ప్రజల సానుభూతి పొందాలన్న ప్రయత్నం విఫలైంది.. నుదుటిపై చిన్నపాటి దెబ్బ తగిలితే ఆ పార్టీ నాయకులు హత్యాయత్నం అంటూ హడావుడి చేస్తున్నారు.. అని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. -
బ్యానర్లు తొలగించరు.. నిబంధనలు వర్తింపజేయరు
[ 24-04-2024]
గత నాలుగు రోజుల్లో వరుసగా ఉల్లంఘనలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల అధికారులు సైతం పక్షపాతం చూపుతూ వైకాపా నాయకులైతే ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతున్నారు. -
గోపాలమిత్ర.. జగన్ మౌన పాత్ర
[ 24-04-2024]
మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా.. నన్ను గెలిపించండి.. మీ వెన్నంటి ఉంటా.. -
ఐదోరోజు 24 నామినేషన్ల దాఖలు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. చిత్తూరు ఎంపీ స్థానానికి సంబంధించి రిటర్నింగ్ అధికారి షన్మోహన్కు.. అభ్యర్థులు జగపతి (కాంగ్రెస్), రమేష్ (ఆలిండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ), భూలక్ష్మి(పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), జయకర్(స్వతంత్ర) నామినేషన్లు సమర్పించారు. -
ఏడేళ్ల చిన్నారికి పెద్ద కష్టం
[ 24-04-2024]
పట్టణంలోని ఈస్టుపేటకు చెందిన ఆటో డ్రైవర్ ప్రేమకుమార్, సుభాషిణి దంపతుల కుమార్తె జెస్సిక (7). ఏడాది కిందట తీవ్ర అనారోగ్యానికి గురైంది. -
‘వైకాపాను నమ్ముకొని.. నడిరోడ్డుపైకి వచ్చా’
[ 24-04-2024]
వైకాపా ఆవిర్భావం నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తే తగిన ప్రాధాన్యం దక్కలేదని 11వ డివిజన్ వైకాపా నాయకుడు, మాజీ కార్పొరేటర్ మార్తాళ్ భర్త శివకుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. -
నమ్ముకుంటే.. మోసపోయాం
[ 24-04-2024]
రాత్రింబవళ్లు పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషిచేసిన గోపాలమిత్రల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది.. తాను అధికారంలోకి రాగానే గోపాలమిత్రలను క్రమబద్ధీకరించి, వేతనాలు పెంచుతానని ప్రజాసంకల్ప పాదయాత్రలో నేటి సీఎం జగన్ నాడు హామీ ఇచ్చారు. -
‘అరాచక పాలనకు అంతం పలకాలి’
[ 24-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెదేపా ప్రచారం జోరందుకుంది. చిత్తూరు నగరం, గుడిపాల, చిత్తూరు గ్రామీణ మండలాల్లో నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. -
బస్టాండా.. అదెక్కడ..?
[ 24-04-2024]
నియోజకవర్గ కేంద్రమైన జీడీనెల్లూరులో బస్టాండు, బస్షెల్టరు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజూ ఇక్కడి నుంచి చిత్తూరు, తిరుపతి, వేలూరు, బెంగుళూరు, చెన్నై నగరాలతోపాటు సరిహద్దున ఉన్న తమిళనాడు, కర్నాటక రాష్ట్ర ప్రాంతాలకు బస్సులు ఎక్కుతుంటారు. -
కుమారుడి కోసమే ‘కరుణ’
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తన కుమారుడు అభినయ్రెడ్డిని గెలిపించుకునేందుకు తిరుపతి ఎమ్మెల్యే, తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తాపత్రయపడుతున్నా కాలం కలసి రావడం లేదు. -
వైకాపాకు వర్తించని నిబంధనలు.. అడుగడుగునా ఉల్లంఘనలు
[ 24-04-2024]
సత్యవేడు వైకాపా అభ్యర్థి నూకతోటి రాజేష్ నామినేషన్ కార్యక్రమంలో మంగళవారం ఎన్నికల నిబంధనలను గాలికి వదిలేసినా అధికారులు పట్టించుకోలేదు.
తాజా వార్తలు (Latest News)
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!