అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
గుడుపల్లె మండలం కనమనపల్లెలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. బంధువులు, పోలీసుల కథనం మేరకు..
కుప్పం పట్టణం/గుడుపల్లె, న్యూస్టుడే: గుడుపల్లె మండలం కనమనపల్లెలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. బంధువులు, పోలీసుల కథనం మేరకు.. కనమనపల్లెకు చెందిన వెంకటేష్కు, కుప్పం మండలం ఉర్లఓబనపల్లె గ్రామానికి చెందిన మంజుల(24)తో నాలుగేళ్ల కిందట వివాహమైంది. కొంత కాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మంజులను ఆస్పత్రిలో చేర్పించామని ఓ ఆటో డ్రైవర్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. వారు అక్కడికి వెళ్లగా మంజుల ఉరేసుకుని మృతి చెందిందని చెప్పి శవాన్ని చూపారని ఆమె తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. భర్త వెంకటేష్, వారి తల్లిదండ్రుల ఆచూకీ లేదని, వారే మంజులను హత్య చేశారని న్యాయం చేయాలని కుప్పం ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. అక్కడికి చేరుకున్న గ్రామీణ సీఐ రియాజ్ అహ్మద్ నచ్చజెప్పడంతో నిరసన విరమించారు. భర్తే మంజులను హత్య చేశాడని మృతురాలి తండ్రి మునస్వామి గుడుపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఏఎస్సై బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుప్పంలో నిరసన తెలుపుతున్న బంధువులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!