logo

నేడు ఫీడ్‌మిక్సింగ్‌, అగరబత్తీ ప్లాంట్ల ప్రారంభం

తితిదే ఎస్వీ గో సంరక్షణశాలలో నూతనంగా నిర్మించిన ఫీడ్‌మిక్సింగ్‌ ప్లాంటు, అగరబత్తీల రెండో యూనిట్‌ను జేఈవో సదా భార్గవి గురువారం పరిశీలించారు.

Published : 31 Mar 2023 02:32 IST

ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌ను పరిశీలిస్తున్న జేఈవో సదా భార్గవి

తిరుపతి(గ్రామీణ), న్యూస్‌టుడే: తితిదే ఎస్వీ గో సంరక్షణశాలలో నూతనంగా నిర్మించిన ఫీడ్‌మిక్సింగ్‌ ప్లాంటు, అగరబత్తీల రెండో యూనిట్‌ను జేఈవో సదా భార్గవి గురువారం పరిశీలించారు. శుక్రవారం ఉదయం తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఈ రెండు ప్లాంట్లను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై జేఈవో ఆరాతీశారు. కార్యక్రమంలో సీఈ నాగేశ్వరరావు, గోశాల సంచాలకులు డాక్టర్‌ హరినాథరెడ్డి, ఈఈలు మనోహర్‌, మురళీకృష్ణ, డీఈ సరస్వతి, గోశాల సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని