logo

గుర్తుతెలియని వృద్ధుడి ఆత్మహత్య

స్థానిక కీళ్లపట్టు సమీపంలో తిరుపతి-చెన్నై జాతీయ రహదారి వంతెన కింద, గుర్తుతెలియని వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై శివశంకర్‌ తెలిపారు.

Published : 31 Mar 2023 02:32 IST

నగరి: స్థానిక కీళ్లపట్టు సమీపంలో తిరుపతి-చెన్నై జాతీయ రహదారి వంతెన కింద, గుర్తుతెలియని వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై శివశంకర్‌ తెలిపారు. సుమారు 60 నుంచి 65 సంవత్సరాలు వయస్సు ఉంటుందని, మృతదేహం సమీపంలో పురుగుల మందు డబ్బా ఉందని, గురువారం మధ్యాహ్నం స్థానికుల సమాచారంతో పరిశీలించామన్నారు. మృతుడి వివరాలు తెలియరాలేదని, బనియన్‌, పంచతో ఉన్నాడని, మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని