logo

‘కుటుంబ పార్టీలతో పొత్తులకు భాజపా వ్యతిరేకం’

ఏపీలో కుటుంబ పార్టీలతో పొత్తులకు భాజపా పూర్తి వ్యతిరేకమని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని శుక్రవారం ఉదయం దర్శించుకొని స్థానిక విలేకరులతో మాట్లాడారు.

Published : 01 Apr 2023 03:13 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు స్వామివారి జ్ఞాపిక అందిస్తున్న ఈవో వెంకటేశు

కాణిపాకం, న్యూస్‌టుడే: ఏపీలో కుటుంబ పార్టీలతో పొత్తులకు భాజపా పూర్తి వ్యతిరేకమని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని శుక్రవారం ఉదయం దర్శించుకొని స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం జనసేనతో మాత్రమే తమ పొత్తు ఉంటుందన్నారు. రాష్ట్రంలోని ప్రకృతి సంపదను వైకాపా నాయకులు కొల్లగొడుతున్నారని వివరించారు. అనంతరం మండలంలోని పుల్లూరు ఎస్సీవాడలో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో భాజపా జిల్లా ఇన్‌ఛార్జి కోలా ఆనంద్‌, జిల్లా అధ్యక్షుడు రామచంద్రుడు, కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు పెరుమాళ్‌ సుబ్బారెడ్డి, హేమచంద్రారెడ్డి, లక్ష్మీప్రసాద్‌, కుమార్‌ పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం ప్రారంభం.. చిత్తూరు(క్రీడలు): చిత్తూరులో నిర్మించిన నూతన పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యాలయానికి అటల్‌ బిహారీ వాజ్‌పేయీ భవనంగా నామకరణం చేశారు.  అనంతరం కార్యకర్తలతో సోమువీర్రాజు సమావేశం నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని