logo

కోటమ్మదేవతకు వెండి కిరీటం

స్థానిక కోటమ్మదేవతకు రెడ్‌విల్స్‌కు చెందిన దివంగత దామోదర్‌నాయుడు, విమల జ్ఞాపకార్థం కుమారులైన ముత్తుకుమార్‌, ముత్తురాజా వెండి కిరీటాన్ని శుక్రవారం అందజేశారు.

Published : 01 Apr 2023 03:13 IST

వెండి కిరీటం

కోట, న్యూస్‌టుడే: స్థానిక కోటమ్మదేవతకు రెడ్‌విల్స్‌కు చెందిన దివంగత దామోదర్‌నాయుడు, విమల జ్ఞాపకార్థం కుమారులైన ముత్తుకుమార్‌, ముత్తురాజా వెండి కిరీటాన్ని శుక్రవారం అందజేశారు. రూ.5లక్షల విలువైన 5కేజీలకు పైగా వెండితో దీన్ని తయారు చేయించినట్లు ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం అమ్మవారికి దాతల చేతులు మీదగా అలంకరించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. దాతలు స్వచ్ఛందంగా ముందుకువచ్చి వెండికిరీటం అందించడం అభినందనీయమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని