logo

ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం

ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని పారిశ్రామికవేత్త రామచంద్రయాద్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని 81.ఉప్పరపల్లె పంచాయతీ గురికానివారిపల్లెలో అనార్యోగంతో బాధపడుతున్న తెదేపా కార్యకర్త గురుస్వామిని పరామర్శించి రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

Published : 01 Apr 2023 03:09 IST

రామచంద్రయాదవ్‌ను సన్మానిస్తున్న గ్రామస్థులు

సోమల, న్యూస్‌టుడే: ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని పారిశ్రామికవేత్త రామచంద్రయాద్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని 81.ఉప్పరపల్లె పంచాయతీ గురికానివారిపల్లెలో అనార్యోగంతో బాధపడుతున్న తెదేపా కార్యకర్త గురుస్వామిని పరామర్శించి రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఏనుగుల దాడిలో నష్టపోయిన శీలయ్యగారిపల్లెకు చెందిన రైతు భాస్కర్‌కు రూ.10 వేలు, రోడ్డుప్రమాదంలో గాయపడిన శీలంవారిపల్లెకు చెందిన వసంతకుమార్‌కు రూ.10 వేలు, నంజంపేట పాపయ్య కుమార్తె వైద్యకోసం రూ.20 వేలు ఆయన ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇటీవల కమ్మపల్లె శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి ఆయన రూ.లక్ష విరాళం ఇవ్వడంతో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు ఘనంగా సన్మానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని