logo

మొక్కు తీర్చుకున్న తేజస్విని

స్థానిక విరూపాక్షి మారెమ్మ దేవతను శుక్రవారం తెదేపా నాయకురాలు డీకే తేజస్విని దర్శించుకున్నారు. చిత్తూరు మాజీ ఎంపీ స్వర్గీయ డీకే ఆదికేశవులు, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ సత్యప్రభల కుమార్తె డీకే తేజస్విని గతంలో ఈ ఆలయానికి రాగా.. నిత్యదీపం వెలిగిస్తానని మొక్కుకున్నారు.

Published : 01 Apr 2023 03:09 IST

అమ్మవారిని దర్శించుకున్న తెదేపా నేతలు తేజస్విని, అనీషారెడ్డి, శ్రీనాథరెడ్డి

పుంగనూరు, న్యూస్‌టుడే: స్థానిక విరూపాక్షి మారెమ్మ దేవతను శుక్రవారం తెదేపా నాయకురాలు డీకే తేజస్విని దర్శించుకున్నారు. చిత్తూరు మాజీ ఎంపీ స్వర్గీయ డీకే ఆదికేశవులు, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ సత్యప్రభల కుమార్తె డీకే తేజస్విని గతంలో ఈ ఆలయానికి రాగా.. నిత్యదీపం వెలిగిస్తానని మొక్కుకున్నారు. ఆ మొక్కు తీర్చుకోవడానికి వచ్చిన ఆమెకు ఆలయ కమిటీ తరఫున స్వాగతించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెదేపా నాయకులు ఎన్‌.శ్రీనాథరెడ్డి, అనీషారెడ్డి, పట్టణ, మండల నాయకులు రమణ, షాజహాన్‌, పులి వెంకటరమణ, చంద్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని