ముందుకు సాగని ఆధునికీకరణ పనులు
జలవనరుల శాఖ పనుల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. చేసిన పనులకు బిల్లులు రాని కారణంగా గుత్తేదారులు పనులు నిలిపేశారు.
బకాయిలు రూ.20 కోట్ల పైనే
మూడేళ్లుగా కొనసాగుతున్న వైనం
అసంపూర్తిగా పాలచ్చూరు ప్రధాన కాలువ
గూడూరు, న్యూస్టుడే: జలవనరుల శాఖ పనుల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. చేసిన పనులకు బిల్లులు రాని కారణంగా గుత్తేదారులు పనులు నిలిపేశారు. 2019-20లో నియోజకవర్గంలోని నాలుగు పనులకు రూ.కోట్లలో నిధులు విడుదలయ్యాయి. అప్పట్లో జలవనరుల శాఖ మంత్రి అనీల్ ఇక్కడ పర్యటించి స్థానిక శాసన సభ్యులు సంజీవయ్య సూచనతో నిధులు మంజూరు చేశారు. దీంతో కాలువ అధునికీకరణకు శ్రీకారం చుట్టి పనులు ప్రారంభించారు. ఇలా తొలి దశలో పనులు చేపట్టిన గుత్తేదారులకు బిల్లుల బకాయిలు ఉండటంతో ఎక్కడ పనులు అక్కడే ఆపేశారు. ఈ ఆర్థిక సంవత్సరం చివర్లోనైనా బిల్లులు వస్తాయన్న ఆశతో ఉన్న వారికి నిరాశే మిగిలింది. ఈ ప్రభావం పనులు మీదు పడుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
* గూడూరు ఇరిగేషన్ డివిజన్ సూళ్లూరుపేట నియోజకవర్గంలో 4 పనులకు గాను రూ.71.54 కోట్లు విడుదలైయ్యాయి. అప్పట్లోనే టెండర్లు పిలవడంతో మూడు పనులు మొదలు పెట్టారు. కాళంగి మీద గ్రాయిన్ పనులకు గుత్తేదారులు ముందుకు రాకపోవంతో అంచనాలు మార్చి మళ్లీ టెండర్లు పిలిచారు. ప్రస్తుతం చేపట్టిన పనులు బిల్లులు సుమారుగా రూ.20 కోట్ల రావాల్సి ఉండటంతో గుత్తేదారులు పనులు చేయడానికి ముందుకు రావడంలేదు. పాలచ్చూరు ట్యాంక్ సిస్టమ్ అధునికీకరణ పనులకు రూ.31.65 కోట్లు మంజూరు చేశారు. పెళ్లకూరు, నాయుడుపేట, ఓజిలి మండలాలు మీదగా 23కి.మీ మేర కాలువకు కాంక్రీట్ లైనింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. గుత్తేదారుకు సుమారుగా రూ.16 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు తెలిసింది. సదరు పని పెళ్లకూరు, నాయుడుపేట మండలాల్లో 5 కి.మీ కాంక్రీట్ పూర్తి చేశారు. కాలువల్లో పూడిక తొలగించడం అక్కడక్కడ కొన్నిచోట్ల చిన్న వంతెనులు పూర్తి కాగా బిల్లులు ఆలస్యం కావడంతో కాంట్రాక్టర్ పనులు ఆపేశారు.
* దొరవారిసత్రం, సూళ్లూరుపేట, తడ మండలాల్లో ప్రవహించే నెర్రి కాలువ పనుల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ఈ కాలువ అధునికీకరణకు రూ.27.19 కోట్లు విడుదలైయ్యాయి. దొరవారిసత్రం మండలంలో సుమారుగా కి.మీ మేర పని చేశారు. సూళ్లూరుపేటలో రూ.5 కోట్ల మేర పనులు చేపట్టారు. పూర్తయిన పనులకు గాను రూ.2.50 కోట్లు బిల్లులు రావాల్సి ఉంది. ఈ పనులు ఎక్కడి కక్కడే ఆగిపోయాయి. నెర్రి కాలువ ద్వారా మూడు మండలాల్లో సాగు, తాగునీటి అవసరాలు తీర్చే అవకాశముంది. రైతులు ఎంతో కాలంగా ఆక్రమణలకు గురికావడం, పూడికతో ఇబ్బంది పడేవారు. అధునికీకరణతో అవస్థలు తీరుతాయన్న ఆశతో ఉండగా బిల్లుల గండం గుదిబండగా మారింది.
* తడ మండలం ఎన్ఎమ్ కండ్రిగ దగ్గర పాముల కాలువ ఆనకట్టకు రూ.3.96 కోట్లు మంజూరు చేశారు. టెండర్లు పూర్తి చేసి ఇక్కడ 50 శాతం మేర పనులు పూర్తి చేశారు. పనులు చేసిన గుత్తేదారుకు రూ.1.89 కోట్లు బిల్లులు రావాల్సి ఉంది. దీంతో గుత్తేదారులు పనులు చేపట్టడానికి ముందుకు రావడంలేదు. ఇలా ఇక్కడ రైతుల ఆశలు అడియాసలుగా మారాయి. ఏటా వరదల సమయంలో ఇక్కడ కలుజు కొట్టుకు పోయే పరిస్థితి కాగా దానిని శాశ్వత పద్ధతిలో చేపట్టడానికి నిధులు మంజూరు కాగా ఆపనులు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ఇదే మండలం వాటంబేడు దగ్గర కాళంగి నదిపై గ్రాయిన్ నిర్మించడానికి రూ.8.28 కోట్లు విడుదల చేసి రెండు దఫాలు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందు రాలేదు. తాజాగా అంచనాలు పెంచి మళ్లీ టెండర్లు పిలిచిన జలవనరుల శాఖ ఏప్రిల్ ఆఖరులో పనులు అప్పగించనుంది. ఇలా మూడేళ్లుగా జలవనరుల శాఖ పనులు చేపట్టడానికి గుత్తేదారులు ముందు రాని పరిస్థితి నెలకొంది.
బిల్లులు రాగానే మళ్లీ పనులు మొదలు
చేపట్టిన పనులకు బిల్లులు పంపించాం. బకాయిలు ఉండటంతో గుత్తేదారులు పనులు నిలిపేశారు. బిల్లులు రాగానే మళ్లీ పనులు పారంభించి పూర్తి చేస్తాం.
సురేష్బాబు, కార్యనిర్వాహక ఇంజినీర్, జలవనరుల శాఖ, గూడూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెరువులను చెరబడుతున్న వైకాపా నేతలు
[ 29-03-2024]
వైకాపా నేతల కబంధ హస్తాల్లో చెరువులు చిక్కుకున్నాయి. కుదిరితే కబ్జా చెయ్.. లేదంటే మట్టి తవ్వి సొమ్ము చేసుకో అన్న చందంగా వైకాపా నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. -
భూసార పరీక్షలెక్కడ జగనన్నా..!
[ 29-03-2024]
భూమిలో సూక్ష్మ పోషకాల లోపాన్ని తెలుసుకుని తదనుగుణంగా చర్యలు చేపడితే అన్నదాతలు అధిక దిగుబడులు సాధించి అప్పుల ఊబి నుంచి బయటపడతారన్నది ఉద్దేశం.. అందుకు భూసార పరీక్షలు తప్పనిసరి. -
స్వర్ణరథంపై ప్రమాణాల స్వామి విహారం
[ 29-03-2024]
శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారు సిద్ధిబుద్ధి సమేతుడై స్వర్ణరథంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ గురువారం రాత్రి భక్తులను అలరించారు. -
అల్పాదాయాల్లోనే.. స్వయం సహాయక సంఘాలు
[ 29-03-2024]
గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలను వైకాపా సర్కార్ ఉపయోగించుకోవడం లేదు. 80 శాతం రాయితీతో స్వయం సహాయ సంఘాలకు ఇచ్చే రుణం సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేదు. -
నియమావళి అమలు చేయాలనిపిస్తేగా?
[ 29-03-2024]
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి పది రోజులు దాటింది. కోడ్ను పక్కాగా అమలు చేయాల్సిన యంత్రాంగం కొన్నిచోట్ల తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. నేటికీ కొన్నిచోట్ల అధికార వైకాపా రంగులు దర్శన మిస్తూనే ఉన్నాయి. -
‘ఓటమి భయంతోనే దోచుకున్న సొత్తు విదేశాలకు’
[ 29-03-2024]
ఓటమి భయంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దోచుకున్న ధనాన్ని విదేశాలకు తరలిస్తున్నారని చిత్తూరు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు, గురజాల జగన్మోహన్ ఆరోపించారు. స్థానిక తెదేపా జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. -
ప్రైవేటు వాహనానికి ప్రభుత్వ స్టిక్కర్
[ 29-03-2024]
ఆయన అధికార పార్టీ మండల స్థాయి నాయకుడు.. ఆయన కోడలు రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్పర్సన్ వారి స్వంత వాహనంపై ప్రభుత్వ వాహనమంటూ స్టిక్కర్ తలిగించుకున్నారు. -
అధికారుల అనుమతి తర్వాతే వాలంటీర్ల రాజీనామాకు ఆమోదం
[ 29-03-2024]
ప్రభుత్వ భవనాలపై పార్టీ రంగులుంటే అవి అభ్యంతరాల కింద రావు. ఆ రంగులు ఎప్పట్నుంచో ఉన్నవే. ప్రభుత్వ భవనాలపై పార్టీ చిహ్నాలు, నేతల ఫొటోలు ఉంటే ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. -
గరం గరం.. పశుగ్రాసం
[ 29-03-2024]
వర్షాలు ఎండమావులయ్యాయి.. చెరువులు, కుంటలు బీటలు వారాయి.. భూగర్భ జలాలు అండుగంటిపోయాయి.. సాగు భూములు బీళ్లుగా మారుతున్నాయి.. ఈ క్రమంలో పశుగ్రాసం కొరత తీవ్రమైంది.. పశుపోషణకు రైతన్నలు నానా తంటాలు పడుతున్నారు. -
పుంగనూరులో ట్రేడింగ్ మోసగాడు
[ 29-03-2024]
తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ఆశ చూపి ట్రేడింగ్ మోసానికి పాల్పడుతున్న ఇద్దరిని తెలంగాణ రాజధాని సైబరాబాబ్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. -
జగన్ సర్కార్పై మత్స్యకారులు గుర్రు
[ 29-03-2024]
‘మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వైకాపా అడుగు ముందుకేస్తోంది. వాకాడు మండలం రాయదొరువు వద్ద మత్స్యకారుల వలసల నివారణ, స్థితిగతులు మెరుగు పరచడానికి ఇక్కడ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం’. -
చెరబట్టి.. నీరు వెల్లగొట్టి..!
[ 29-03-2024]
భానుడి ప్రతాపంతో ఎండాకాలంలో దాహార్తి తిప్పలు తప్పవని ముందే గుర్తించినా వైకాపా నేతల ఆక్రమణల పర్వంతో జిల్లాలోని అత్యధిక చెరువులు నీరు లేక ఒట్టిపోయాయి. -
అరాచకాన్ని వీడి.. ప్రగతి బాట
[ 29-03-2024]
రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న అరాచక పాలనకు చరమగీతం పాడే రోజు సమీపిస్తోందని వైకాపా నేతలు గ్రహిస్తున్నారు. -
దేవుడి పేరు చెప్పి.. కాలువ కబ్జా..!
[ 29-03-2024]
అధికార పార్టీ నేతలకు చెరువులు.. పంట కాలువలంటే లెక్కలేకుండాపోయింది. నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఏకంగా తుమ్మలగుంట చెరువునే మాయం చేసినట్లు ఆరోపణలుండగా చోటామోటా నాయకులు కాలువ పోరంబోకు భూములపై పడుతున్నారు. -
తిరుమల నడకదారిలో చిరుత
[ 29-03-2024]
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోమారు చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈనెల 25, 26వ తేదీ తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని, అటవీశాఖ ఏర్పాటుచేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత సంచారం గుర్తించినట్లు తితిదే అటవీశాఖ డీఎఫ్వో శ్రీనివాసులు వెల్లడించారు. -
బహిర్గతమైన వైకాపా కుమ్ములాటలు
[ 29-03-2024]
కేవీబీపురం వైకాపాలో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గురువారం రాత్రి వైకాపా మండల బీసీˆసెల్ అధ్యక్షుడు హరిబాబు, మండల కోఆప్షన్ మెంబర్ జాకీర్ హుస్సేన్ మధ్య జరిగిన గొడవలే నిదర్శనం. -
పీ అండ్ పీవో వ్యవస్థ నిర్వీర్యం
[ 29-03-2024]
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎప్పటికప్పుడు కొత్త వాహకనౌకలను రూపొందించి, మానవాళి అవసరాలకు అనుగుణంగా ఉపగ్రహాలను తయారు చేసి, కక్ష్యలోకి పంపుతోంది. -
ఊరించి.. కొర్రీలతో వంచించి
[ 29-03-2024]
మీకు నేనున్నా.. మీ కష్టనష్టాలు తీరుస్తా.. అంటూ తన పాదయాత్ర సమయంలో ఇంటర్, డిగ్రీ ఒప్పంద అధ్యాపకులకు హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి జగనన్న చివరకు మాటతప్పి మడమ తిప్పేశారు. -
ఈ లెక్కలు బయటకు రావా..?
[ 29-03-2024]
కులగణన సర్వే ప్రక్రియ ముగిసినా.. ప్రభుత్వం దాని వివరాలు నేటికీ వెల్లడించలేదు. ఎన్నికలకు ముందు హడావుడిగా చేపట్టిన సర్వే ప్రక్రియ జిల్లాలో ఫిబ్రవరిలోనే ముగిసింది.