‘నిధులు లేకుండా పనులు ఎలా పెడతారు’
నిధులు లేకుండా కౌన్సిల్ సమావేశంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అజెండాలో ఎలా పెడతారంటూ కౌన్సిలర్లు ఢిల్లీబాబు, శంకరయ్య, రాధమ్మ ప్రశ్నించారు.
కౌన్సిలర్తో కౌన్సిలర్ ఢిల్లీబాబు వాగ్వాదం
వెంకటగిరి, న్యూస్టుడే: నిధులు లేకుండా కౌన్సిల్ సమావేశంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అజెండాలో ఎలా పెడతారంటూ కౌన్సిలర్లు ఢిల్లీబాబు, శంకరయ్య, రాధమ్మ ప్రశ్నించారు. పుర కార్యాలయంలో శుక్రవారం అధ్యక్షురాలు నక్కా భానుప్రియ ఆధ్వర్యంలో కౌన్సిల్, బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీబాబు మాట్లాడుతూ తన వార్డులో 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ.16.50 లక్షలు మేర పనులు చేసినట్లు రికార్డులు పరంగా పెట్టారని పనులు చేయకుండానే ఇలా చేయడం ఏమిటని అధికారులను నిలదీశారు. మరో కౌన్సిలర్ జానకీరామయ్య అడ్డు కోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బొగ్గులమిట్టలో వీధిదీపాలు, స్తంభాలు ఏర్పాటు చేసేందుకు గతంలో అనుమతులు ఇచ్చిన ఆరు నెలలు కావస్తున్నా నేటికీ పట్టించుకోలేదని వార్డులో ఏ మోహం పెట్టుకుని తిరగాలని కౌన్సిలర్ శంకరయ్య అధికారులను నిలదీశారు. వెంకటగిరి అభివృధ్దికి ఎన్నలేని కృషి చేసిన మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. టిడ్కో ఇళ్లకు గతంలో లబ్ధిదారులు నగదు చెల్లించినా నేటికీ అప్పగించకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని కౌన్సిలర్ గోపాలకృష్ణ అన్నారు.
బడ్జెట సమావేశంలో కౌన్సిలర్లు డుమ్మా
మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతో కీలకమైన బడ్జెట్ సమావేశం మధ్యాహ్నం నుంచి ప్రారంభించారు. ఈ క్రమంలో 25 మంది కౌన్సిలర్లు ఉంటే వీరిలో కేవలం పుర అధ్యక్షురాలితో సహా 12 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. బడ్జెటలో ప్రారంభ నిల్వగా రూ.2,87,17,795లు. జమలు రూ.85,52,43,810 కోట్లు, మూలధన ఖర్చులు రూ.60,81,00,265 కోట్లు, ముగింపు నిల్వగా రూ.27,58,61,340 కోట్లుతో బడ్జెట్ అంచనాలు రూపొందించగా కౌన్సిలర్లు ఆమోదించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
[ 19-04-2024]
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
మా ఇష్టం.. ‘అన్నీ పెద్దాయన’కే..
[ 19-04-2024]
ఆయనో ‘పెద్ద’ మంత్రి.. పైగా రాష్ట్రంలోనే నంబర్-2గా పేరుంది.. దీనికితోడు కీలక శాఖలన్నీ ఆయన గుప్పిట్లోనే ఉన్నాయి.. ఇంకేం ఆయన ఎవరికీ ఫలానా పనిచేయండి అని చెప్పనవసరం లేదు.. -
భర్తీ చేయక.. బాధపెట్టేరూ..!
[ 19-04-2024]
‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం’.. ప్రతిపక్షనేతగా ప్రజాసంకల్ప యాత్రలో జగన్ రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ ఇది. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
[ 19-04-2024]
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
ప్రజలు తెదేపా వైపు చూస్తున్నారు..
[ 19-04-2024]
రాష్ట్ర ప్రజలు వైకాపా పాలనతో విసిగిపోయి తెదేపా వైపు చూస్తున్నారని చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి వీఎం థామస్ అన్నారు. గురువారం పెనుమూరుకు చెందిన వైకాపా నాయకులు విశ్వప్రకాష్నాయుడు, -
‘వైకాపా పాలనకు రోజులు దగ్గరపడ్డాయి’
[ 19-04-2024]
నగరి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతిలోని తన స్వగృహం నుంచి బయల్దేరి తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలోని తన తండ్రి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడి... -
జగనన్న తీరేంటంటే.. ఐదేళ్లూ చూశామంతే..!
[ 19-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించుకోవడంలో జగనన్న పనితనం మామూలుగా లేదు.. ఎన్నికలకు ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ అని మాయమాటలు చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు సీఎం జగన్.. -
న్యాయమూర్తుల సేవలు స్ఫూర్తిదాయకం
[ 19-04-2024]
కేసుల పరిష్కారంలో న్యాయమూర్తుల సేవలు అందరికి స్ఫూర్తిదాయకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. గురువారం రాత్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసమూర్తి, -
‘చంద్రబాబు ప్రత్యర్థిగా జగన్ నిలబడినా ఓటమే’
[ 19-04-2024]
కుప్పం నుంచి ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి బరిలో నిలిచినా ఓటమి ఖాయమని, ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి దాన్ని వృథా చేసుకోవద్దని, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఓటేసి విలువను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కోరారు. -
అభివృద్ధి చేసినందునే మరోమారు టికెట్
[ 19-04-2024]
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినందునే వెంకటేగౌడకు ఈ దఫా టికెట్ దక్కిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. -
వర్క్ ఆర్డర్లు క్లోజ్ చేయకపోతే వేతనాల్లో రికవరీ
[ 19-04-2024]
వర్క్ ఆర్డర్లను నెలాఖరులోగా క్లోజ్ చేయకపోతే వేతనాల నుంచి రికవరీ చేస్తామని విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్ ఎస్ఏవో శ్రీనివాసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!