logo

పట్టు జారితే ప్రమాదమే!

చిత్తూరు జిల్లా కేంద్రంలోని పౌరసరఫరాల గోదాముల్లో నుంచి బియాన్ని ఆయా పరిసరాల చౌకధాన్యపు డిపోలకు తరలిస్తున్నారు.

Published : 01 Apr 2023 03:09 IST

చిత్తూరు జిల్లా కేంద్రంలోని పౌరసరఫరాల గోదాముల్లో నుంచి బియాన్ని ఆయా పరిసరాల చౌకధాన్యపు డిపోలకు తరలిస్తున్నారు. అయితే మోతాదుకు మించి బస్తాలు లారీల్లో తరలిస్తుండటంతో జారుతున్నాయి. దీన్ని గమనించిన ఓ కార్మికుడు వెంటనే ఆ బస్తాను కింద పడకుండా గట్టిగా పట్టుకుని ముందుకు సాగారు. చిత్తూరు నగరంలోని గాంధీ కూడలి నుంచి ఆర్టీసీకి వెళ్లే మార్గంలో ఈ దృశ్యం కనిపించింది. వేగంగా వెళ్తున్న వాహనంపై జారుతున్న బియ్యపు బస్తాను పట్టుకుని ప్రయాణిస్తుండగా దీనిని చూసిన వారు ఎక్కడ తమపై పడుతుందోనని భయబ్రాంతులకు గురయ్యారు.

ఈనాడు, చిత్తూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని