logo

RK Roja: నాలుగేళ్లలో చెప్పింది చేశాం: మంత్రి రోజా

రాష్ట్రంలో జగనన్నే మా భవిషత్తు కార్యక్రమాన్ని ధైర్యంగా చేస్తున్న ఏకైక పార్టీ వైకాపా అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆమె శుక్రవారం పూడి గ్రామంలో ప్రారంభించి మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల మంది 14 రోజులు పాటు  ప్రతి కుటుంబాన్ని సర్వే చేస్తున్నా రన్నారు.

Updated : 08 Apr 2023 07:46 IST

పూడి గ్రామంలో వివరాలు నమోదు చేసుకుంటున్న మంత్రి రోజా

వడమాలపేట: రాష్ట్రంలో జగనన్నే మా భవిషత్తు కార్యక్రమాన్ని ధైర్యంగా చేస్తున్న ఏకైక పార్టీ వైకాపా అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆమె శుక్రవారం పూడి గ్రామంలో ప్రారంభించి మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల మంది 14 రోజులు పాటు  ప్రతి కుటుంబాన్ని సర్వే చేస్తున్నా రన్నారు. గ్రామ సచివాలయ పరిధిలోని ప్రజల వద్దకు వెళ్లి ‘మీకు మేం చెప్పింది చేశాం.. సంతృప్తిగా ఉన్నారా, ఉంటే తమకు మద్దతు ఇవ్వండి, జగనన్నకు అండగా నిలబడండి’ అని తెలియజేస్తున్నా రన్నారు. నాలుగేళ్లలో జగనన్న పాలన చూస్తే ప్రజలు చంద్రబాబును అస్యహించు కుంటారని విమర్శించారు. ఎంపీపీ విజయలక్ష్మి, నాయకులు కుసుమ, రేణుక, కిరణ్‌కుమార్‌, మునిబాబు, వెంకట రెడ్డి, ఉపేంద్ర,, రాజశేఖర్‌, బాల పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని