Jagan Mohan Reddy: బ్రిటిషోళ్లదో సర్వే.. జగనన్నదో సర్వేనా!
భూములను సమగ్ర సర్వే చేసి ప్రతి రైతుకు భూహక్కు పత్రాలను అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ జగనన్న భూరక్ష’ పేరుతో రీసర్వేకు శ్రీకారం చుట్టింది.
శాటిలైట్ చిత్రాలతో పనులు
రాళ్లను నాటొద్దని అధికారులను అడ్డుకుంటున్న అన్నదాతలు
ఇదీ కుప్పంలో పరిస్థితి
సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ పక్కన వైకాపా నాయకుడి పొలంలో పడి ఉన్న సర్వే రాయి
కుప్పం గ్రామీణ: భూములను సమగ్ర సర్వే చేసి ప్రతి రైతుకు భూహక్కు పత్రాలను అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ జగనన్న భూరక్ష’ పేరుతో రీసర్వేకు శ్రీకారం చుట్టింది. తద్వారా మేలు చేకూరుతుందని రైతులంతా భావించారు. తీరా శాటిలైట్ చిత్రాలతో రీసర్వే పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. రాళ్లు నాటేందుకు పొలం వద్దకు వెళ్లిన రెవెన్యూ అధికారులకు రైతుల నుంచి చుక్కెదురవుతోంది. గతంలో ఉన్న సర్వేరాళ్లకు.. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం శాటిలైట్ సర్వే ద్వారా నాటే సర్వే రాళ్ల మధ్య వ్యత్యాసం ఉండటంతో అడుగడుగునా రైతులు నాటేందుకు నిరాకరిస్తున్నారు. బ్రిటిషోళ్లదో సర్వే.. జగనన్నదో సర్వేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒత్తిడా..? వైఫల్యమా..?
అధికారుల ఒత్తిడో లేక ప్రభుత్వ వైఫల్యమోగాని కుప్పం మండలం ములకలపల్లె గ్రామంలో రెవెన్యూ అధికారులు బలవంతంగా సర్వేరాళ్లు నాటినా వాటిని రైతులు పెకలించడమే కాదు.. ధ్వంసం చేస్తున్నారు. కుప్పం మండలం పెద్దబంగారునత్తం రెవెన్యూలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ వద్ద అనిమిగానిపల్లెకు చెందిన ఓ వైకాపా నేత తన పొలంలో నాటిన జగనన్న భూసర్వే రాయిని పెకలించడం చర్చనీయాంశమైంది. కుప్పం నియోజకవర్గంలో రెండు విడతలుగా 70 గ్రామాల్లో రీ సర్వే పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం గుడుపల్లె మండలంలో 12 గ్రామాలు, రామకుప్పంలో ఆరు, కుప్పంలో మూడు గ్రామాల్లో పూర్తిస్థాయిలో రీసర్వే రాళ్లను నాటగా.. శాంతిపురం మండలంలో ఈ మధ్యే సర్వేరాళ్లను నాటే పనులు చేపట్టారు.
మళ్లీ గొడవలు వస్తాయని
మా పక్క పొలం రైతులతో గొడవలు పడుతూ ఉండేవాళ్లం. అందుకే డబ్బులు కట్టి నాలుగు సార్లు సర్వే చేయించాం. మాకు గొడవలు లేకుండా రాళ్లు నాటుకున్నాం. ఇప్పుడేమో రీసర్వే పేరుతో వచ్చి పాత సర్వే రాళ్లను పట్టించుకోకుండా మా పొలం వైపు నాటారు. అందుకే మా ఇరుకుటుంబాల మధ్య మళ్లీ గొడవలు వస్తాయని రీ సర్వే రాయిని పగులగొట్టేశాం.
సాలమ్మ, మహిళా రైతు, ములకలపల్లి
పాతరాయి ఉన్నచోట నాటమంటే..
మా ఇంటి వద్ద ఉన్న పాత సర్వే రాయికి లోపు మేము ఇల్లు నిర్మించుకొన్నాం. ఇంటి పరిసరాల్లో కొబ్బరిచెట్లు కూడా పెంచుకున్నాం. ఇప్పుడేమో రీసర్వేకు వచ్చిన అధికారులు మా ఇంటివైపు సర్వేరాయి నాటేందుకు వచ్చారు. పాతరాయి ఉన్న స్థలాన్ని చూపించి పాతరాయి వద్దే నాటాలని వేడుకొన్నా పట్టించుకోలేదు. అందుకే నా ఇంటి వద్ద సర్వేరాయి నాటొద్దని అడ్డుకున్నా.
తిరుపతి, ములకలపల్లి
సర్వే చేయకుండా రాళ్లెందుకు?
మా ఊరికి సర్వే పేరుతో వచ్చారు. ఒకచోట కూర్చొని పాసుబుక్కులు తెమ్మని రాసుకొని వెళ్లారు. ఇప్పుడు మళ్లీ వచ్చి పొలానికి.. దోవకు ఐదారడుగులు లోపలికి రాళ్లు నాటారు. ఈ రాళ్ల వల్ల అన్నదమ్ములైన మాకు గొడవలు పెట్టారు. అందుకే మూడు సర్వే రాళ్లను పీకేశా. మా రికార్డుల ప్రకారం సర్వే చేస్తేనే రాళ్లు నాటేందుకు ఒప్పుకొంటాం. లేకుంటే ఎట్టిపరిస్థితుల్లోనూ నాటించబోం.
అమాసి, రైతు, ములకలపల్లి
సజావుగా పనులు
కుప్పం రెవెన్యూ డివిజన్ పరిధి 70 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేశాం. అన్నిచోట్లా రీసర్వే పనులు సజావుగా జరుగుతున్నాయి. ములకలపల్లెలో రాళ్ల తొలగింపు విషయం నా దృష్టికి రాలేదు.
శివయ్య, ఆర్డీవో, కుప్పం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
[ 19-04-2024]
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
మా ఇష్టం.. ‘అన్నీ పెద్దాయన’కే..
[ 19-04-2024]
ఆయనో ‘పెద్ద’ మంత్రి.. పైగా రాష్ట్రంలోనే నంబర్-2గా పేరుంది.. దీనికితోడు కీలక శాఖలన్నీ ఆయన గుప్పిట్లోనే ఉన్నాయి.. ఇంకేం ఆయన ఎవరికీ ఫలానా పనిచేయండి అని చెప్పనవసరం లేదు.. -
భర్తీ చేయక.. బాధపెట్టేరూ..!
[ 19-04-2024]
‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం’.. ప్రతిపక్షనేతగా ప్రజాసంకల్ప యాత్రలో జగన్ రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ ఇది. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
[ 19-04-2024]
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
ప్రజలు తెదేపా వైపు చూస్తున్నారు..
[ 19-04-2024]
రాష్ట్ర ప్రజలు వైకాపా పాలనతో విసిగిపోయి తెదేపా వైపు చూస్తున్నారని చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి వీఎం థామస్ అన్నారు. గురువారం పెనుమూరుకు చెందిన వైకాపా నాయకులు విశ్వప్రకాష్నాయుడు, -
‘వైకాపా పాలనకు రోజులు దగ్గరపడ్డాయి’
[ 19-04-2024]
నగరి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతిలోని తన స్వగృహం నుంచి బయల్దేరి తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలోని తన తండ్రి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడి... -
జగనన్న తీరేంటంటే.. ఐదేళ్లూ చూశామంతే..!
[ 19-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించుకోవడంలో జగనన్న పనితనం మామూలుగా లేదు.. ఎన్నికలకు ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ అని మాయమాటలు చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు సీఎం జగన్.. -
న్యాయమూర్తుల సేవలు స్ఫూర్తిదాయకం
[ 19-04-2024]
కేసుల పరిష్కారంలో న్యాయమూర్తుల సేవలు అందరికి స్ఫూర్తిదాయకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. గురువారం రాత్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసమూర్తి, -
‘చంద్రబాబు ప్రత్యర్థిగా జగన్ నిలబడినా ఓటమే’
[ 19-04-2024]
కుప్పం నుంచి ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి బరిలో నిలిచినా ఓటమి ఖాయమని, ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి దాన్ని వృథా చేసుకోవద్దని, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఓటేసి విలువను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కోరారు. -
అభివృద్ధి చేసినందునే మరోమారు టికెట్
[ 19-04-2024]
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినందునే వెంకటేగౌడకు ఈ దఫా టికెట్ దక్కిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. -
వర్క్ ఆర్డర్లు క్లోజ్ చేయకపోతే వేతనాల్లో రికవరీ
[ 19-04-2024]
వర్క్ ఆర్డర్లను నెలాఖరులోగా క్లోజ్ చేయకపోతే వేతనాల నుంచి రికవరీ చేస్తామని విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్ ఎస్ఏవో శ్రీనివాసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్