ఇవీ మాస్టర్ప్లాన్ రోడ్లే
తిరుపతికి తూర్పు ప్రాంతంలో నిర్మించిన మాస్టర్ప్లాన్ రోడ్ల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రహదారులపై ఇన్నాళ్లు కార్లు, ద్విచక్ర వాహనాలు ఎక్కువగా ప్రయాణించేవి.
ప్రారంభించిన కొద్ది రోజులకే గుంతలు
వైఎస్సార్, అన్నమయ్య మార్గాల కూడలిలో చెరువును తలపిస్తున్న రహదారి
న్యూస్టుడే, తిరుపతి(నగరపాలిక) : తిరుపతికి తూర్పు ప్రాంతంలో నిర్మించిన మాస్టర్ప్లాన్ రోడ్ల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రహదారులపై ఇన్నాళ్లు కార్లు, ద్విచక్ర వాహనాలు ఎక్కువగా ప్రయాణించేవి. శ్రీనివాససేతు నిర్మాణ పనుల్లో భాగంగా ట్రాఫిక్ మళ్లింపుతో అన్నమయ్య మార్గంపై భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వాటి రాకపోకలతో రోడ్డు నాణ్యతలో డొల్లతనం బయటపడింది. పలు ప్రాంతాల్లో తారు దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవలే మరమ్మతు పనులు చేసిన ప్రాంతంలో మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి.
పనులు పూర్తైన నెలల వ్యవధిలోనే..
2020 అక్టోబర్ 8న కరకంబాడీ రోడ్డు నుంచి కొత్తపల్లె మీదుగా 60 అడుగుల వెడల్పుతో మాస్టర్ప్లాన్ రోడ్డు పనులు ప్రారంభం కాగా.. ఈ ఏడాది ఏప్రిల్లో పూర్తిచేసి ప్రారంభించారు. ఇప్పటికీ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అన్నమయ్య మార్గం నిర్మాణం కోసం రూ.7.25 కోట్లు ఇప్పటికే వెచ్చించినట్లు నగరపాలిక అధికారులు ప్రకటించారు. ఈ రోడ్డులో నాణ్యత లేని పనుల కారణంగా పలుచోట్ల గుంతలు ఏర్పడడం అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ మార్గం కలిసే ప్రాంతంలో నిర్మించిన కూడలి పరిసరాల్లో లక్షలాది రూపాయలు వెచ్చించిన రోడ్డుకు ఇరువైపులా నిర్మించిన కాలువలు ఏ మాత్రం ఉపయోగపడడం లేదని తెలుస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ కూడలి చెరువును తలపించింది. కాలువల్లో ఎక్కడి వర్షపు నీరు అక్కడే స్తంభించి రోడ్డంతా నీటితో నిండి ఉంటోంది.
నాణ్యతపై అనుమానాలు
మూడేళ్ల పాటు నిర్మించిన అన్నమయ్య మార్గంలో నాణ్యతకు తిలోదకాలిచ్చి పనులు జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నగరంలోని పలు మాస్టర్ప్లాన్ రోడ్ల నాణ్యతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. నగరవ్యాప్తంగా రూ.40 కోట్ల వెచ్చించి నిర్మిస్తున్న మాస్టర్ప్లాన్ రోడ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా అన్న ప్రశ్నకు సమాధానం లేదు. నగరపాలిక కౌన్సిల్లో ప్రకటించిన గడువు లోపు పనులు పూర్తి చేయాలన్న ఆలోచన తప్ప.. నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కౌన్సిల్ ప్రకటించిన గడువు ముగిసి రెండు నెలలు పూర్తైనా.. ఇంకా 60 శాతం పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. వీటిల్లోనైనా నాణ్యత కనిపిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వినాయకసాగర్ కింది భాగంలో గుంతలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా ఇష్టం.. ‘అన్నీ పెద్దాయన’కే..
[ 19-04-2024]
ఆయనో ‘పెద్ద’ మంత్రి.. పైగా రాష్ట్రంలోనే నంబర్-2గా పేరుంది.. దీనికితోడు కీలక శాఖలన్నీ ఆయన గుప్పిట్లోనే ఉన్నాయి.. ఇంకేం ఆయన ఎవరికీ ఫలానా పనిచేయండి అని చెప్పనవసరం లేదు.. -
భర్తీ చేయక.. బాధపెట్టేరూ..!
[ 19-04-2024]
‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం’.. ప్రతిపక్షనేతగా ప్రజాసంకల్ప యాత్రలో జగన్ రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ ఇది. -
పేదల పాలిట.. వినాసికారే..!
[ 19-04-2024]
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
ప్రజలు తెదేపా వైపు చూస్తున్నారు..
[ 19-04-2024]
రాష్ట్ర ప్రజలు వైకాపా పాలనతో విసిగిపోయి తెదేపా వైపు చూస్తున్నారని చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి వీఎం థామస్ అన్నారు. గురువారం పెనుమూరుకు చెందిన వైకాపా నాయకులు విశ్వప్రకాష్నాయుడు, -
‘వైకాపా పాలనకు రోజులు దగ్గరపడ్డాయి’
[ 19-04-2024]
నగరి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతిలోని తన స్వగృహం నుంచి బయల్దేరి తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలోని తన తండ్రి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడి... -
జగనన్న తీరేంటంటే.. ఐదేళ్లూ చూశామంతే..!
[ 19-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించుకోవడంలో జగనన్న పనితనం మామూలుగా లేదు.. ఎన్నికలకు ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ అని మాయమాటలు చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు సీఎం జగన్.. -
న్యాయమూర్తుల సేవలు స్ఫూర్తిదాయకం
[ 19-04-2024]
కేసుల పరిష్కారంలో న్యాయమూర్తుల సేవలు అందరికి స్ఫూర్తిదాయకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. గురువారం రాత్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసమూర్తి, -
‘చంద్రబాబు ప్రత్యర్థిగా జగన్ నిలబడినా ఓటమే’
[ 19-04-2024]
కుప్పం నుంచి ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి బరిలో నిలిచినా ఓటమి ఖాయమని, ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి దాన్ని వృథా చేసుకోవద్దని, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఓటేసి విలువను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కోరారు. -
అభివృద్ధి చేసినందునే మరోమారు టికెట్
[ 19-04-2024]
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినందునే వెంకటేగౌడకు ఈ దఫా టికెట్ దక్కిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. -
వర్క్ ఆర్డర్లు క్లోజ్ చేయకపోతే వేతనాల్లో రికవరీ
[ 19-04-2024]
వర్క్ ఆర్డర్లను నెలాఖరులోగా క్లోజ్ చేయకపోతే వేతనాల నుంచి రికవరీ చేస్తామని విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్ ఎస్ఏవో శ్రీనివాసులు పేర్కొన్నారు.