వారు ఇచ్చిందే మద్దతు ధర?
‘మామిడి రైతులకు కిలోకు రూ.19గా మద్దతు ధర నిర్ణయించాం. రైతులు, కొనుగోలుదారుల సమక్షంలో దీన్ని ఖరారు చేశాం.
కిలోకు రూ.19 నిర్ణయించినా తగ్గిస్తున్న వైనం
గుజ్జు పరిశ్రమల యాజమాన్యాల తీరుతో రైతులకు తీవ్ర నష్టం
గుడిపాల మండలంలో నిలిపిన మామిడి కాయల లారీలు
ఈనాడు డిజిటల్, చిత్తూరు- న్యూస్టుడే, గంగాధరనెల్లూరు: ‘మామిడి రైతులకు కిలోకు రూ.19గా మద్దతు ధర నిర్ణయించాం. రైతులు, కొనుగోలుదారుల సమక్షంలో దీన్ని ఖరారు చేశాం. అన్ని గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు, అన్నదాతలు ఒకే మాటపై నిలబడాలి. ప్రకటించిన ధరలు మే 10 నుంచి మే 20 వరకు అమలులో ఉంటాయి. అనంతరం మరోసారి సమావేశమై మద్దతు ధర నిర్ణయిద్దాం’
ఇదీ ఈ నెల 10న కలెక్టర్ షన్మోహన్ సమక్షంలో మామిడి రైతులు, యాజమాన్యాల మధ్య జరిగిన చర్చల తుది సారాంశం.
మూడు రోజులపాటు మాటపై నిలబడ్డ పరిశ్రమల నిర్వాహకులు ఆ తర్వాత తిరిగి తమ పంథానే అనుసరిస్తున్నారు. ఫలితంగా రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. ప్రస్తుతం కిలోకు రూ.12- 15 మాత్రమే ఇస్తుండటంతో ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. దాదాపు అన్ని యాజమాన్యాలు ఒకేతాటిపై ఉండటంతో ఎక్కడకు వెళ్లినా అన్నదాతలకు ఇదే ధర వస్తోంది. గట్టిగా మాట్లాడితే కాయలు పక్వానికి రాలేదని.. అందుకే ధర తక్కువగా ఉందని సమాధానమిస్తున్నారు. మరోసారైనా సమావేశం నిర్వహించి తమను ఒడ్డున పడేయాలని రైతులు కోరుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా 1.05 లక్షల ఎకరాల్లో తోతాపురి రకం మామిడి సాగవుతోంది. అత్యధికంగా స్థానికంగా ఉన్న గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలే వీటిని కొనుగోలు చేస్తాయి. పరిశ్రమలు దూరంగా ఉన్నచోట మాత్రం మండీల యజమానులు, ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తుంటారు. వారు తమిళనాడుతోపాటు జిల్లాలో ఎక్కడ ఎక్కువ దూరం ఉంటే అక్కడ అమ్ముకుని లాభపడతారు. ఈ ఏడాది దిగుబడులు నామమాత్రంగా ఉండటంతో మంచి ధర వస్తుందని అన్నదాతలు భావించారు. రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్ శ్రీధర్ సైతం సీజన్కు ముందే జిల్లాకు వచ్చి యాజమాన్యాలు, రైతులతో సమావేశం నిర్వహించారు. దీంతో మంచి రేట్లు వస్తాయని అన్నదాతలు ఆశించారు. కలెక్టర్ కూడా ఇరువర్గాలతో చర్చించి కిలో రూ.19కు తోతాపురి కొనాలని ఆదేశించడంతో ఎంతోకొంత గిట్టుబాటవుతుందని రైతాంగం భావించింది.
కుదరని పొంతన: ప్రస్తుతం గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు కిలోకు రూ.12- 15 మాత్రమే ఇస్తున్నాయి. మండీల యజమానులు, ప్రైవేటు వ్యక్తులు రూ.10-14కు కొనుగోలు చేస్తున్నారు. వారు వెంటనే డబ్బులు ఇస్తుండటంతో విధిలేని పరిస్థితుల్లో కొందరు అమ్ముకుంటున్నారు. జిల్లా యంత్రాంగం నిర్ణయించిన ధరకు.. పరిశ్రమల నిర్వాహకులు కొంటున్న ధరకు పొంతన కుదరడం లేదు. కిలోపై రూ.4- 7 వరకు నష్టపోతున్నామని.. ఈ లెక్కన టన్నుకు రూ.4 - 7వేలు కోల్పోతున్నామని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం రంగంలోకి దిగితేనే: అన్నదాతలకు న్యాయం జరగాలంటే జిల్లా యంత్రాంగం నిర్ణయించిన ధరకే గుజ్జు పరిశ్రమలు కొనుగోలు చేయాలి. ఒకవేళ వాళ్లు గిట్టుబాటు కావడం లేదని చెబితే ప్రభుత్వమే స్పందించి టన్నుకు రూ.3వేలు- రూ.5వేలు అదనంగా రైతులకు ఇవ్వాలి. అప్పుడే అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన కర్షకులకు ఎంతోకొంత ఉపశమనం లభిస్తుంది.
గంగాధరనెల్లూరు మండలం వీరకనెల్లూరుకు చెందిన రైతు సోమశేఖర్రెడ్డికి తొమ్మిది ఎకరాల మామిడి తోట ఉంది. దుక్కి, ఎరువులు, పురుగు మందుల పిచికారీకి కలిపి ఎకరాకు రూ.30వేలు ఖర్చు చేశారు. ఈ ఏడాది 25 శాతం దిగుబడులు మాత్రమే వచ్చాయి. టన్ను రూ.30వేలు వస్తుందని ఆశించగా.. సగం ధర కూడా రాకపోవడంతో నష్టపోవాల్సిందేనని మదనపడుతున్నారు. జిల్లా యంత్రాంగం టన్ను రూ.19వేలుగా నిర్ణయించినప్పటికీ పరిశ్రమల యజమానులు ఆ ధర ఇవ్వడంలేదు. టన్ను రూ.14వేలు చెప్పడంతో ఆ ధరకే విక్రయించానని రైతు చెబుతున్నారు.
సోమల మండలం మల్లేశ్వరపురం గ్రామానికి చెందిన శివకుమార్ అనే రైతు సోమవారం మండల కేంద్రంలోని మండీలో టన్ను రూ.13 వేలకు కాయలు అమ్మారు.
ఇలాగైతే సాగు చేయలేం..
నేను 25 ఎకరాల్లో మామిడి సాగు చేశా. అధికారుల సమక్షంలో టన్ను రూ.19 వేలకు కొంటామని యాజమాన్యాలు చెప్పాయి. ప్రస్తుతం రూ.12 వేలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నాయి. కొన్ని పరిశ్రమలైతే కాయలు తీసుకురావద్దంటున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే వ్యవసాయం చేయడం కష్టం. ఇటీవల అకాల వర్షాలు పడటంతో కాయలకు మచ్చలు పడ్డాయి. అధికారులు స్పందించి అన్నదాతలకు న్యాయం చేయాలి.
ఉమాచంద్రన్, బొమ్మాయిపల్లె రైతు, వెదురుకుప్పం మండలం
మరో దఫా సమీక్షిస్తాం
మామిడి రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటాం. ఉన్నతాధికారుల సమక్షంలో మరో దఫా అన్నదాతలు, పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి గిట్టుబాటు ధరలు వచ్చేలా చూస్తాం.
మధుసూదన్రెడ్డి, డీడీ, ఉద్యాన శాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రులకు జగన్ జబ్బు
[ 23-04-2024]
కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా పేదలకు వైద్య సేవలు అందిస్తామని, ప్రభుత్వ వైద్యశాలలను రోగులకు అనుగుణంగా అప్గ్రేడ్ చేసి ఆ మేరకు సేవలు విస్తరిస్తామని సీఎం జగన్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో హామీ ఇచ్చారు. -
ఫ్యాను పార్టీలో ఉక్కపోత
[ 23-04-2024]
వైకాపాలో అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయి. ఐదేళ్లలో ఆ పార్టీలో గౌరవం దక్కలేదని, ప్రజలకు ఏం చేయలేకపోయామనే భావనతో ఉన్న నాయకులు, కార్యకర్తలు విసిగివేశారి సైకిల్ ఎక్కుతున్నారు. -
‘పది’లో 11 మెట్లు పైకెక్కి
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో గతేడాది 17వ స్థానంలో నిలిచిన జిల్లా.. ఈ విడత ఆరో స్థానానికి చేరింది.. ముఖ్యంగా ఈసారి బాలికలదే పైచేయి. జిల్లాలో 20,939మంది(బాలురు 10,793మంది, బాలికలు 10,146మంది) విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. -
44 నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని చిత్తూరు లోక్సభ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం 44 నామినేషన్లు దాఖలయ్యాయి. -
మాటల్లో బాగా.. చేతల్లో దగా..
[ 23-04-2024]
అధికారంలోకి వచ్చాక ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయేలా ఫిట్మెంట్ ఇస్తామని ఎన్నికల సందర్భంగా సీఎం జగన్ హామీ ఇచ్చారు.. సీఎం అయ్యాక జగన్ ఉద్ధరిస్తారని భావిస్తే నమ్మకంగా ముంచేశారని వాపోతున్నారు. -
ఆ ఆలయం అందరికీ సెంటిమెంట్
[ 23-04-2024]
ఎన్నికల్లో పలు సెంటిమెంట్లు చూస్తుంటాం. ఆ గుడిలో పూజలు చేసి.. నామపత్రాలు దాఖలు చేస్తే.. గెలుపు తథ్యమని.. ఫలానా చోట నుంచి ప్రచారం ప్రారంభిస్తే విజయం సులువుగా వరిస్తుందని నాయకులు నమ్మి ఆచరిస్తుంటారు. -
వైకాపా పాలనలో కేసుల పరంపర
[ 23-04-2024]
అమరనాథరరెడ్డి మీద వైకాపా ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా కేసులు నమోదు చేసింది. ఈ విషయం ఎన్నికల అధికారులకు అయన సమర్పించిన అఫిడవిట్లో పొందుపరిచారు. -
ఏడాదిలోపే.. నాణ్యత లోపాలు
[ 23-04-2024]
శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం దేశవిదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఈక్రమంలో శ్రీవారి దర్శనంతోపాటు మెరుగైన వసతిని తితిదే నుంచి ఆశిస్తారు. -
జగన్ అరెస్టుతో నాకేంటి సంబంధం: కిరణ్
[ 23-04-2024]
వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తే తనకేంటి సంబంధమని మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట పార్లమెంట్ ఎన్డీయే అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి ప్రశ్నించారు. -
నాటకాల జగన్.. సీఎం పదవికి అనర్హుడు
[ 23-04-2024]
గత ఎన్నికల్లో కోడికత్తి, బాబాయ్పై గొడ్డలి వేటు నాటకాలు ఆడి గద్దెనెక్కిన జగన్.. అరాచక పాలన సాగించారు. మళ్లీ ఇప్పుడు గులకరాయి డ్రామాకు తెరతీశారు. -
దంపతులపై వైకాపా నాయకుల దాడి అమానుషం
[ 23-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు నామినేషన్కు వెళ్లారని ముస్లిం దంపతులపై వైకాపా నాయకులు దాడి చేసి, చంపేస్తామని బెదిరించడం అమానుషమని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. -
ఈ ఆస్పత్రుల్లో ఎలా జగన్..
[ 23-04-2024]
ప్రభుత్వాసుపత్రుల్లో అసౌకర్యాలు తాండవిస్తున్నాయి. రోగులకు సరిపడా గదులు లేవు.. వరండాల్లోనే వైద్యసేవలు పొందాల్సిన దుస్థితి. -
పూతలపట్టులో.. తెదేపాకు ఒక్క అవకాశమివ్వండి...!
[ 23-04-2024]
పూతలపట్టులో తెదేపాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపుతానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీ మోహన్ అన్నారు. -
ఉత్తీర్ణత పెరిగి.. స్థానం దిగజారి
[ 23-04-2024]
పది పరీక్ష ఫలితాలు జిల్లాను కాస్త నిరుత్సాహ పరిచాయి. గతేడాది రాష్ట్రస్థాయిలో ఎనిమిదో స్థానంలో నిలవగా ఈసారి రెండు స్థానాలు దిగజారి పదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
జగనన్న పీఆర్సీ.. తీరని ద్రోహం
[ 23-04-2024]
ఎంతసేపు వెట్టిచాకిరీ చేయించుకున్నారే తప్ప ఈ ఐదేళ్లలో ఏనాడూ తమపక్షాన నిలబడింది లేదని.. నిజానికి జగనన్న పాలనలో వాలంటీర్కు ఇచ్చిన విలువకూడా ఇవ్వలేదని.. నెరవేరని హామీలు, రివర్స్ పీఆర్సీనే అందుకు నిదర్శనమన్న ఆవేదన ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు