నెలలు గడుస్తున్నా.. పరిష్కారం దొరకలే
చిన్నచిన్న సమస్యలు సైతం పరిష్కారం కావడం లేదు.. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కనీసం ఆలకించే నాథుడే కరవయ్యాడు..
తిరిగితిరిగి విసుగొస్తోంది
బాధితుల కన్నీటి వేదన
న్యూస్టుడే, చిత్తూరు కలెక్టరేట్ : చిన్నచిన్న సమస్యలు సైతం పరిష్కారం కావడం లేదు.. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కనీసం ఆలకించే నాథుడే కరవయ్యాడు.. చేసేదిలేక వ్యయప్రయాసల కోర్చి చిత్తూరు కలెక్టరేట్కు వస్తున్నామని, తమ సమస్యలు పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేశారు పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు. క్షేత్రస్థాయిలో తమ ఆవేదనను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపో యారు.. ఇలా ఇంకెన్నాళ్లు తిరగాలో అర్థం కావడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు.
భూ సమస్య పరిష్కరించాలి..
తన భూ సమస్యను పరిష్కరించాలని విన్నవించారు విజయపురం మండలం ఎం.అగరం ఎస్సీ కాలనీకి చెందిన మునిరత్నం. తన అనుభవంలో ఉన్న 17 సెంట్ల భూమి 22(ఏ) ఖాతాలో చేరి పోయింది. దీంతో ఆ భూమిపై ఎలాంటి హక్కు లేకుండా పోయింది. నా అనుభవంలో మరొక సర్వే నంబర్లో ఉన్న 68 సెంట్ల భూమికి డీకేటీ పట్టా మంజూరు చేయాలని పలుమార్లు రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి విన్నవించుకున్నా. అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా. క్షేత్రస్థాయిలో అధికారులు విచారించి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు న్యాయం జరగలేదు. అసలు తమ సమస్య ఎప్పటికి పరిష్కరిస్తారో తెలియడం లేదు. అందుకే ఇక్కడకు వచ్చి ఉన్నతాధికారులకు విన్నవించా. వారు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటున్నా.
భూమి ఆక్రమించారు..
తనకున్న రెండు సెంట్ల భూమిని కొందరు ఆక్రమించారని వాపోయారు గంగవరం మండలం గొర్రెలదొడ్డి గ్రామానికి చెందిన రమాదేవి. జీవనోపాధి కోసం చిల్లర దుకాణం నిర్వహించుకుంటున్నా. ఉన్న రెండు సెంట్ల స్థలం ఆక్రమణకు గురికావడంతో ఇబ్బంది పడుతున్నా. స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదు. కనీసం నా మొర ఆలకించలేదు. తిరిగి తిరిగి విసుగొచ్చింది. అందుకే ఇక్కడకొచ్చా. ఉన్నతాధికారులు స్పందించి తన భూమి సర్వే చేయించి న్యాయం చేయాలని విన్నవించుకుంటున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిలోద‘కౌలు’
[ 24-04-2024]
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. కౌలుదారీ చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి రైతులు నష్టపోకుండా ఆదుకుంటాం. కౌలురైతులకు గుర్తింపు కార్డులిచ్చి బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు అందేలా చేస్తాం’. -
‘సిద్ధం సభలు వెలవెలబోతున్నాయి’
[ 24-04-2024]
సీఎం జగన్ కోడికత్తి తరహాలో ప్రజల సానుభూతి పొందాలన్న ప్రయత్నం విఫలైంది.. నుదుటిపై చిన్నపాటి దెబ్బ తగిలితే ఆ పార్టీ నాయకులు హత్యాయత్నం అంటూ హడావుడి చేస్తున్నారు.. అని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. -
బ్యానర్లు తొలగించరు.. నిబంధనలు వర్తింపజేయరు
[ 24-04-2024]
గత నాలుగు రోజుల్లో వరుసగా ఉల్లంఘనలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల అధికారులు సైతం పక్షపాతం చూపుతూ వైకాపా నాయకులైతే ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతున్నారు. -
గోపాలమిత్ర.. జగన్ మౌన పాత్ర
[ 24-04-2024]
మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా.. నన్ను గెలిపించండి.. మీ వెన్నంటి ఉంటా.. -
ఐదోరోజు 24 నామినేషన్ల దాఖలు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. చిత్తూరు ఎంపీ స్థానానికి సంబంధించి రిటర్నింగ్ అధికారి షన్మోహన్కు.. అభ్యర్థులు జగపతి (కాంగ్రెస్), రమేష్ (ఆలిండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ), భూలక్ష్మి(పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), జయకర్(స్వతంత్ర) నామినేషన్లు సమర్పించారు. -
ఏడేళ్ల చిన్నారికి పెద్ద కష్టం
[ 24-04-2024]
పట్టణంలోని ఈస్టుపేటకు చెందిన ఆటో డ్రైవర్ ప్రేమకుమార్, సుభాషిణి దంపతుల కుమార్తె జెస్సిక (7). ఏడాది కిందట తీవ్ర అనారోగ్యానికి గురైంది. -
‘వైకాపాను నమ్ముకొని.. నడిరోడ్డుపైకి వచ్చా’
[ 24-04-2024]
వైకాపా ఆవిర్భావం నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తే తగిన ప్రాధాన్యం దక్కలేదని 11వ డివిజన్ వైకాపా నాయకుడు, మాజీ కార్పొరేటర్ మార్తాళ్ భర్త శివకుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. -
నమ్ముకుంటే.. మోసపోయాం
[ 24-04-2024]
రాత్రింబవళ్లు పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషిచేసిన గోపాలమిత్రల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది.. తాను అధికారంలోకి రాగానే గోపాలమిత్రలను క్రమబద్ధీకరించి, వేతనాలు పెంచుతానని ప్రజాసంకల్ప పాదయాత్రలో నేటి సీఎం జగన్ నాడు హామీ ఇచ్చారు. -
‘అరాచక పాలనకు అంతం పలకాలి’
[ 24-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెదేపా ప్రచారం జోరందుకుంది. చిత్తూరు నగరం, గుడిపాల, చిత్తూరు గ్రామీణ మండలాల్లో నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. -
బస్టాండా.. అదెక్కడ..?
[ 24-04-2024]
నియోజకవర్గ కేంద్రమైన జీడీనెల్లూరులో బస్టాండు, బస్షెల్టరు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజూ ఇక్కడి నుంచి చిత్తూరు, తిరుపతి, వేలూరు, బెంగుళూరు, చెన్నై నగరాలతోపాటు సరిహద్దున ఉన్న తమిళనాడు, కర్నాటక రాష్ట్ర ప్రాంతాలకు బస్సులు ఎక్కుతుంటారు. -
కుమారుడి కోసమే ‘కరుణ’
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తన కుమారుడు అభినయ్రెడ్డిని గెలిపించుకునేందుకు తిరుపతి ఎమ్మెల్యే, తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తాపత్రయపడుతున్నా కాలం కలసి రావడం లేదు. -
వైకాపాకు వర్తించని నిబంధనలు.. అడుగడుగునా ఉల్లంఘనలు
[ 24-04-2024]
సత్యవేడు వైకాపా అభ్యర్థి నూకతోటి రాజేష్ నామినేషన్ కార్యక్రమంలో మంగళవారం ఎన్నికల నిబంధనలను గాలికి వదిలేసినా అధికారులు పట్టించుకోలేదు.