కుచివాడ ఇసుక రీచ్ రద్దు చేయాలి
రైతుల ప్రయోజనాలు దెబ్బతిసేలా నాయుడుపేట మండలం స్వర్ణముఖిలో కుచివాడ వద్ద అనుమతి ఇచ్చిన ఇసుక రీచ్ను ప్రభుత్వం రద్దు చేయాలంటూ మంగళవారం స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలోని 8 గ్రామాల ప్రజలు రాస్తారోకో చేశారు.
8 గ్రామాల రైతుల రాస్తారోకో
రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు
నాయుడుపేట: రైతుల ప్రయోజనాలు దెబ్బతిసేలా నాయుడుపేట మండలం స్వర్ణముఖిలో కుచివాడ వద్ద అనుమతి ఇచ్చిన ఇసుక రీచ్ను ప్రభుత్వం రద్దు చేయాలంటూ మంగళవారం స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలోని 8 గ్రామాల ప్రజలు రాస్తారోకో చేశారు. ఈ ప్రాంతంలో 70 ఎకరాల్లో నదీ తీరాన ఇసుక తవ్వకాలకు గనుల శాఖ అనుమతులు ఇవ్వడం తెలిసిందే. తవ్వకాలతో వ్యవసాయ, తాగునీటి పంపుసెట్లు ధ్వంసం చేస్తారని, భూగర్భ జలమట్టాలు తగ్గి నీటి ఎద్దడి ఏర్పడుతుందని సమీప గ్రామాలు ఇక్కడ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగా కుచివాడ, కుచివాడపాళెం, మడఫలం, కాలువగట్టు, వేమగుంటపాళెం, అన్నమేడు, చిలమత్తూరు, చిట్టమూరు మండలంలో గునపాటిపాళెం గ్రామాల రైతులు వందల సంఖ్యలో కాలువగట్టు గ్రామానికి సమీపంలో రాష్ట్ర రహదారిపై బైఠాయించి ఉదయం 9-12 గంటల వరకు వాహనాల రాకపోకలు స్తంభింపజేశారు. దీంతో ఇసుక వాహనాలు ఇరువైపులా భారీగా బారులుతీరాయి. అనంతరం నాయుడుపేట తహసీల్దారు రాజేంద్రం, అర్బన్ సీఐ నరసింహారావు, ఎస్సై శ్రీకాంత్ రైతులతో చర్చించి ఆందోళన విరమింపజేశారు. రైతులకు మద్దతుగా తెదేపా, వైకాపా, భాజపా నాయకులు కామిరెడ్డి అశోక్కుమార్రెడ్డి, దువ్యూరు శ్రీనివాసులురెడ్డి, సుధాకర్రెడ్డి, ధనంజయరెడ్డి, శ్రీధర్రెడ్డి మధుసూధన్రెడ్డి సర్పంచి రమణయ్య, మాజీ ఎంపీటీసీ బల్లి ఏసుదాసు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని