ఆయకట్టు రైతుల నోట్లో మట్టి
జల వనరుల పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే అమృత్ సరోవర్ కార్యక్రమం ద్వారా కొత్త చెరువుల నిర్మాణంతోపాటు ప్రస్తుతమున్న వాటినీ అభివృద్ధి చేస్తోంది.
జాతీయ రహదారుల నిర్మాణం పేరిట చెరువుల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు
బంగారుపాళ్యం మండలం కోనిరెడ్డిచెరువులో అక్రమంగా మట్టిని తవ్వుతున్న దృశ్యం (పాతచిత్రం)
ఈనాడు డిజిటల్, చిత్తూరు- న్యూస్టుడే, నిండ్ర: జల వనరుల పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే అమృత్ సరోవర్ కార్యక్రమం ద్వారా కొత్త చెరువుల నిర్మాణంతోపాటు ప్రస్తుతమున్న వాటినీ అభివృద్ధి చేస్తోంది. చెరువులపై కేంద్రం ఇంత శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు జిల్లాలోని జలవనరుల శాఖ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి? అందుకు భిన్నంగా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి జాతీయ రహదారుల నిర్మాణాన్ని సాకుగా చూపుతూ పూతలపట్టు, నగరి నియోజకవర్గాల్లో చెరువుల్లో మట్టి తవ్వకాలకు ఇష్టారాజ్యంగా అనుమతులు ఇస్తుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సదరు గుత్తేదారు సంస్థలు అంతకుమించి అన్నట్టుగా మట్టిని తరలిస్తుండటంపై ఆయకట్టు రైతులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో భారీ, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులు జిల్లాలో లేకపోవడంతో అన్నదాతలు చెరువులపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. మూడేళ్ల కిందట పడిన వర్షాలకు దెబ్బతిన్న చెరువులకు శాశ్వత మరమ్మతులు చేయని జలవనరుల శాఖ అధికారులు జాతీయ రహదారి నిర్మాణాలకు మట్టి తీసుకునేందుకు ఆగమేఘాలపై అనుమతులు ఇస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం బెంగళూరు- చెన్నై, చిత్తూరు- తచ్చూరు ఎక్స్ప్రెస్ జాతీయ రహదారుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాణాలకు అవసరమైన మట్టిని ఆయా సంస్థలు అధిక శాతం కొండలు, గుట్టల నుంచి తీసుకుంటున్నాయి. ఇందులో ప్రభుత్వానికి సైతం ఆదాయం వస్తోంది. గుట్టల నుంచి తరలించేందుకు ఎక్కువ వ్యయం అవుతుండటంతో ఇటీవల బంగారుపాళ్యం, నిండ్ర, విజయపురం, నగరి మండలాల్లో చెరువుల నుంచి మట్టిని తవ్వేందుకు అనుమతించాలని దరఖాస్తు చేసుకుంటున్నారు.
నిధులొచ్చిన చెరువులోనూ..
నిండ్ర పెద్ద చెరువు మరమ్మతులకు రెండేళ్ల క్రితం జైకా నిధులు రూ.కోటి రాగా కట్టపై ఉన్న ముళ్ల చెట్లను మాత్రం తొలగించి ఆ తర్వాత పనుల ఊసే మరిచారు. ఇప్పుడు అక్కడ కూడా మట్టి తవ్వకాలకు అనుమతి ఇచ్చారని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భూగర్భ జలాల పరిస్థితేమిటంటూ
మట్టి కోసం చెరువును ఇష్టారాజ్యంగా తవ్వేస్తే భూగర్భ జలాలు అడుగంటుతాయని అన్నదాతలు వాపోతున్నారు. గుంతల కారణంగా మనుషులు, మూగజీవాల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని అంటున్నారు. స్థానిక రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అధికార పార్టీ నేతలనే కార్యాలయాలకు పిలిపించి అనుమతులు ఇచ్చామని చెప్పడం వెనుక ఆంతర్యమేంటని మండిపడుతున్నారు.
కొంతమేర తవ్వుకోవడానికే అనుమతులు
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో కొన్నిచోట్ల జాతీయ రహదారుల నిర్మాణ పనులకు చెరువుల్లో మట్టి తవ్వకాలకు అనుమతులు ఇచ్చాం. అక్కడ కూడా కొంతమేరే తీసుకోవాలని స్పష్టం చేశాం. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం.
విజయకుమార్రెడ్డి, ఎస్ఈ, జలవనరుల శాఖ
అండతోనే అడ్డదిడ్డంగా..
సోమేశ్వరం చెరువులో మట్టి తవ్వకాలు చేస్తున్న దృశ్యం
బంగారుపాళ్యం మండలం కొనిరెడ్డిచెరువులో నెల రోజుల కిందట ఎటువంటి అనుమతులు లేకుండానే మట్టిని తరలించారు. వారం రోజులపాటు రాత్రింబవళ్లు యంత్రాలతో తవ్వడంతో గ్రామస్థులు ఆందోళన చేసి పనులు నిలిపేశారు. స్థానిక వైకాపా నాయకుల అండతోనే చెరువును ఇలా కొల్లగొట్టారు. చిత్తూరు- తచ్చూరు ఎక్స్ప్రెస్ వేకు అవసరమైన మట్టి కోసం గత నెలలో నిండ్ర మండలం ఆలపాకం చెరువులోనూ భారీగా తవ్వకాలు చేశారు. ఆయకట్టు రైతులు తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలపడంతో నిర్మాణ సంస్థ వెనక్కు తగ్గింది.
తూముకు మరమ్మతులు చేయరు కానీ..
నగరి, విజయపురం మండలాల్లోనూ ఇదే విధంగా మట్టిని తరలించారు. తాజాగా మంగళవారం నిండ్ర మండలం సోమేశ్వరం చెరువులోనూ దాదాపు 10 అడుగుల లోతు వరకు తవ్వేశారు. మూడేళ్ల కిందట దెబ్బతిన్న తూముకు మరమ్మతులు చేయించని జలవనరుల శాఖ అధికారులు మట్టి తవ్వకాలకు మాత్రం అనుమతులు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తూ పనులు అడ్డుకున్నారు.
వ్యవసాయానికి కష్టమన్నా వినలేదు
‘బంగారుపాళ్యం మండలం కోనిరెడ్డిచెరువులో ఇటీవల అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారు. భూగర్భ జలాలు అడుగంటి వ్యవసాయం చేసుకోవడం కష్టంగా మారుతుందని సంబంధిత వ్యక్తులకు చెప్పినా మా మాటను లెక్కచేయలేదు. చివరకు రైతులంతా గట్టిగా ప్రశ్నించడంతో తవ్వకాలు నిలిపేశారు. ఈ విషయంలో రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారులు స్పందించి అన్నదాతలకు నష్టం జరగకుండా చూడాలి.’
శాంతమూర్తి, రైతు, బంగారుపాళ్యం మండలం
పది అడుగులకు పైగా తవ్వుతున్నారు
వర్షాలు లేనప్పుడు నిండ్ర మండలం సోమేశ్వరం చెరువులో పశువులు మేపుతున్నాం. మేతకు ఎటువంటి ఇబ్బంది లేదు. మట్టి కోసం 10 అడుగులకుపైగా తవ్వుతుండటంతో మూగజీవాలు అందులో పడే ప్రమాదం పొంచి ఉంది. అవి మరణిస్తే మా బతుకుదెరువు ఏం కావాలి?
ఏలుమలైరెడ్డి, రైతు, నిండ్ర మండలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెరువులను చెరబడుతున్న వైకాపా నేతలు
[ 29-03-2024]
వైకాపా నేతల కబంధ హస్తాల్లో చెరువులు చిక్కుకున్నాయి. కుదిరితే కబ్జా చెయ్.. లేదంటే మట్టి తవ్వి సొమ్ము చేసుకో అన్న చందంగా వైకాపా నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. -
భూసార పరీక్షలెక్కడ జగనన్నా..!
[ 29-03-2024]
భూమిలో సూక్ష్మ పోషకాల లోపాన్ని తెలుసుకుని తదనుగుణంగా చర్యలు చేపడితే అన్నదాతలు అధిక దిగుబడులు సాధించి అప్పుల ఊబి నుంచి బయటపడతారన్నది ఉద్దేశం.. అందుకు భూసార పరీక్షలు తప్పనిసరి. -
స్వర్ణరథంపై ప్రమాణాల స్వామి విహారం
[ 29-03-2024]
శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారు సిద్ధిబుద్ధి సమేతుడై స్వర్ణరథంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ గురువారం రాత్రి భక్తులను అలరించారు. -
అల్పాదాయాల్లోనే.. స్వయం సహాయక సంఘాలు
[ 29-03-2024]
గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలను వైకాపా సర్కార్ ఉపయోగించుకోవడం లేదు. 80 శాతం రాయితీతో స్వయం సహాయ సంఘాలకు ఇచ్చే రుణం సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేదు. -
నియమావళి అమలు చేయాలనిపిస్తేగా?
[ 29-03-2024]
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి పది రోజులు దాటింది. కోడ్ను పక్కాగా అమలు చేయాల్సిన యంత్రాంగం కొన్నిచోట్ల తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. నేటికీ కొన్నిచోట్ల అధికార వైకాపా రంగులు దర్శన మిస్తూనే ఉన్నాయి. -
‘ఓటమి భయంతోనే దోచుకున్న సొత్తు విదేశాలకు’
[ 29-03-2024]
ఓటమి భయంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దోచుకున్న ధనాన్ని విదేశాలకు తరలిస్తున్నారని చిత్తూరు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు, గురజాల జగన్మోహన్ ఆరోపించారు. స్థానిక తెదేపా జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. -
ప్రైవేటు వాహనానికి ప్రభుత్వ స్టిక్కర్
[ 29-03-2024]
ఆయన అధికార పార్టీ మండల స్థాయి నాయకుడు.. ఆయన కోడలు రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్పర్సన్ వారి స్వంత వాహనంపై ప్రభుత్వ వాహనమంటూ స్టిక్కర్ తలిగించుకున్నారు. -
అధికారుల అనుమతి తర్వాతే వాలంటీర్ల రాజీనామాకు ఆమోదం
[ 29-03-2024]
ప్రభుత్వ భవనాలపై పార్టీ రంగులుంటే అవి అభ్యంతరాల కింద రావు. ఆ రంగులు ఎప్పట్నుంచో ఉన్నవే. ప్రభుత్వ భవనాలపై పార్టీ చిహ్నాలు, నేతల ఫొటోలు ఉంటే ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. -
గరం గరం.. పశుగ్రాసం
[ 29-03-2024]
వర్షాలు ఎండమావులయ్యాయి.. చెరువులు, కుంటలు బీటలు వారాయి.. భూగర్భ జలాలు అండుగంటిపోయాయి.. సాగు భూములు బీళ్లుగా మారుతున్నాయి.. ఈ క్రమంలో పశుగ్రాసం కొరత తీవ్రమైంది.. పశుపోషణకు రైతన్నలు నానా తంటాలు పడుతున్నారు. -
పుంగనూరులో ట్రేడింగ్ మోసగాడు
[ 29-03-2024]
తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ఆశ చూపి ట్రేడింగ్ మోసానికి పాల్పడుతున్న ఇద్దరిని తెలంగాణ రాజధాని సైబరాబాబ్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. -
జగన్ సర్కార్పై మత్స్యకారులు గుర్రు
[ 29-03-2024]
‘మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వైకాపా అడుగు ముందుకేస్తోంది. వాకాడు మండలం రాయదొరువు వద్ద మత్స్యకారుల వలసల నివారణ, స్థితిగతులు మెరుగు పరచడానికి ఇక్కడ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం’. -
చెరబట్టి.. నీరు వెల్లగొట్టి..!
[ 29-03-2024]
భానుడి ప్రతాపంతో ఎండాకాలంలో దాహార్తి తిప్పలు తప్పవని ముందే గుర్తించినా వైకాపా నేతల ఆక్రమణల పర్వంతో జిల్లాలోని అత్యధిక చెరువులు నీరు లేక ఒట్టిపోయాయి. -
అరాచకాన్ని వీడి.. ప్రగతి బాట
[ 29-03-2024]
రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న అరాచక పాలనకు చరమగీతం పాడే రోజు సమీపిస్తోందని వైకాపా నేతలు గ్రహిస్తున్నారు. -
దేవుడి పేరు చెప్పి.. కాలువ కబ్జా..!
[ 29-03-2024]
అధికార పార్టీ నేతలకు చెరువులు.. పంట కాలువలంటే లెక్కలేకుండాపోయింది. నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఏకంగా తుమ్మలగుంట చెరువునే మాయం చేసినట్లు ఆరోపణలుండగా చోటామోటా నాయకులు కాలువ పోరంబోకు భూములపై పడుతున్నారు. -
తిరుమల నడకదారిలో చిరుత
[ 29-03-2024]
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోమారు చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈనెల 25, 26వ తేదీ తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని, అటవీశాఖ ఏర్పాటుచేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత సంచారం గుర్తించినట్లు తితిదే అటవీశాఖ డీఎఫ్వో శ్రీనివాసులు వెల్లడించారు. -
బహిర్గతమైన వైకాపా కుమ్ములాటలు
[ 29-03-2024]
కేవీబీపురం వైకాపాలో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గురువారం రాత్రి వైకాపా మండల బీసీˆసెల్ అధ్యక్షుడు హరిబాబు, మండల కోఆప్షన్ మెంబర్ జాకీర్ హుస్సేన్ మధ్య జరిగిన గొడవలే నిదర్శనం. -
పీ అండ్ పీవో వ్యవస్థ నిర్వీర్యం
[ 29-03-2024]
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎప్పటికప్పుడు కొత్త వాహకనౌకలను రూపొందించి, మానవాళి అవసరాలకు అనుగుణంగా ఉపగ్రహాలను తయారు చేసి, కక్ష్యలోకి పంపుతోంది. -
ఊరించి.. కొర్రీలతో వంచించి
[ 29-03-2024]
మీకు నేనున్నా.. మీ కష్టనష్టాలు తీరుస్తా.. అంటూ తన పాదయాత్ర సమయంలో ఇంటర్, డిగ్రీ ఒప్పంద అధ్యాపకులకు హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి జగనన్న చివరకు మాటతప్పి మడమ తిప్పేశారు. -
ఈ లెక్కలు బయటకు రావా..?
[ 29-03-2024]
కులగణన సర్వే ప్రక్రియ ముగిసినా.. ప్రభుత్వం దాని వివరాలు నేటికీ వెల్లడించలేదు. ఎన్నికలకు ముందు హడావుడిగా చేపట్టిన సర్వే ప్రక్రియ జిల్లాలో ఫిబ్రవరిలోనే ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్