బలి తీసుకున్న నిద్రమత్తు
వాహన చోదకుడి నిద్రమత్తు అదే కుటుంబానికి చెందిన నలుగురి ప్రాణాలు బలి తీసుకుంది. మరో ఇద్దరిని తీవ్రగాయాలతో ఆస్పత్రి పాల్జేసింది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును కారు వేగంగా ఢీకొంది.
బస్సును ఢీకొట్టిన కారు
ఒకే కుటుంబంలోని నలుగురి దుర్మరణం
మరో ఇద్దరికి గాయాలు
ప్రమాదంలో నుజ్జయిన కారు
వెంకటమ్మ, అశోక్, శాన్వితాక్షరి, దినేష్ (పాత చిత్రాలు)
ఏర్పేడు, న్యూస్టుడే: వాహన చోదకుడి నిద్రమత్తు అదే కుటుంబానికి చెందిన నలుగురి ప్రాణాలు బలి తీసుకుంది. మరో ఇద్దరిని తీవ్రగాయాలతో ఆస్పత్రి పాల్జేసింది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదం శ్రీకాళహస్తి- రేణిగుంట ప్రధాన రహదారిపై ఏర్పేడు మండలం మేర్లపాక సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సీఐ శ్రీహరి కథనం మేరకు.. తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లెకు చెందిన వెంకటమ్మ(65) ఆమె కుమారులు దినేష్ అలియాస్ వెంకన్న(40), రాంబాబు(38), అశోక్(35)తో పాటు మనువరాళ్లు (దినేష్ కుమార్తెలు) భాన్వితాక్షరి(10), శాన్వితాక్షరి(6)లు అందరూ కలిసి కారులో బయలుదేరి తిరుమల చేరుకున్నారు. వెంకటమ్మ కూతురు రేణుక కుమారుడి పుట్టువెంట్రుకలు తీసే కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి గురువారం శ్రీకాళహస్తి బయలుదేరారు. ఏర్పేడు మండలం మేర్లపాక సమీపంలో శ్రీకాళహస్తి నుంచి ప్రయాణికులతో తిరుపతి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వీరు ప్రయాణిస్తున్న కారు వేగంగా ఢీకొంది. ప్రమాదంలో కారు ముందు సీటులో కూర్చొన్న అశోక్, శాన్వితాక్షరి, వెనుక సీటులో కూర్చొన్న వెంకటమ్మ, అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడుపుతున్న రాంబాబు, దినేష్, పెద్ద కుమార్తె భాన్వితాక్షరిలు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో దినేష్ అలియాస్ వెంకన్న వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరిలో రాంబాబు, దినేష్లు ప్రభుత్వ ఉపాధ్యాయులు. అశోక్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యునిగా పోటీ చేసి ఓడిపోయారు. కారు నడుపుతున్న రాంబాబు నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను శ్రీకాళహస్తి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు శ్రీకాళహస్తి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి తిరుపతి నారాయణాద్రి ఆస్పత్రికి తరలించారు.
కట్టలు తెగిన కన్నీళ్లు
క్షతగాత్రులను శ్రీకాళహస్తి ప్రాంతీయ ఆసుపత్రికి తరలిస్తున్న సీఐ శ్రీహరి
శ్రీకాళహస్తి, ఏర్పేడు, న్యూస్టుడే: రెప్పపాటులో జరిగిన ప్రమాదం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. మృతులు.. క్షతగాత్రులై ఆస్పత్రుల్లో కొట్టుమిట్టాడుతున్న వాళ్ల పరిస్థితి తెలుసుకుని కట్టలు తెగిన కన్నీళ్లతో కుటుంబం కన్నీరుమున్నీరైంది. ఏర్పేడు మండలం మేర్లపాక సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లికి చెందిన తల్లి, ఇద్దరు కుమారులు, మనువరాలు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తల్లితోనే.. తనయులు..: వెంకటమ్మతో పాటు ఆమె కుమారులు ఇద్దరు అశోక్, దినేష్ అలియాస్ వెంకన్న అనంత లోకాలకు చేరారు. ప్రమాదంలో కారు నడుపుతూ క్షతగాత్రుడైన పెద్ద కుమారుడు రాంబాబు, దినేష్ పెద్దకుమార్తె శాన్వితాక్షరి ప్రాణాలతో కొట్టుమిట్టాడారు. వారి మృతదేహాలను చూసి కుటుంబీకులు తీవ్ర వేదనకు గురయ్యారు.
చెల్లికి ఏమైంది..: ఈ ప్రమాదంలో అప్పటి వరకు పక్కపక్కనే కూర్చొని ప్రయాణిస్తున్న అక్కాచెల్లెళ్లు భాన్వితాక్షరి, శాన్వితాక్షరిల్లో చెల్లెలు శాన్వితాక్షరి బాబాయి వద్ద ఒడిలో కూర్చొనేందుకు వెళ్లింది. ప్రమాదంలో బాబాయ్తో పాటు ఆమె కూడా ప్రాణాలు విడిచింది. అయితే రోడ్డుపక్కన ముఖంపై గుడ్డకప్పి ఉండటంతో గాయాలకు గురైన భాన్వితాక్షరి చెల్లికి ఏమైందంటూ అడగడంతో అక్కడే ఉన్న కళ్లు సైతం చెమ్మగిల్లాయి.
ఆఖరు నిమిషంలో మార్పులు..: ఆడబిడ్డ ఇంట్లో శుభకార్యంలో పాల్గొనేందుకు వెంకటమ్మ కుమారులు, కోడళ్లు, మనువళ్లు, మనవరాళ్లు అందరూ కలసి బయలుదేరాలని భావించినా ఆఖరు నిమిషంలో మార్పులతో వెంకటమ్మ, ఆమె ముగ్గురు కుమారులు, ఇద్దరు మనుమరాళ్లు మాత్రమే వచ్చారు. రాంబాబు సతీమణి సంధ్య గర్భిణి. నాలుగో నెల కావడంతో కుమార్తె హనీతో కలిసి పుట్టింటికి వెళ్లింది. దినేష్ భార్య జ్యోతి. ఇద్దరు కుమార్తెలతో పాటు కుమారుడు ఉన్నారు. కుమారుడితో జ్యోతి ఇంటి వద్దనే ఉంది. ప్రమాదం విషయం తెలిసి ఆయా కుటుంబ సభ్యులందరూ కన్నీరుమున్నీరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెరువులను చెరబడుతున్న వైకాపా నేతలు
[ 29-03-2024]
వైకాపా నేతల కబంధ హస్తాల్లో చెరువులు చిక్కుకున్నాయి. కుదిరితే కబ్జా చెయ్.. లేదంటే మట్టి తవ్వి సొమ్ము చేసుకో అన్న చందంగా వైకాపా నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. -
భూసార పరీక్షలెక్కడ జగనన్నా..!
[ 29-03-2024]
భూమిలో సూక్ష్మ పోషకాల లోపాన్ని తెలుసుకుని తదనుగుణంగా చర్యలు చేపడితే అన్నదాతలు అధిక దిగుబడులు సాధించి అప్పుల ఊబి నుంచి బయటపడతారన్నది ఉద్దేశం.. అందుకు భూసార పరీక్షలు తప్పనిసరి. -
స్వర్ణరథంపై ప్రమాణాల స్వామి విహారం
[ 29-03-2024]
శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారు సిద్ధిబుద్ధి సమేతుడై స్వర్ణరథంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ గురువారం రాత్రి భక్తులను అలరించారు. -
అల్పాదాయాల్లోనే.. స్వయం సహాయక సంఘాలు
[ 29-03-2024]
గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలను వైకాపా సర్కార్ ఉపయోగించుకోవడం లేదు. 80 శాతం రాయితీతో స్వయం సహాయ సంఘాలకు ఇచ్చే రుణం సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేదు. -
నియమావళి అమలు చేయాలనిపిస్తేగా?
[ 29-03-2024]
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి పది రోజులు దాటింది. కోడ్ను పక్కాగా అమలు చేయాల్సిన యంత్రాంగం కొన్నిచోట్ల తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. నేటికీ కొన్నిచోట్ల అధికార వైకాపా రంగులు దర్శన మిస్తూనే ఉన్నాయి. -
‘ఓటమి భయంతోనే దోచుకున్న సొత్తు విదేశాలకు’
[ 29-03-2024]
ఓటమి భయంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దోచుకున్న ధనాన్ని విదేశాలకు తరలిస్తున్నారని చిత్తూరు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు, గురజాల జగన్మోహన్ ఆరోపించారు. స్థానిక తెదేపా జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. -
ప్రైవేటు వాహనానికి ప్రభుత్వ స్టిక్కర్
[ 29-03-2024]
ఆయన అధికార పార్టీ మండల స్థాయి నాయకుడు.. ఆయన కోడలు రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్పర్సన్ వారి స్వంత వాహనంపై ప్రభుత్వ వాహనమంటూ స్టిక్కర్ తలిగించుకున్నారు. -
అధికారుల అనుమతి తర్వాతే వాలంటీర్ల రాజీనామాకు ఆమోదం
[ 29-03-2024]
ప్రభుత్వ భవనాలపై పార్టీ రంగులుంటే అవి అభ్యంతరాల కింద రావు. ఆ రంగులు ఎప్పట్నుంచో ఉన్నవే. ప్రభుత్వ భవనాలపై పార్టీ చిహ్నాలు, నేతల ఫొటోలు ఉంటే ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. -
గరం గరం.. పశుగ్రాసం
[ 29-03-2024]
వర్షాలు ఎండమావులయ్యాయి.. చెరువులు, కుంటలు బీటలు వారాయి.. భూగర్భ జలాలు అండుగంటిపోయాయి.. సాగు భూములు బీళ్లుగా మారుతున్నాయి.. ఈ క్రమంలో పశుగ్రాసం కొరత తీవ్రమైంది.. పశుపోషణకు రైతన్నలు నానా తంటాలు పడుతున్నారు. -
పుంగనూరులో ట్రేడింగ్ మోసగాడు
[ 29-03-2024]
తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ఆశ చూపి ట్రేడింగ్ మోసానికి పాల్పడుతున్న ఇద్దరిని తెలంగాణ రాజధాని సైబరాబాబ్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. -
జగన్ సర్కార్పై మత్స్యకారులు గుర్రు
[ 29-03-2024]
‘మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వైకాపా అడుగు ముందుకేస్తోంది. వాకాడు మండలం రాయదొరువు వద్ద మత్స్యకారుల వలసల నివారణ, స్థితిగతులు మెరుగు పరచడానికి ఇక్కడ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం’. -
చెరబట్టి.. నీరు వెల్లగొట్టి..!
[ 29-03-2024]
భానుడి ప్రతాపంతో ఎండాకాలంలో దాహార్తి తిప్పలు తప్పవని ముందే గుర్తించినా వైకాపా నేతల ఆక్రమణల పర్వంతో జిల్లాలోని అత్యధిక చెరువులు నీరు లేక ఒట్టిపోయాయి. -
అరాచకాన్ని వీడి.. ప్రగతి బాట
[ 29-03-2024]
రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న అరాచక పాలనకు చరమగీతం పాడే రోజు సమీపిస్తోందని వైకాపా నేతలు గ్రహిస్తున్నారు. -
దేవుడి పేరు చెప్పి.. కాలువ కబ్జా..!
[ 29-03-2024]
అధికార పార్టీ నేతలకు చెరువులు.. పంట కాలువలంటే లెక్కలేకుండాపోయింది. నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఏకంగా తుమ్మలగుంట చెరువునే మాయం చేసినట్లు ఆరోపణలుండగా చోటామోటా నాయకులు కాలువ పోరంబోకు భూములపై పడుతున్నారు. -
తిరుమల నడకదారిలో చిరుత
[ 29-03-2024]
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోమారు చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈనెల 25, 26వ తేదీ తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని, అటవీశాఖ ఏర్పాటుచేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత సంచారం గుర్తించినట్లు తితిదే అటవీశాఖ డీఎఫ్వో శ్రీనివాసులు వెల్లడించారు. -
బహిర్గతమైన వైకాపా కుమ్ములాటలు
[ 29-03-2024]
కేవీబీపురం వైకాపాలో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గురువారం రాత్రి వైకాపా మండల బీసీˆసెల్ అధ్యక్షుడు హరిబాబు, మండల కోఆప్షన్ మెంబర్ జాకీర్ హుస్సేన్ మధ్య జరిగిన గొడవలే నిదర్శనం. -
పీ అండ్ పీవో వ్యవస్థ నిర్వీర్యం
[ 29-03-2024]
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎప్పటికప్పుడు కొత్త వాహకనౌకలను రూపొందించి, మానవాళి అవసరాలకు అనుగుణంగా ఉపగ్రహాలను తయారు చేసి, కక్ష్యలోకి పంపుతోంది. -
ఊరించి.. కొర్రీలతో వంచించి
[ 29-03-2024]
మీకు నేనున్నా.. మీ కష్టనష్టాలు తీరుస్తా.. అంటూ తన పాదయాత్ర సమయంలో ఇంటర్, డిగ్రీ ఒప్పంద అధ్యాపకులకు హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి జగనన్న చివరకు మాటతప్పి మడమ తిప్పేశారు. -
ఈ లెక్కలు బయటకు రావా..?
[ 29-03-2024]
కులగణన సర్వే ప్రక్రియ ముగిసినా.. ప్రభుత్వం దాని వివరాలు నేటికీ వెల్లడించలేదు. ఎన్నికలకు ముందు హడావుడిగా చేపట్టిన సర్వే ప్రక్రియ జిల్లాలో ఫిబ్రవరిలోనే ముగిసింది.