శంకరా.. ఇదేం పంపిణీ సామీ?
బియ్యం కార్డుదారుల ఇంటి వద్దకే నిత్యావసర సరకులు అందజేయాలనే ఆశయంతో ప్రభుత్వం రూ.కోట్ల వ్యయంతో ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్ పథకం ఎత్తిపోయింది..
ఇంటి వద్దకే అంటే ఇలాగేనా
మండుటెండలో లబ్ధిదారుల తిప్పలు
బియ్యం తీసుకునేందుకు మండుటెండలో క్యూలో ఉన్న లబ్ధిదారులు
న్యూస్టుడే, చిత్తూరు(మిట్టూరు): బియ్యం కార్డుదారుల ఇంటి వద్దకే నిత్యావసర సరకులు అందజేయాలనే ఆశయంతో ప్రభుత్వం రూ.కోట్ల వ్యయంతో ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్ పథకం ఎత్తిపోయింది.. ఇందుకు నిదర్శనం జిల్లా కేంద్రం చిత్తూరు గిరింపేటలోని పగడమాను వీధిలో చౌక దుకాణం(నెం.5) వద్ద బారులు తీరిన కార్డుదారులు.. ఈ దుకాణానికి కేటాయించిన బియ్యం వాహనం ఎక్కడుందో ఎవరికీ తెలియదు.. ఫలితంగా మండుటెండలో కార్డుదారులు అవస్థలు చెప్పనలవికావు.
పంపిణీ ఇలా..
జూన్ నెల కోటా గురువారం నుంచి మొదలైంది. ఎండీయూ వాహనాలు నామమాత్రంగా నడుస్తున్నాయి. పలు మండలాల్లో దుకాణాల వద్దే పంపిణీ కొనసాగుతోంది. ఎండీయూ వాహనాల పనితీరు, వాటి పర్యవేక్షణ పట్టించుకునేవారే లేరు. వాహనాలు కదిలినా, కదలకపోయినా ఆపరేటర్లకు వేతనాలు మాత్రం క్రమం తప్పకుండా అందుతుండటం గమనార్హం. ఈ తరుణంలో రెండ్రోజులుగా సర్వర్ సమస్య పంపిణీకి తీవ్ర అడ్డంకిగా మారింది.
జరుగుతోందిలా..
బియ్యం కార్డుదారుల ఇంటింటికీ ఎండీయూ(మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వాహనాల ద్వారా నిత్యావసరాల సరకులు అందజేస్తున్నామనే రాష్ట్ర ప్రభుత్వ ఆర్భాటమే తప్ప.. క్షేత్రసాయిలో భిన్నంగా ఉంది. ప్రజాపంపిణీ వ్యవస్థను పర్యవేక్షించాల్సిన జిల్లా యంత్రాంగం పూర్తిగా గాలికొదిలేసింది. దీంతో కార్డుదారులకు అవస్థలు తప్పడం లేదు. జిల్లాలో 1379 చౌకదుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా 5,34,256 మందికి బియ్యం కార్డులు పంపిణీ చేశారు. ఇంటివద్దకే సరకుల పంపిణీకి 336 ఎండీయూ వాహనాలు అందుబాటులో ఉంచారు. ఈ వాహనాల వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారంతో పాటు లబ్ధిదారులకు అవస్థలే తప్ప ఏమాత్రం ఉపయోగం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
సర్వర్ పనిచేయక..
గిరింపేట పగడమాను వీధిలోని దుకాణానికి శుక్రవారం ఉదయం ఏడు గంటలకే లబ్ధిదారులు చేరుకున్నారు. సర్వర్ పనిచేయకపోవడంతో.. చేసేదేమీ లేక బియ్యం తీసుకెళ్లేందుకు తెచ్చిన సంచులను దుకాణం వద్ద క్యూలో ఉంచారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో దుకాణం వద్ద బియ్యం తీసుకునేందుకు తీవ్రమైన మండుటెండలో నిల్చొని అవస్థలు పడ్డారు. తమకు ప్రతి నెలా ఇలా తిప్పలు తప్పడం లేదని వారు వాపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఇక్కడే కాదు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఉండటం గమనార్హం. తమ బాధలు గట్టెక్కెదెన్నడోనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోచుకునే ఎమ్మెల్యేలు కావాలా..?
[ 28-03-2024]
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్వగ్రామం తుమ్మలగుంటకు చెందిన వైకాపా నేతలు రాష్ట్ర సాహితీ అకాడమీ డైరెక్టర్ దొడ్ల గౌరీ, పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దొడ్ల కరుణాకర్రెడ్డి, నరసింహమూర్తి, రేవంత్ తదితరులు చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. -
వృద్ధులు.. దివ్యాంగుల ఓట్లపై వాలంటీర్ల గురి
[ 28-03-2024]
చిత్తూరు జిల్లా పంచాయతీ, గూడూరు, న్యూస్టుడే: దివ్యాంగులైన ఓటర్లు, వృద్ధులకు కల్పించిన వెసులుబాటును వైకాపా అడ్డదారుల్లో వాడుకునే ఎత్తుగడ చేస్తోంది. -
అనిశా వలలో ఆర్ఐ
[ 28-03-2024]
స్థానిక తహసీల్దారు కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తున్న రెడ్డెప్ప బుధవారం సాయంత్రం లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కాడు -
శ్రీవారి సేవలో రామ్చరణ్ దంపతులు
[ 28-03-2024]
శ్రీవారిని ప్రముఖ సినీనటుడు రామ్చరణ్, ఉపాసన దంపతులు కుమార్తె క్లింకార ఇతర కుటుంబసభ్యులతో సుప్రభాత సేవలో దర్శించుకున్నారు -
బకాయిలిస్తేనే మరమ్మతులు
[ 28-03-2024]
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నియంత్రికలు మండుతున్నాయి.. ఎండలు తీవ్రమవడం.. విద్యుత్తు వినియోగం పెరగడం.. అధిక లోడు, సాంకేతిక కారణాలతో దగ్ధమవుతున్న వాటి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.. -
విధుల నుంచి వాలంటీర్ తొలగింపు
[ 28-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గుడుపల్లె మండలం యామగానిపల్లె సచివాలయం క్లస్టర్-4 వాలంటీర్ నాగరాజును విధుల నుంచి తొలగించామని ఎంసీసీ నోడల్ అధికారులు.. జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక పంపారు -
నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
[ 28-03-2024]
సార్వత్రిక పాఠశాల పదో తరగతి, ఇంటర్మీడియేట్ పరీక్షల్లో విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన నలుగురు ఉపాధ్యాయులను విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ డీఈవో దేవరాజు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మత్తు.. చిత్తు
[ 28-03-2024]
ఎన్నికల వేళ ప్రజలను మత్తులో ముంచేందుకు రాజకీయ పార్టీలు సర్వం సిద్ధం చేసుకున్నాయి. ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత భారీగా పొరుగు మద్యం స్వాధీనం చేసుకుంటున్నారు. -
రెండో రోజూ హైడ్రామా!
[ 28-03-2024]
రేణిగుంట మండలం పీసీఆర్ గోదాము వద్ద బుధవారం హైడ్రామా నడిచింది. రామకృష్ణాపురం సమీపంలోని గోదాము వద్ద హైడ్రామా మంగళవారం జరగ్గా.. అది కొనసాగింది. -
‘మేం కలిసి పనిచేసినా మంత్రి రోజా ఓడిపోతుంది’
[ 28-03-2024]
నగరిలో మంత్రి రోజా, అసమ్మతి నాయకులు మధ్య సయోధ్య కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. -
ఈ రంగులు మారవా.. సార్..!
[ 28-03-2024]
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి దాదాపు 12 రోజులు గడిచినా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం ఎన్నికల సంఘం అంటే కాసింత గౌరవం కాదుకదా.. భయం కూడా కొందరు అధికారుల్లో లేకపోవడం గమనార్హం -
కోడ్ అమలులో నిర్లక్ష్యం...
[ 28-03-2024]
ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చి రోజలు గడుస్తున్నా సచివాలయాలపై సీఎం జగన్ చిత్రాలు నేటికీ దర్శనమిస్తూనే ఉన్నాయి. -
యువకుడి ఆత్మహత్య
[ 28-03-2024]
ప్రేమించిన యువతి మాట్లాడక పోవడంతో వింజంకు చెందిన ధనుష్(20) బుధవారం సాయంత్రం ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. -
తెదేపాలో చేరిక
[ 28-03-2024]
మాజీ కార్పొరేటర్ అన్నపూర్ణ సహా ఎనిమిదో డివిజన్కు చెందిన పలువురు వైకాపా మహిళలు బుధవారం తెదేపాలో చేరారు. -
తెదేపా కార్యకర్తలపై ‘బైండోవర్’ వేధింపులు
[ 28-03-2024]
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక సందర్భంగా తెదేపా కార్యకర్తలపై పెట్టిన కేసు కొట్టేసినా.. ఇప్పుడు బైండోవర్ పేరుతో పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. -
వారికి సిద్ధం.. ప్రజలకు కష్టం
[ 28-03-2024]
తిరుపతి(ఆర్టీసీ), న్యూస్టుడే: వైకాపా ఎన్నికల ప్రచారంలో భాగంగా తలపెట్టిన ‘మేమంతా సిద్ధం’ సభలకు జిల్లాలోని ఆర్టీసీ బస్సులు పెద్దఎత్తున కేటాయించారు. -
పెద్దిరెడ్డికి ఇసుకే అల్పాహారం.. మైన్స్ మధ్యాహ్న భోజనం: చంద్రబాబు
[ 28-03-2024]
దుర్మార్గాలు చేసేవారిని శాశ్వతంగా వదిలించుకునే సమయం ఆసన్నమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
ఎంఎఫ్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట