జగనన్నా.. నీళ్లేవి?
జగనన్న లేఔట్లో నిర్మాణాలకు అవసరమైన నీటికి లబ్ధిదారులు అష్టకష్టాలు పడుతున్నారు. వెంకటగిరి పరిధిలో 2,250 గృహాలు మంజూరు చేశా రు. రూ.90 లక్షలతో పది బోర్లు, మోటార్లు, 90 మినీ ట్యాంకులు ఏర్పాటు చేసి నీటి వసతి కల్పించారు.
సొంత ఏర్పాట్లలో లేఔట్ల లబ్ధిదారులు
అదనపు భారంపై ఆవేదన
వెంకటగిరి పరిధిలో జరుగుతున్న నిర్మాణాలు
వెంకటగిరి: జగనన్న లేఔట్లో నిర్మాణాలకు అవసరమైన నీటికి లబ్ధిదారులు అష్టకష్టాలు పడుతున్నారు. వెంకటగిరి పరిధిలో 2,250 గృహాలు మంజూరు చేశా రు. రూ.90 లక్షలతో పది బోర్లు, మోటార్లు, 90 మినీ ట్యాంకులు ఏర్పాటు చేసి నీటి వసతి కల్పించారు. నాసిరకం పనులతో పలు చోట్ల పైపులు పగిలి నీరంతా వృథాగా పోతోంది. పలు ట్యాంకులకు సరఫరా జరగడం లేదు. లోతట్టు ప్రాంతానికి నీరందుతుండగా ఎగువన ఉన్నవారు అవస్థలు పడుతున్నారు. మరమ్మతులకు ముగ్గురు సిబ్బందిని ఏర్పాటు చేసినా ఫలితం శూన్యమే. కొన్ని ప్రాంతాల్లో నీటి ట్యాంకులు లేక ప్రైవేటుగా ట్యాంకర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ట్యాంకర్కు రూ.1000 వరకు చెల్లించాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. కొందరు నెలకు అద్దె చెల్లించి ట్యాంకర్లు తెప్పించుకుంటున్నారు. సొంతంగా బోర్లు వేసుకోవాలంటే రూ.లక్ష వరకు ఖర్చవుతోంది. మరికొందరు సమీపంలో బోరున్నవారికి కొంత నగదు చెల్లించి నీటిని వాడుకుంటున్నారు.
దొంగల బెడదతో..
ఇళ్లు వేగంగా నిర్మించుకోమని చెబుతున్న అధికారులు అవసరమైన నీటి వసతి మాత్రం కల్పించడం లేదు. ఎవరికి చెప్పినా పట్టించుకోరు.. సొంతంగా బోర్లు వేయించుకుందామంటే దొంగల బెడద తీవ్రంగా ఉంది. మోటార్లు, తీగలు చోరీ చేస్తున్నారు. చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది.
రత్నం, లబ్ధిదారుడు, వెంకటగిరి
సమస్యలు పరిష్కరిస్తాం
నీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. పైపులైన్ల మరమ్మతుల కోసం ఇటీవలే కౌన్సిల్ సమావేశంలో ఆమోదించాం. త్వరలోనే లబ్ధిదారులకు అవసరమైన నీటిని సరఫరా చేస్తాం.
వెంకటరామయ్య, పుర కమిషనర్, వెంకటగిరి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిలోద‘కౌలు’
[ 24-04-2024]
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. కౌలుదారీ చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి రైతులు నష్టపోకుండా ఆదుకుంటాం. కౌలురైతులకు గుర్తింపు కార్డులిచ్చి బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు అందేలా చేస్తాం’. -
‘సిద్ధం సభలు వెలవెలబోతున్నాయి’
[ 24-04-2024]
సీఎం జగన్ కోడికత్తి తరహాలో ప్రజల సానుభూతి పొందాలన్న ప్రయత్నం విఫలైంది.. నుదుటిపై చిన్నపాటి దెబ్బ తగిలితే ఆ పార్టీ నాయకులు హత్యాయత్నం అంటూ హడావుడి చేస్తున్నారు.. అని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. -
బ్యానర్లు తొలగించరు.. నిబంధనలు వర్తింపజేయరు
[ 24-04-2024]
గత నాలుగు రోజుల్లో వరుసగా ఉల్లంఘనలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల అధికారులు సైతం పక్షపాతం చూపుతూ వైకాపా నాయకులైతే ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతున్నారు. -
గోపాలమిత్ర.. జగన్ మౌన పాత్ర
[ 24-04-2024]
మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా.. నన్ను గెలిపించండి.. మీ వెన్నంటి ఉంటా.. -
ఐదోరోజు 24 నామినేషన్ల దాఖలు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. చిత్తూరు ఎంపీ స్థానానికి సంబంధించి రిటర్నింగ్ అధికారి షన్మోహన్కు.. అభ్యర్థులు జగపతి (కాంగ్రెస్), రమేష్ (ఆలిండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ), భూలక్ష్మి(పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), జయకర్(స్వతంత్ర) నామినేషన్లు సమర్పించారు. -
ఏడేళ్ల చిన్నారికి పెద్ద కష్టం
[ 24-04-2024]
పట్టణంలోని ఈస్టుపేటకు చెందిన ఆటో డ్రైవర్ ప్రేమకుమార్, సుభాషిణి దంపతుల కుమార్తె జెస్సిక (7). ఏడాది కిందట తీవ్ర అనారోగ్యానికి గురైంది. -
‘వైకాపాను నమ్ముకొని.. నడిరోడ్డుపైకి వచ్చా’
[ 24-04-2024]
వైకాపా ఆవిర్భావం నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తే తగిన ప్రాధాన్యం దక్కలేదని 11వ డివిజన్ వైకాపా నాయకుడు, మాజీ కార్పొరేటర్ మార్తాళ్ భర్త శివకుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. -
నమ్ముకుంటే.. మోసపోయాం
[ 24-04-2024]
రాత్రింబవళ్లు పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషిచేసిన గోపాలమిత్రల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది.. తాను అధికారంలోకి రాగానే గోపాలమిత్రలను క్రమబద్ధీకరించి, వేతనాలు పెంచుతానని ప్రజాసంకల్ప పాదయాత్రలో నేటి సీఎం జగన్ నాడు హామీ ఇచ్చారు. -
‘అరాచక పాలనకు అంతం పలకాలి’
[ 24-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెదేపా ప్రచారం జోరందుకుంది. చిత్తూరు నగరం, గుడిపాల, చిత్తూరు గ్రామీణ మండలాల్లో నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. -
బస్టాండా.. అదెక్కడ..?
[ 24-04-2024]
నియోజకవర్గ కేంద్రమైన జీడీనెల్లూరులో బస్టాండు, బస్షెల్టరు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజూ ఇక్కడి నుంచి చిత్తూరు, తిరుపతి, వేలూరు, బెంగుళూరు, చెన్నై నగరాలతోపాటు సరిహద్దున ఉన్న తమిళనాడు, కర్నాటక రాష్ట్ర ప్రాంతాలకు బస్సులు ఎక్కుతుంటారు. -
కుమారుడి కోసమే ‘కరుణ’
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తన కుమారుడు అభినయ్రెడ్డిని గెలిపించుకునేందుకు తిరుపతి ఎమ్మెల్యే, తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తాపత్రయపడుతున్నా కాలం కలసి రావడం లేదు. -
వైకాపాకు వర్తించని నిబంధనలు.. అడుగడుగునా ఉల్లంఘనలు
[ 24-04-2024]
సత్యవేడు వైకాపా అభ్యర్థి నూకతోటి రాజేష్ నామినేషన్ కార్యక్రమంలో మంగళవారం ఎన్నికల నిబంధనలను గాలికి వదిలేసినా అధికారులు పట్టించుకోలేదు.
తాజా వార్తలు (Latest News)
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ