వాలీబాల్కు పుట్టినిల్లు నరశింగాపురం
మండలంలోని నరశింగాపురం.. వాలీబాల్ క్రీడకు పుట్టినిల్లుగా పేరుగాంచింది. శ్రీవినాయక యువజన క్రీడా సంఘం పేరిట క్రీడాకారులు వాలీబాల్ క్రీడా ప్రాంగణాన్ని స్వశక్తితో ఏర్పాటు చేసుకున్నారు.
15 ఏళ్లుగా వేసవి శిక్షణ శిబిరాలు
శిక్షణ పొందుతున్న చిన్నారులు
న్యూస్టుడే, చంద్రగిరి: మండలంలోని నరశింగాపురం.. వాలీబాల్ క్రీడకు పుట్టినిల్లుగా పేరుగాంచింది. శ్రీవినాయక యువజన క్రీడా సంఘం పేరిట క్రీడాకారులు వాలీబాల్ క్రీడా ప్రాంగణాన్ని స్వశక్తితో ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం పిల్లల నుంచి పెద్దల వరకు వాలీబాల్ క్రీడలో భాగస్వాములు అవుతున్నారు. పుత్తూరు మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖర్రెడ్డి సహాయ సహకారాలతో శ్రీవినాయక యువజన క్రీడా సంఘం 15 ఏళ్లుగా వేసవి సమయంలో బాల, బాలికలకు ఉదయం, సాయంత్రం వాలీబాల్ క్రీడపై మెలకువలు నేర్పిస్తున్నారు. శిక్షణ శిబిరానికి హాజరయ్యే విద్యార్థులకు దాతల సహకారంతో ప్రతిరోజూ ఉదయం పూట పాలు, కోడిగుడ్డు, బ్రెడ్ అందిస్తున్నారు. శిక్షణ శిబిరం నిర్వహణకు గ్రామపెద్దల పరస్పర సహకారంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నిర్వహించుకోవడం గమనార్హం. ప్రస్తుతం వేసవి శిబిరంలో శ్రీవినాయక యువజన సంఘం అధ్యక్షుడు కె.షణ్ముగం, గౌరవాధ్యక్షుడు జి.సుదర్శనం ఆధ్వర్యంలో కోచ్లు జి.మధు, నిర్భయ్, మురళి 80 మంది బాల, బాలికలకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందుతున్న విద్యార్థుల అభిప్రాయాలు వారి మాటల్లో...
చదువు.. క్రీడలు సమానం
విద్యతోపాటు వాలీబాల్ క్రీడలో రాణించాలన్నదే కోరిక. రోజూ ఉదయం, సాయంత్రం శిక్షణ సమయానికి ముందుగా మైదానం చుట్టూ పరుగెత్తుతూ వ్యాయామం చేయిస్తున్నారు. ఆపైన పాలు, కోడిగుడ్డు, బ్రెడ్ అందించిన కొంత సమయం తర్వాత వాలీబాల్ క్రీడపై శిక్షణ ఇస్తున్నారు.
ధీరజ్, 8వ తరగతి
జట్లుగా ఏర్పాటై..
ఇక్కడ బాల, బాలికలకు వేర్వేరుగా వాలీబాల్ క్రీడపై గురువులు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత జట్లుగా ఏర్పాటుచేసి పోటీలు నిర్వహిస్తామన్నారు. ఇందులో సత్తా చాటుతామనే నమ్మకం ఉంది. పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు భానుప్రసాద్ విద్యార్థులు కోరిన ఆటపై శిక్షణ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు.
విష్ణుప్రియ, 8వ తరగతి
నిత్యం సాధన
విద్యతో పాటు వాలీబాల్ క్రీడల్లో మంచి గుర్తింపు పొందాలన్నదే లక్ష్యం. ఇప్పటికే పాఠశాల తరఫున మండలస్థాయి వాలీబాల్ పోటీల్లో ఇతర జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా జట్లతో పోటీ పడ్డాం. వాలీబాల్ క్రీడపై నిత్యం సాధన చేస్తున్నా. ఆటలో నైపుణ్యం సాధించి జిల్లాస్థాయి పోటీల్లో తలపడాలన్నదే లక్ష్యం.
చెంచు లక్ష్మీప్రసన్న, 9వ తరగతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
[ 19-04-2024]
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
మా ఇష్టం.. ‘అన్నీ పెద్దాయన’కే..
[ 19-04-2024]
ఆయనో ‘పెద్ద’ మంత్రి.. పైగా రాష్ట్రంలోనే నంబర్-2గా పేరుంది.. దీనికితోడు కీలక శాఖలన్నీ ఆయన గుప్పిట్లోనే ఉన్నాయి.. ఇంకేం ఆయన ఎవరికీ ఫలానా పనిచేయండి అని చెప్పనవసరం లేదు.. -
భర్తీ చేయక.. బాధపెట్టేరూ..!
[ 19-04-2024]
‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం’.. ప్రతిపక్షనేతగా ప్రజాసంకల్ప యాత్రలో జగన్ రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ ఇది. -
పేదల పాలిట.. వినాసికారే..!
[ 19-04-2024]
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
ప్రజలు తెదేపా వైపు చూస్తున్నారు..
[ 19-04-2024]
రాష్ట్ర ప్రజలు వైకాపా పాలనతో విసిగిపోయి తెదేపా వైపు చూస్తున్నారని చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి వీఎం థామస్ అన్నారు. గురువారం పెనుమూరుకు చెందిన వైకాపా నాయకులు విశ్వప్రకాష్నాయుడు, -
‘వైకాపా పాలనకు రోజులు దగ్గరపడ్డాయి’
[ 19-04-2024]
నగరి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతిలోని తన స్వగృహం నుంచి బయల్దేరి తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలోని తన తండ్రి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడి... -
జగనన్న తీరేంటంటే.. ఐదేళ్లూ చూశామంతే..!
[ 19-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించుకోవడంలో జగనన్న పనితనం మామూలుగా లేదు.. ఎన్నికలకు ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ అని మాయమాటలు చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు సీఎం జగన్.. -
న్యాయమూర్తుల సేవలు స్ఫూర్తిదాయకం
[ 19-04-2024]
కేసుల పరిష్కారంలో న్యాయమూర్తుల సేవలు అందరికి స్ఫూర్తిదాయకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. గురువారం రాత్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసమూర్తి, -
‘చంద్రబాబు ప్రత్యర్థిగా జగన్ నిలబడినా ఓటమే’
[ 19-04-2024]
కుప్పం నుంచి ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి బరిలో నిలిచినా ఓటమి ఖాయమని, ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి దాన్ని వృథా చేసుకోవద్దని, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఓటేసి విలువను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కోరారు. -
అభివృద్ధి చేసినందునే మరోమారు టికెట్
[ 19-04-2024]
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినందునే వెంకటేగౌడకు ఈ దఫా టికెట్ దక్కిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. -
వర్క్ ఆర్డర్లు క్లోజ్ చేయకపోతే వేతనాల్లో రికవరీ
[ 19-04-2024]
వర్క్ ఆర్డర్లను నెలాఖరులోగా క్లోజ్ చేయకపోతే వేతనాల నుంచి రికవరీ చేస్తామని విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్ ఎస్ఏవో శ్రీనివాసులు పేర్కొన్నారు.