మొదటి ఘాట్రోడ్డులో కారు ప్రమాదం
తిరుమల ఘాట్రోడ్డులో ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. శుక్రవారం తెలంగాణకు చెందిన భక్తులు కారులో తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.
ప్రయాణికులు సురక్షితం
ప్రమాదానికి గురైన కారు
తిరుమల, న్యూస్టుడే: తిరుమల ఘాట్రోడ్డులో ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. శుక్రవారం తెలంగాణకు చెందిన భక్తులు కారులో తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతికి మొదటి ఘాట్రోడ్డు మీదుగా దిగుతుండగా చివరి మలుపువద్ద కారు అదుపుతప్పి రక్షణ గోడకు ముందున్న బారికేడ్ను ఢీకొంది. కారులోని ఎయిర్బ్యాగ్స్ తెరచుకోవడంతో భక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఘాట్రోడ్డు భద్రతా సిబ్బంది కారును పక్కకు తప్పించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు.
అడవిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
కాకర్లవారిపల్లి(పాకాల), న్యూస్టుడే: మండలంలోని దామలచెరువు పంచాయతీ కాకర్లవారిపల్లి సమీపంలోని సిలగొందిమూల ప్రాంతంలో కామాక్షమ్మచెరువు వద్ద గుర్తు తెలియని వ్యక్తి(40) మృత దేహాన్ని స్థానికులు శుక్రవారం ఉదయం గుర్తించారు. పోలీసులకు సమాచారమివ్వడంతో సీఐ రాజశేఖర్ మృతదేహాన్ని పరిశీలించారు. వారం క్రితం మృతి చెంది ఉండవచ్చని, అతని వద్ద ఇతర ఆధారాలేమీ దొరకలేదని తెలిపారు.
అప్పులపాలై ఆత్మహత్య
రేణిగుంట: వ్యక్తిగత కారణాలతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. గాజులమండ్యం పోలీసుల కథనం మేరకు... రేణిగుంటకు చెందిన శ్రావణ్కుమార్(35)కు వివాహమై 10 సంవత్సరాలైంది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సెల్ఫోన్ దుకాణం నిర్వహిస్తూ అప్పులు పాలైయ్యాడు. జీవితంలో కుదుటపడక పోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. దీంతో గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్రావణ్కుమార్ తూకివాకం సమీపంలోని చెరువు వద్ద ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుని వద్ద వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు. గాజులమండ్యం ఎస్సై ధర్మారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోచుకునే ఎమ్మెల్యేలు కావాలా..?
[ 28-03-2024]
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్వగ్రామం తుమ్మలగుంటకు చెందిన వైకాపా నేతలు రాష్ట్ర సాహితీ అకాడమీ డైరెక్టర్ దొడ్ల గౌరీ, పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దొడ్ల కరుణాకర్రెడ్డి, నరసింహమూర్తి, రేవంత్ తదితరులు చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. -
వృద్ధులు.. దివ్యాంగుల ఓట్లపై వాలంటీర్ల గురి
[ 28-03-2024]
చిత్తూరు జిల్లా పంచాయతీ, గూడూరు, న్యూస్టుడే: దివ్యాంగులైన ఓటర్లు, వృద్ధులకు కల్పించిన వెసులుబాటును వైకాపా అడ్డదారుల్లో వాడుకునే ఎత్తుగడ చేస్తోంది. -
అనిశా వలలో ఆర్ఐ
[ 28-03-2024]
స్థానిక తహసీల్దారు కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తున్న రెడ్డెప్ప బుధవారం సాయంత్రం లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కాడు -
శ్రీవారి సేవలో రామ్చరణ్ దంపతులు
[ 28-03-2024]
శ్రీవారిని ప్రముఖ సినీనటుడు రామ్చరణ్, ఉపాసన దంపతులు కుమార్తె క్లింకార ఇతర కుటుంబసభ్యులతో సుప్రభాత సేవలో దర్శించుకున్నారు -
బకాయిలిస్తేనే మరమ్మతులు
[ 28-03-2024]
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నియంత్రికలు మండుతున్నాయి.. ఎండలు తీవ్రమవడం.. విద్యుత్తు వినియోగం పెరగడం.. అధిక లోడు, సాంకేతిక కారణాలతో దగ్ధమవుతున్న వాటి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.. -
విధుల నుంచి వాలంటీర్ తొలగింపు
[ 28-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గుడుపల్లె మండలం యామగానిపల్లె సచివాలయం క్లస్టర్-4 వాలంటీర్ నాగరాజును విధుల నుంచి తొలగించామని ఎంసీసీ నోడల్ అధికారులు.. జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక పంపారు -
నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
[ 28-03-2024]
సార్వత్రిక పాఠశాల పదో తరగతి, ఇంటర్మీడియేట్ పరీక్షల్లో విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన నలుగురు ఉపాధ్యాయులను విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ డీఈవో దేవరాజు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మత్తు.. చిత్తు
[ 28-03-2024]
ఎన్నికల వేళ ప్రజలను మత్తులో ముంచేందుకు రాజకీయ పార్టీలు సర్వం సిద్ధం చేసుకున్నాయి. ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత భారీగా పొరుగు మద్యం స్వాధీనం చేసుకుంటున్నారు. -
రెండో రోజూ హైడ్రామా!
[ 28-03-2024]
రేణిగుంట మండలం పీసీఆర్ గోదాము వద్ద బుధవారం హైడ్రామా నడిచింది. రామకృష్ణాపురం సమీపంలోని గోదాము వద్ద హైడ్రామా మంగళవారం జరగ్గా.. అది కొనసాగింది. -
‘మేం కలిసి పనిచేసినా మంత్రి రోజా ఓడిపోతుంది’
[ 28-03-2024]
నగరిలో మంత్రి రోజా, అసమ్మతి నాయకులు మధ్య సయోధ్య కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. -
ఈ రంగులు మారవా.. సార్..!
[ 28-03-2024]
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి దాదాపు 12 రోజులు గడిచినా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం ఎన్నికల సంఘం అంటే కాసింత గౌరవం కాదుకదా.. భయం కూడా కొందరు అధికారుల్లో లేకపోవడం గమనార్హం -
కోడ్ అమలులో నిర్లక్ష్యం...
[ 28-03-2024]
ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చి రోజలు గడుస్తున్నా సచివాలయాలపై సీఎం జగన్ చిత్రాలు నేటికీ దర్శనమిస్తూనే ఉన్నాయి. -
యువకుడి ఆత్మహత్య
[ 28-03-2024]
ప్రేమించిన యువతి మాట్లాడక పోవడంతో వింజంకు చెందిన ధనుష్(20) బుధవారం సాయంత్రం ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. -
తెదేపాలో చేరిక
[ 28-03-2024]
మాజీ కార్పొరేటర్ అన్నపూర్ణ సహా ఎనిమిదో డివిజన్కు చెందిన పలువురు వైకాపా మహిళలు బుధవారం తెదేపాలో చేరారు. -
తెదేపా కార్యకర్తలపై ‘బైండోవర్’ వేధింపులు
[ 28-03-2024]
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక సందర్భంగా తెదేపా కార్యకర్తలపై పెట్టిన కేసు కొట్టేసినా.. ఇప్పుడు బైండోవర్ పేరుతో పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. -
వారికి సిద్ధం.. ప్రజలకు కష్టం
[ 28-03-2024]
తిరుపతి(ఆర్టీసీ), న్యూస్టుడే: వైకాపా ఎన్నికల ప్రచారంలో భాగంగా తలపెట్టిన ‘మేమంతా సిద్ధం’ సభలకు జిల్లాలోని ఆర్టీసీ బస్సులు పెద్దఎత్తున కేటాయించారు. -
పెద్దిరెడ్డికి ఇసుకే అల్పాహారం.. మైన్స్ మధ్యాహ్న భోజనం: చంద్రబాబు
[ 28-03-2024]
దుర్మార్గాలు చేసేవారిని శాశ్వతంగా వదిలించుకునే సమయం ఆసన్నమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203