logo

తెప్పపై అలమేలుమంగ అభయం

తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం రాత్రి అమ్మవారు తెప్పపై ఊరేగుతూ భక్తులకు సాక్షాత్కరించారు. 

Published : 03 Jun 2023 02:11 IST

తెప్పపై ఊరేగుతున్న శ్రీపద్మావతీ అమ్మవారు

తిరుచానూరు, న్యూస్‌టుడే: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం రాత్రి అమ్మవారు తెప్పపై ఊరేగుతూ భక్తులకు సాక్షాత్కరించారు.  మధ్యాహ్నం ఉత్సవమూర్తిని వేంచేపుగా పద్మసరోవరంలోని నీరాడ మండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చి స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయం త్రం అలంకార శోభితురాలైన శ్రీపద్మావతీదేవి తెప్పపై కొలువుదీరి మూడు పర్యాయాలు పద్మసరోవరంలో విహరించారు.

* తెప్పోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి గజ వాహనసేవ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని