ఇదేం సంప్రదాయం
ఆంధ్ర, తమిళ భక్తుల ఆరాధ్య దైవమైన సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ తిరునాళ్లకు నెల ముందునుంచే సందడి ప్రారంభమవుతుంది.
చెంగాళమ్మకు సారె సమర్పణలో వివాదం
చెంగాళమ్మకు పసుపు, కుంకుమ సారె తీసుకొస్తున్న కోళ్లమిట్ట మహిళలు
సూళ్లూరుపేట, న్యూస్టుడే: ఆంధ్ర, తమిళ భక్తుల ఆరాధ్య దైవమైన సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ తిరునాళ్లకు నెల ముందునుంచే సందడి ప్రారంభమవుతుంది. ముందుగా పట్టణంలోని కూడళ్ల వద్దకు భక్తులు అంబళ్లు తీసుకొచ్చి పూజలు చేసి, అందరికీ పంపిణీ చేస్తారు. కొద్దిరోజులకు మూగ చాటింపు, తర్వాత తిరునాళ్లకు వారం రోజుల ముందు అమ్మవారికి పలు ప్రాంతాల నుంచి సారెలు తీసుకొస్తుంటారు. ఇందులో ముందుగా కోళ్లమిట్ట నుంచి స్థానికులు అమ్మవారికి పసుపు, కుంకుమ తీసుకొచ్చి ఆలయంలో అందజేస్తారు. ఇది కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ఈదఫా ఈ సంప్రదాయానికి దేవాదాయ శాఖ ఉద్యోగులు తిలోదకాలు పలికారు. పసుపు, కుంకమ బదులుగా ఆఖండ జ్యోతికి నూనెను తీసుకున్నారు. ఇదికాస్తా వివాదానికి దారితీసి వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. చెంగాళమ్మ తిరునాళ్లు ఈనెల 8 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆనవాయితీ మేరకు నిర్వాహకులకు తమ ప్రాంతం నుంచి పసుపు, కుంకమ తీసుకొస్తామని కోళ్లమిట్ట గ్రామస్థులు సమాచారం అందించారు. ఆ మేరకు అనుమతి పొందారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కోళ్లమిట్ట గ్రామస్థులు ఆ ప్రాంతంలోని చెంగాళమ్మ చెట్టు వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. అక్కడి నుంచి అమ్మవారికి పసుపు, కుంకుమతోపాటు సారె తీసుకుని తప్పెట్లు, తాళాలు, బాణసంచా వేడుకల మధ్య బజారు వీధుల మీదుగా చెంగాళమ్మ ఆలయానికి చేరుకున్నారు. పసుపు, కుంకుమ, సారెను ముందుగా అమ్మవారికి సమర్పించాల్సి ఉంది. అయితే వీరిని ఆలయ ఆవరణలోనే ఉంచి, గాండ్ల సంఘం వారు ఆఖండ జ్యోతికి తీసుకొచ్చిన నూనెను తీసుకున్నారు. అనంతరం వారిని అంతరాలయంలోకి పంపుతూ వచ్చారు. దరిమిలా ఆలయంలో కోళ్లమిట్ట వాసులు వందలాది మంది పడిగాపులు కాశారు. దాంతోపాటు దర్శనానికి వచ్చిన సామాన్య భక్తులు ఇబ్బంది పడ్డారు. దీనిపై కోళ్లమిట్ట వాసులు ఆలయ ఉద్యోగులను ప్రశ్నించారు. తాము ముందుగా అమ్మవారికి పసుపు, కుంకుమ సారె సమర్పించిన తర్వాత ఆఖండ జ్యోతికి నూనె తీసుకోవాలని, అలా చేయకుండా సంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చారని ఉద్యోగులను ప్రశ్నించగా వారు సమాధానం చెప్పలేదు. చివరకు అమ్మవారికి పసుపు, కుంకుమ సారె తీసుకెళ్లిన కోళ్లమిట్ట వాసులను అంతరాలయంలోకి వెళ్లనీకుండా బయటి నుంచే అమ్మవారి దర్శన భాగ్యం కల్పించి పంపేశారు. దీనిపై వివాదం నెలకొని వాగ్వాదం చోటుచేసుకుంది. తమకు అంతరాలయం దర్శనం లేకుండా, వేరొకరిని మాత్రం ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. సంప్రదాయాలను దేవాదాయ శాఖ అధికారులు సైతం పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఉన్నతాధికారులు స్పందించి సంప్రదాయాలు కొనసాగించేలా చూడాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వెన్నులో వణుకు
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.