రైలు ప్రమాదంలో జిల్లా వాసులు సురక్షితమా?
ఒడిశాలోని బాలేశ్వర్ సమీపంలోని బహనాగ్జబార్ రైల్వేస్టేషన్ వద్ద సమీపంలో చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో జిల్లా వాసులు సురక్షితమా లేదా అన్న విషయమై స్పష్టత లేదు.
రైల్వేస్టేషన్లలో హెల్ప్డెస్క్ల ఏర్పాటు
ప్రయాణికుల జాబితాను పరిశీలిస్తున్న ఎంపీ గురుమూర్తి, రైల్వే అధికారులు
ఈనాడు, తిరుపతి, న్యూస్టుడే, తిరుపతి (రైల్వే, కలెక్టరేట్), రేణిగుంట, గూడూరు గ్రామీణం: ఒడిశాలోని బాలేశ్వర్ సమీపంలోని బహనాగ్జబార్ రైల్వేస్టేషన్ వద్ద సమీపంలో చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో జిల్లా వాసులు సురక్షితమా లేదా అన్న విషయమై స్పష్టత లేదు. రైల్వేస్టేషన్లలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి.. ప్రయాణికుల సమాచారాన్ని సేకరిస్తున్నారు. శుక్రవారం చోటుచేసుకున్న ప్రమాదంలో గూడ్స్ రైలు, ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి. ఇందులో 12864 బెంగళూరు- హావ్డా రైలు తిరుపతి మీదుగా 1వ తేదీ సాయంత్రం 5.55 గంటలకు చేరుకొని ప్రయాణికులతో బయలుదేరింది. ఇందులో తిరుపతి జిల్లా పరిధిలోని తిరుపతి, రేణిగుంట, గూడూరు రైల్వేస్టేషన్ల నుంచి ఎంతమంది రిజర్వేషన్ చేసుకుని ప్రయాణించారన్న దానిపై కచ్చిత సమాచారం రైల్వే అధికారుల వద్ద లేకపోవడం గమనార్హం. ఉదయం అందిన సమాచారం ప్రకారం రిజర్వేషన్ ఖరారైన ప్రయాణికులు 19 మంది, వెయిటింగ్ లిస్ట్ 25 మంది మొత్తం 44 మంది ఉన్నట్లు తెలిసింది. ఇందులో 19 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు హెల్ప్ డెస్క్ ద్వారా సంప్రదించి తెలుసుకున్నారు. వెయిటింగ్ లిస్ట్ 25 మంది రైలు ఎక్కారా లేదా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. సాయంత్రం తిరుపతి ఎంపీ గుర్తుమూర్తి రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ను పరిశీలిస్తున్న నేపథ్యంలో రైల్వే అధికారులు తెలిపిన సమాచారం మేరకు తిరుపతి నుంచి 18 మంది, రేణిగుంట 8, గూడూరు ఇద్దరు మొత్తం 28 ప్రయాణికులు ఉన్నారని, వారు సురక్షితంగా ఉన్నట్లు ప్రకటించారు. కానీ 28 మంది ప్రయాణికుల్లో ఏసీ బోగీల్లో ప్రయాణించిన వారు సురక్షితంగా ఉన్నప్పటికీ, స్లీపర్, జనరల్ టికెట్ ద్వారా ప్రయాణించిన వారి వివరాల లెక్క లేదు. సాధారణంగా హావ్డా ఎక్స్ప్రెస్ జనరల్ బోగీలో తిరుపతికి వలస వచ్చి కూలీ పనులు చేసుకునే వారు, పానీపూరి, ఫాస్ట్ఫుడ్స్, హోటల్లో మాస్టర్లుగా పనిచేసే కార్మికులు ప్రయాణిస్తుంటారు. ఈ జాబితాకి చెందిన వారు ఉండే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నాలుగు రైళ్ల రద్దు
రైలు ప్రమాదం నేపథ్యంలో తిరుపతి మీదుగా హావ్డాకు రాకపోకలు సాగించే రైళ్లను రద్దు చేసినట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. శనివారం హావ్డా నుంచి రావాల్సిన హావ్డా- తిరుపతి (20889) రైలు, ఆదివారం తిరుపతి నుంచి బయలుదేరాల్సిన తిరుపతి- హావ్డా (20890) రైలును రద్దు చేశారు. శనివారం హావ్డా నుంచి తిరుపతి మీదుగా వెళ్లాల్సిన హావ్డా- బెంగళూరు (12863) రైలు, బెంగళూరు నుంచి తిరుపతి మీదుగా వెళ్లాల్సిన బెంగళూరు- హావ్డా (12864) రైళ్లు రద్దు అయ్యాయి.
గూడూరులో సేవాకేంద్రం
గూడూరు జంక్షన్ నుంచి బయలుదేరిన ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. శ్రీదాస్, ఎస్కే దాస్, సుశీల శ్రీకాకుళంలో దిగిపోగా నాలుగో ప్రయాణికుడు దులాల్బీ ప్రయాణిస్తున్న ఎస్1 బోగీకి ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. ఇతని జాజ్పూర్ జిల్లాకు చెందిన వ్యక్తి కాగా నెల్లూరు ప్రాంతంలో టైల్స్ పనిమీద వచ్చినట్లు తెలిపారు. రైలు ప్రమాదం సంబంధించి వివరాల కోసం గూడూరు సబ్కలెక్టర్ కార్యాలయంలో 98499 04062, 086242 50795 ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని ఆర్డీవో కిరణ్కుమార్ తెలిపారు.
కలెక్టరేట్లో..
రైలు ప్రమాదంలో జిల్లాకు చెందిన ప్రయాణికుల సమాచారం తెలుసుకునేందుకు కలెక్టరేట్లో హెల్ప్లైన్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన ప్రయాణికులు ఎవరైనా ఉంటే హెల్ప్లైన్ నంబరు: 62811 56480ను సంప్రదించాలని కోరారు. తిరుపతి రైల్వేస్టేషన్లో హెల్స్లైన్ నెంబరు 78159 15571ను అందుబాటులో ఉంచారు.
రేణిగుంటలో..
రేణిగుంట రైల్వేస్టేషన్లో హెల్ప్డెస్కును ఏర్పాటు చేశారు. ఎటువంటి వివరాలు కావాలన్నా 94935 48008 నంబర్లో సంప్రదించాలని రైల్వే అధికారులు
తెలిపారు.
మధ్యలోనే దిగి..
రేణిగుంట పరిధిలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్న చంద్రమౌలి కుటుంబంతో కలిసి హావ్డా వరకు టికెట్టు రిజర్వేషన్ చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాకుళంలోనే దిగిపోయారు. మంతుకుమార్ హావ్డా వరకు టికెట్టు రిజర్వు చేసుకున్నారు. ఇతను బాలేశ్వర్కు ముందుకు ఉన్న స్టేషన్లో దిగిపోయారు. అనురాగ్ తిరుపతి నుంచి హావ్డా వరకు టికెట్టు రిజర్వేషన్ చేసుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన అందులోనే ఏసీ కోచ్లో ఉన్నారు. ఆ కోచ్కు ఎటువంటి ఇబ్బంది కలగకపోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదం జరిగిన తీరుపై ‘ఈనాడు’ అతన్ని సంప్రదించగా ఆందోళనలో సమాచారం చెప్పలేకపోయారు. రైల్వే అధికారులు ఏర్పాటు చేసిన వాహనంలో గమ్యస్థానానికి వెళ్లారు.
భారీ శబ్దంతో ఉలిక్కిపడ్డాం
మేము నలుగురు ప్రయాణికులం. అందరూ తిరుపతి జిల్లా రేణిగుంట- నాయుడుపేట జాతీయ రహదారి పనులు చేస్తున్నాం. యశ్వంత్పూర్-హావ్డా ఎక్స్ప్రెస్లో రేణిగుంట నుంచి ఖరగ్పూర్కు రిజర్వేషన్ చేసుకున్నాం. నిరీక్షణ జాబితాలో ఉండడంతో ఎస్-7 బోగీలో బయలుదేరాం. ప్రమాద సమయంలో భారీ శబ్దంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాం. ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. నిమిషం పాటు కాళ్లు, చేతులు ఆడలేదు. బయటకు దిగి చూడగా భయంకరమైన ప్రమాదంగా కనిపించింది. జనరల్ బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఆ భయం ఇప్పటికీ ఉంది.
సులాల్ ముర్ము
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెరువులను చెరబడుతున్న వైకాపా నేతలు
[ 29-03-2024]
వైకాపా నేతల కబంధ హస్తాల్లో చెరువులు చిక్కుకున్నాయి. కుదిరితే కబ్జా చెయ్.. లేదంటే మట్టి తవ్వి సొమ్ము చేసుకో అన్న చందంగా వైకాపా నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. -
భూసార పరీక్షలెక్కడ జగనన్నా..!
[ 29-03-2024]
భూమిలో సూక్ష్మ పోషకాల లోపాన్ని తెలుసుకుని తదనుగుణంగా చర్యలు చేపడితే అన్నదాతలు అధిక దిగుబడులు సాధించి అప్పుల ఊబి నుంచి బయటపడతారన్నది ఉద్దేశం.. అందుకు భూసార పరీక్షలు తప్పనిసరి. -
స్వర్ణరథంపై ప్రమాణాల స్వామి విహారం
[ 29-03-2024]
శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారు సిద్ధిబుద్ధి సమేతుడై స్వర్ణరథంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ గురువారం రాత్రి భక్తులను అలరించారు. -
అల్పాదాయాల్లోనే.. స్వయం సహాయక సంఘాలు
[ 29-03-2024]
గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలను వైకాపా సర్కార్ ఉపయోగించుకోవడం లేదు. 80 శాతం రాయితీతో స్వయం సహాయ సంఘాలకు ఇచ్చే రుణం సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేదు. -
నియమావళి అమలు చేయాలనిపిస్తేగా?
[ 29-03-2024]
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి పది రోజులు దాటింది. కోడ్ను పక్కాగా అమలు చేయాల్సిన యంత్రాంగం కొన్నిచోట్ల తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. నేటికీ కొన్నిచోట్ల అధికార వైకాపా రంగులు దర్శన మిస్తూనే ఉన్నాయి. -
‘ఓటమి భయంతోనే దోచుకున్న సొత్తు విదేశాలకు’
[ 29-03-2024]
ఓటమి భయంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దోచుకున్న ధనాన్ని విదేశాలకు తరలిస్తున్నారని చిత్తూరు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు, గురజాల జగన్మోహన్ ఆరోపించారు. స్థానిక తెదేపా జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. -
ప్రైవేటు వాహనానికి ప్రభుత్వ స్టిక్కర్
[ 29-03-2024]
ఆయన అధికార పార్టీ మండల స్థాయి నాయకుడు.. ఆయన కోడలు రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్పర్సన్ వారి స్వంత వాహనంపై ప్రభుత్వ వాహనమంటూ స్టిక్కర్ తలిగించుకున్నారు. -
అధికారుల అనుమతి తర్వాతే వాలంటీర్ల రాజీనామాకు ఆమోదం
[ 29-03-2024]
ప్రభుత్వ భవనాలపై పార్టీ రంగులుంటే అవి అభ్యంతరాల కింద రావు. ఆ రంగులు ఎప్పట్నుంచో ఉన్నవే. ప్రభుత్వ భవనాలపై పార్టీ చిహ్నాలు, నేతల ఫొటోలు ఉంటే ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. -
గరం గరం.. పశుగ్రాసం
[ 29-03-2024]
వర్షాలు ఎండమావులయ్యాయి.. చెరువులు, కుంటలు బీటలు వారాయి.. భూగర్భ జలాలు అండుగంటిపోయాయి.. సాగు భూములు బీళ్లుగా మారుతున్నాయి.. ఈ క్రమంలో పశుగ్రాసం కొరత తీవ్రమైంది.. పశుపోషణకు రైతన్నలు నానా తంటాలు పడుతున్నారు. -
పుంగనూరులో ట్రేడింగ్ మోసగాడు
[ 29-03-2024]
తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ఆశ చూపి ట్రేడింగ్ మోసానికి పాల్పడుతున్న ఇద్దరిని తెలంగాణ రాజధాని సైబరాబాబ్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. -
జగన్ సర్కార్పై మత్స్యకారులు గుర్రు
[ 29-03-2024]
‘మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వైకాపా అడుగు ముందుకేస్తోంది. వాకాడు మండలం రాయదొరువు వద్ద మత్స్యకారుల వలసల నివారణ, స్థితిగతులు మెరుగు పరచడానికి ఇక్కడ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం’. -
చెరబట్టి.. నీరు వెల్లగొట్టి..!
[ 29-03-2024]
భానుడి ప్రతాపంతో ఎండాకాలంలో దాహార్తి తిప్పలు తప్పవని ముందే గుర్తించినా వైకాపా నేతల ఆక్రమణల పర్వంతో జిల్లాలోని అత్యధిక చెరువులు నీరు లేక ఒట్టిపోయాయి. -
అరాచకాన్ని వీడి.. ప్రగతి బాట
[ 29-03-2024]
రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న అరాచక పాలనకు చరమగీతం పాడే రోజు సమీపిస్తోందని వైకాపా నేతలు గ్రహిస్తున్నారు. -
దేవుడి పేరు చెప్పి.. కాలువ కబ్జా..!
[ 29-03-2024]
అధికార పార్టీ నేతలకు చెరువులు.. పంట కాలువలంటే లెక్కలేకుండాపోయింది. నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఏకంగా తుమ్మలగుంట చెరువునే మాయం చేసినట్లు ఆరోపణలుండగా చోటామోటా నాయకులు కాలువ పోరంబోకు భూములపై పడుతున్నారు. -
తిరుమల నడకదారిలో చిరుత
[ 29-03-2024]
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోమారు చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈనెల 25, 26వ తేదీ తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని, అటవీశాఖ ఏర్పాటుచేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత సంచారం గుర్తించినట్లు తితిదే అటవీశాఖ డీఎఫ్వో శ్రీనివాసులు వెల్లడించారు. -
బహిర్గతమైన వైకాపా కుమ్ములాటలు
[ 29-03-2024]
కేవీబీపురం వైకాపాలో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గురువారం రాత్రి వైకాపా మండల బీసీˆసెల్ అధ్యక్షుడు హరిబాబు, మండల కోఆప్షన్ మెంబర్ జాకీర్ హుస్సేన్ మధ్య జరిగిన గొడవలే నిదర్శనం. -
పీ అండ్ పీవో వ్యవస్థ నిర్వీర్యం
[ 29-03-2024]
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎప్పటికప్పుడు కొత్త వాహకనౌకలను రూపొందించి, మానవాళి అవసరాలకు అనుగుణంగా ఉపగ్రహాలను తయారు చేసి, కక్ష్యలోకి పంపుతోంది. -
ఊరించి.. కొర్రీలతో వంచించి
[ 29-03-2024]
మీకు నేనున్నా.. మీ కష్టనష్టాలు తీరుస్తా.. అంటూ తన పాదయాత్ర సమయంలో ఇంటర్, డిగ్రీ ఒప్పంద అధ్యాపకులకు హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి జగనన్న చివరకు మాటతప్పి మడమ తిప్పేశారు. -
ఈ లెక్కలు బయటకు రావా..?
[ 29-03-2024]
కులగణన సర్వే ప్రక్రియ ముగిసినా.. ప్రభుత్వం దాని వివరాలు నేటికీ వెల్లడించలేదు. ఎన్నికలకు ముందు హడావుడిగా చేపట్టిన సర్వే ప్రక్రియ జిల్లాలో ఫిబ్రవరిలోనే ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు