అరుణాచల ప్రయాణం.. అంతులేని విషాదం
ఉద్యోగ, వ్యాపారం నిమిత్తం జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలో స్థిరపడిన కుటుంబాలు వారివి. ఒకే అపార్టుమెంట్లో నివసిస్తుండటంతో పరస్పరం పరిచయాలు పెరిగాయి.
దైవ దర్శనానికి వెళ్తుండగా దుర్ఘటన
జేసీబీతో లక్ష్మీదేవి మృతదేహం వెలికితీత
కల్లూరు, నంద్యాల, న్యూస్టుడే: ఉద్యోగ, వ్యాపారం నిమిత్తం జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలో స్థిరపడిన కుటుంబాలు వారివి. ఒకే అపార్టుమెంట్లో నివసిస్తుండటంతో పరస్పరం పరిచయాలు పెరిగాయి. శుభకార్యాలు, తీర్థయాత్రలకు కలిసే వెళ్లేవారు. ఈ క్రమంలోనే ఇరుగుపొరుగు వారంతా కలిసి కాణిపాకం, అరుణాచలం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఒక వాహనాన్ని మాట్లాడుకుని తీర్థయాత్రకు బయల్దేరారు. సంతోషంగా సాగిపోతున్న వారి యాత్రపై మృత్యువు పంజా విసిరింది. నంద్యాల జిల్లాకు చెందిన నలుగురిని పొట్టన పెట్టుకుంది.
ఒకరోజు ముందుగానే బయల్దేరి
ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం వీరంతా శనివారం రాత్రి బయల్దేరాల్సి ఉంది. పౌర్ణమి రోజు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయాలనుకుని శుక్రవారం రాత్రే బయల్దేరారు. శనివారం కాణిపాకం చూసుకుని ఆదివారం అరుణాచలం చేరుకోవాలని భావించారు. మార్గమధ్యలో జరిగిన ప్రమాదం వీరి కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ప్రమాదంలో మృతి చెందిన లక్ష్మీదేవి(54)కి భర్త రామమోహన్, కుమారుడు, కుమార్తె ఉన్నారు. విమలమ్మ(52) భర్త నాగన్న విద్యుత్తు శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు సంతానం. ఎస్బీఐ కాలనీలో నివసిస్తున్న శివమ్మ(45) భర్త శివస్వాములు శిరివెళ్ల పోలీస్స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. వీరికి కుమార్తె ఉంది. నర్సు క్వార్టర్స్కు చెందిన ప్రతాప్రెడ్డి(39) వ్యాపారం చేసేవారు. ఇతనికి భార్య స్వాతి, ఇద్దరు పిల్లలు సంతానం.
డ్రైవర్ల తప్పిదమే కారణం
ప్రమాద స్థలాన్ని చిత్తూరు డీఎస్పీ కె.శ్రీనివాసమూర్తి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై కల్లూరు సీఐ ఆశీర్వాదం, ఎస్సై రవిప్రకాష్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పీలేరు నుంచి సిమెంటు లోడుతో వస్తున్న లారీ.. ఘాట్ రోడ్డు రావడంతో డ్రైవరు గేరు మార్చగా వేగం తగ్గింది. అంతలోనే భక్తులతో వస్తున్న వాహనం అతివేగంగా దూసుకురావడంతో లారీని వెనుక భాగంలో ఢీకొంది. మరోసారి లారీ ముందు భాగాన ఢీకొంది. ఇద్దరు డ్రైవర్ల తప్పిదంతోనే ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు డీఎస్పీ, సీఐ తెలిపారు. వాహనం డ్రైవరు ఆదినారాయణ, లారీ డ్రైవరు పుమారియప్పన్ పరారీలో ఉన్నట్లు చెప్పారు.
ప్రమాద సూచికలు లేని సంఘటన స్థలం మలుపు
ఈ మలుపులో నిత్యం ప్రమాదాలే
ఎంజేఆర్ ఇంజినీరింగ్ కళాశాల నుంచి దిగువున ఉన్న మలుపు వరకు నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో కళాశాల ఎదురుగా వాహనాలు అతివేగంగా వెళ్లకుండా బారికేడ్లు ఉండేవి. ప్రస్తుతం వాటిలో ఒకటి పక్కన పెట్టారు. ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు, స్పీడు బ్రేకుల ఏర్పాటు వంటి చర్యలు తీసుకోలేదు. శనివారం ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే గతంలోనూ పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది జనవరిలో రెండు లారీలు ఢీకొన్నాయి. ఏప్రిల్ 15న పులిచెర్ల మండలం దిగువపోకలారిపల్లెకు యువకుడు పి.రాజేష్ తన కారులో వస్తుండగా ఎదురుగా వాహనం దూసుకొచ్చి ఢీకొంది. కారు బెలూన్ తెరుచుకోవడంతో రాజేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అంతకుముందు మూడేళ్ల క్రితం ఎంజేఆర్ కళాశాల ఎదురుగా పీలేరులో వంట పనికి వెళ్లి వస్తూ పెద్దపంజాణికి చెందిన శ్రీనివాసులు గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. 2020లో పాకాల మండలంలో ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న ఉద్యోగి ద్విచక్రవాహనంపై కలికిరికి వెళ్తూ ఎదురుగా లారీ ఢీకొని అక్కడక్కడే దుర్మరణం చెందాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా ఇష్టం.. ‘అన్నీ పెద్దాయన’కే..
[ 19-04-2024]
ఆయనో ‘పెద్ద’ మంత్రి.. పైగా రాష్ట్రంలోనే నంబర్-2గా పేరుంది.. దీనికితోడు కీలక శాఖలన్నీ ఆయన గుప్పిట్లోనే ఉన్నాయి.. ఇంకేం ఆయన ఎవరికీ ఫలానా పనిచేయండి అని చెప్పనవసరం లేదు.. -
భర్తీ చేయక.. బాధపెట్టేరూ..!
[ 19-04-2024]
‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం’.. ప్రతిపక్షనేతగా ప్రజాసంకల్ప యాత్రలో జగన్ రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ ఇది. -
పేదల పాలిట.. వినాసికారే..!
[ 19-04-2024]
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
ప్రజలు తెదేపా వైపు చూస్తున్నారు..
[ 19-04-2024]
రాష్ట్ర ప్రజలు వైకాపా పాలనతో విసిగిపోయి తెదేపా వైపు చూస్తున్నారని చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి వీఎం థామస్ అన్నారు. గురువారం పెనుమూరుకు చెందిన వైకాపా నాయకులు విశ్వప్రకాష్నాయుడు, -
‘వైకాపా పాలనకు రోజులు దగ్గరపడ్డాయి’
[ 19-04-2024]
నగరి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతిలోని తన స్వగృహం నుంచి బయల్దేరి తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలోని తన తండ్రి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడి... -
జగనన్న తీరేంటంటే.. ఐదేళ్లూ చూశామంతే..!
[ 19-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించుకోవడంలో జగనన్న పనితనం మామూలుగా లేదు.. ఎన్నికలకు ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ అని మాయమాటలు చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు సీఎం జగన్.. -
న్యాయమూర్తుల సేవలు స్ఫూర్తిదాయకం
[ 19-04-2024]
కేసుల పరిష్కారంలో న్యాయమూర్తుల సేవలు అందరికి స్ఫూర్తిదాయకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. గురువారం రాత్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసమూర్తి, -
‘చంద్రబాబు ప్రత్యర్థిగా జగన్ నిలబడినా ఓటమే’
[ 19-04-2024]
కుప్పం నుంచి ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి బరిలో నిలిచినా ఓటమి ఖాయమని, ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి దాన్ని వృథా చేసుకోవద్దని, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఓటేసి విలువను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కోరారు. -
అభివృద్ధి చేసినందునే మరోమారు టికెట్
[ 19-04-2024]
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినందునే వెంకటేగౌడకు ఈ దఫా టికెట్ దక్కిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. -
వర్క్ ఆర్డర్లు క్లోజ్ చేయకపోతే వేతనాల్లో రికవరీ
[ 19-04-2024]
వర్క్ ఆర్డర్లను నెలాఖరులోగా క్లోజ్ చేయకపోతే వేతనాల నుంచి రికవరీ చేస్తామని విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్ ఎస్ఏవో శ్రీనివాసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి