అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని రాత్రిళ్లు దొంగతనాలు చేస్తున్న ఓ అంతర్రాష్ట్ర దొంగను తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. అతను 44 కేసుల్లో నిందితుడిగా గుర్తించారు.
44 చోరీ కేసులు.. రూ.40 లక్షల సొత్తు స్వాధీనం
స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి వస్తువులు పరిశీలిస్తున్న ఎస్పీ తదితరులు
తిరుపతి(నేరవిభాగం): తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని రాత్రిళ్లు దొంగతనాలు చేస్తున్న ఓ అంతర్రాష్ట్ర దొంగను తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. అతను 44 కేసుల్లో నిందితుడిగా గుర్తించారు. దొంగ నుంచి రూ. 40 లక్షల విలువైన 793 గ్రాముల బంగారు, 1235 గ్రాములు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను డీపీవో శనివారం ఎస్పీ పరమేశ్వరరెడ్డి శనివారం విలేకర్లకు వెల్లడించారు. ఈ నెల 2వ తేదీ సాయంత్రం 3 గంటలకు అలిపిరి సీఐ అబ్బన్నకు అందిన సమాచారం మేరకు ఎస్ఐ చిన్న రెడ్డెప్ప, సిబ్బంది తిమ్మినాయుడు పాళెం బస్టాండు వద్దకు చేరుకున్నారు. వారిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా విశాఖపట్నం జిల్లాలోని సీతంపేటకు చెందిన బోడబతుల శీను (34)గా గుర్తించారు. అతను ప్రస్తుతం మంగళం వెంకటేశ్వర కాలనీలో వాటర్ ట్యాంకు వద్ద నివాసం ఉంటున్నట్లు తెలుసుకున్నారు. తిరుపతిలోని పలు ప్రాంతాల్లో వరస చోరీలకు పాల్పడ్డట్లు అంగీకరించారు. 2010 నుంచి విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుచానూరు, తిరుపతి సీసీఎస్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 35కు పైగా దొంగతనం కేసులు నమోదైనట్లు గుర్తించారు. పలు కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించారు. ప్రస్తుతం అలిపిరి పోలీస్స్టేషన్ పరిధిలో 9 కేసులు నమోదు చేశారు. సీఐ అబ్బన్న, ఎస్ఐలు చిన్నరెడ్డెప్ప, జయచంద్ర, ఇమ్రాన్ బాష, సిబ్బందికి రివార్డులు అందజేశారు. అదనపు ఎస్పీ వెంకట్రావు, డీఎస్పీ సురేంద్రరెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న ‘ఘోర’ముద్ద
[ 20-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు మంచి నాణ్యమైన భోజనం అందించేందుకు జగనన్న గోరుముద్ద కార్యక్రమం ప్రవేశపెట్టామని, రోజూ మెనూ ప్రకారం భోజనం అందిస్తామని సీఎం జగన్ చెప్పారు. -
పెద్దిరెడ్డి.. ప్ర‘జల’ ఆశలకు గండి
[ 20-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తర్వాత వైకాపాలో నంబరు 2గా, రాయలసీమ జిల్లాల్లో పెత్తనం చెలాయిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిందే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శాసనం.. కాంట్రాక్టులన్నీ ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే. -
రెండో రోజు 16 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం 16 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని జిల్లా ఎన్నికల అధికారి షన్మోహన్ తెలిపారు. -
ఎమ్మెల్సీ భరత్ను ఆపేసిన పోలీసులు..
[ 20-04-2024]
చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప నామినేషన్ దాఖలు సందర్భంగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన వైకాపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ను ప్రధాన గేటు వద్దే పోలీసులు ఆపివేశారు -
వైకాపా భూస్మాసురులు
[ 20-04-2024]
పేదలకు దక్కాల్సిన డీకేటీ భూములు వైకాపా అభ్యర్థుల సొంతమయ్యాయి. ఈ మేరకు వారే ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్లలో పేర్కొనడం గమనార్హం. -
చీకట్లోనే తనిఖీలు.. చిక్కేరా ఉల్లం‘ఘనులు’
[ 20-04-2024]
అసలే చంద్రగిరి.. తాయిలాలు.. ప్రలోభాలు తారస్థాయిలో జరుగుతున్న వేళ నియోజకవర్గంలోని ఓ తనిఖీ కేంద్రం దుస్థితి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. -
లోక్సభకు 3.. శాసనసభకు 17
[ 20-04-2024]
జిల్లా వ్యాప్తంగా రెండోరోజు తిరుపతి లోక్సభ స్థానానికి మూడు, ఏడు శాసనసభ స్థానాలకు 17 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు -
కుప్పం గడ్డ.. చంద్రబాబు అడ్డా
[ 20-04-2024]
పురపాలిక పరిధిలోని లక్ష్మీపురం శ్రీవరదరాజులస్వామి దేవాలయంలో నారా భువనేశ్వరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. -
‘గురు’తర బాధ్యత ఇదేనా జగన్?
[ 20-04-2024]
బోధన సరిగ్గా చేయడంలేదంటూ చిత్తూరు మండలంలోని మాపాక్షి జడ్పీ పాఠశాలలోని హెచ్ఎంను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అందరి ఎదుటే మందలించారు. -
నిబంధన మీరి.. దూసుకొచ్చి..
[ 20-04-2024]
నామినేషన్ దాఖలు సమయంలో ఆర్వో కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు నిలిచిపోవాలన్న నిబంధనను పుంగనూరులో వైకాపా శ్రేణులు అతిక్రమించాయి -
వైకాపా రంగుల పలకలు తొలగించారు
[ 20-04-2024]
పోలింగ్ కేంద్రాలు కల్గిన బడి ఆవరణలో వైకాపా రంగులతో ఏర్పాటు చేసిన సిమెంటు బెంచీలకు రంగుల పలకలను అధికారులు తీయించారు. -
రాష్ట్ర విభజనకు కారకుడైన కిరణ్కుమార్రెడ్డి
[ 20-04-2024]
ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకొచ్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. -
తెదేపా నేతపై దాడి
[ 20-04-2024]
పులిచెర్ల మండలం రేణుమాకులపల్లె పంచాయతీ బి.వడ్డిపల్లెకు చెందిన తెదేపా నాయకుడు సుబ్బరాజుపై స్థానిక వైకాపాకి చెందిన రెడ్డప్ప, వెంకటరమణ అన్నదమ్ములు దాడి పాల్పడ్డారు -
నేడు జిల్లాకు తెదేపా అధినేత రాక
[ 20-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు జిల్లాలో శనివారం పర్యటించనున్నారు. ఉదయం 10:40 గంటలకు గూడూరులోని వరగాలి క్రాస్రోడ్డు సమీపంలోని హెలిపాడ్ చేరుకుంటారు.