ఆ టీచర్లకు అక్కడేం పని?
ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరని తల్లిదండ్రులు చెబుతున్నారు.. డీఈవో ఆఫీస్లో 136మంది టీచర్లను కూర్చోబెడుతున్నారు.. అవసరమైన పాఠశాలలకు డిప్యుటేషన్ వేయొచ్చు కదా అని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అధికారులను ప్రశ్నించారు.
వివరాలు చెప్పలేకపోయిన డీఈవోలపై ఆగ్రహం
ఉమ్మడి జిల్లాలో ప్రవీణ్ ప్రకాష్ సుడిగాలి పర్యటన
గంగవరంలో విద్యాకానుక బూట్లు పరిశీలిస్తున్న ప్రవీణ్ప్రకాష్, కలెక్టర్ షన్మోహన్
చిత్తూరు విద్య, న్యూస్టుడే: ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరని తల్లిదండ్రులు చెబుతున్నారు.. డీఈవో ఆఫీస్లో 136మంది టీచర్లను కూర్చోబెడుతున్నారు.. అవసరమైన పాఠశాలలకు డిప్యుటేషన్ వేయొచ్చు కదా అని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అధికారులను ప్రశ్నించారు. జిల్లాలోని పుంగనూరు భగత్సింగ్ కాలనీ ఉర్దూ పాఠశాల సందర్శన సమయాన పైవిధంగా మాట్లాడారు. రాయలసీమలో ఎన్ని ఉర్దూ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరు? ఎక్కడ అవసరం? డీఈవో ఆఫీస్లో కూర్చొంటున్న వారిని ఎందుకు అక్కడ సర్దుబాటు చేయలేదని ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డిని ప్రశ్నించారు. గంగవరం మండలం మేలుమాయి జడ్పీ ఉన్నత పాఠశాల తనిఖీలో పాత పాఠ్యపుస్తకాలు ఉండటం, సెలవుల్లో పిల్లలు పాఠశాలలో కన్పించడంతో వారిని ఎందుకు పిలిపించారు.. ఇప్పుడు ఈ పిల్లలను నేను కలవాలా.. నా ఇష్టం వచ్చిన వారిని కలుస్తా, మాట్లాడతానని హెచ్ఎం శ్రీధర్బాబును మందలించారు. మేలుమాయిలో కలెక్టర్ షన్మోహన్తో కలిసి విద్యాకానుక సామగ్రి పరిశీలించారు. ముఖ్య కార్యదర్శి ఆదేశాల నేపథ్యంలో.. హెచ్ఎం శ్రీధర్బాబుపై డీఈవో విజయేంద్రరావు ఆర్జేడీకి నివేదిక ఇవ్వనున్నారు.
పాఠాలు చెప్పకుంటే సీఆర్పీ వ్యవస్థ రద్దే
ఏకోపాధ్యాయ పాఠశాలల్లో టీచర్ సెలవులో వెళ్తే సీఆర్పీలు వెళ్లి పాఠాలు చెప్పకుంటే ఏకంగా ఆ వ్యవస్థనే రద్దు చేయాల్సి వస్తుందని పలమనేరులో సీఆర్పీలను ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. వారితో మాట్లాడుతూ బీఈడీ చదివిన వారే సీఆర్పీలుగా ఉన్నారని, ఈ పాఠశాలలు ఎక్కడా మూతపడరాదని స్పష్టం చేశారు. తన పర్యటనలో భాగంగా ప్రవీణ్ప్రకాష్.. ఇద్దరు డీఈవోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల తనిఖీ సమయాన డీఈవో శేఖర్ని పలు ప్రశ్నలు వేయగా ఆయన చెప్పేందుకు తడబడగా మండిపడ్డారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో తనిఖీ సమయంలో జిల్లాలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు, వారిలో తొమ్మిదో తరగతి వారు ఎంతమంది అని డీఈవో విజయేంద్ర రావును ప్రశ్నించగా ఆయన నెమ్మదిగా సమాధానం చెప్పడంతో ఆగ్రహించారు. తిరుపతి జిల్లాలో నాడు-నేడు మొదటి విడత పనులు పూర్తికాకపోవడంతో అసహనం వ్యక్తం చేసిన ఆయన.. ఆ వివరాలు తీసుకుని విజయవాడకు రావాలని సమగ్ర శిక్ష ఉమ్మడి జిల్లా ఏపీసీ వెంకట రమణారెడ్డిని ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వెన్నులో వణుకు
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.