ప్రసూతి ఆసుపత్రిలో బిడ్డలకు అభద్రత
తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో బిడ్డ చోరీ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించడంతో చోరీ యత్నంగానే మిగిలింది.
అమలు కాని జియో ట్యాగింగ్ విధానం
తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో బిడ్డ చోరీ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించడంతో చోరీ యత్నంగానే మిగిలింది. గతంలో మాదిరి బిడ్డల మాయం.. పురిటి బిడ్డల మార్పు తరహా ఘటనలు జరిగేందుకు ఆస్కారం ఉంది. ప్రసవం తర్వాత తల్లి, బిడ్డకు జియో ట్యాగ్లు వేసే విధానం ప్రస్తుతం అమలులో లేదు. ఇదే క్రమంలో రోగి సహాయకులను లెక్కకు మించి అనుమతిస్తున్నారు. ఆస్పత్రి యాజమాన్యం తీరుతో ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే అవకాశం లేకపోలేదు.
న్యూస్టుడే, తిరుపతి (వైద్యం)
తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో రోగుల సహాయకులు అత్యధిక సంఖ్యలో అక్కడికి వస్తున్నారు. మగవారికి ప్రవేశం కల్పించాలని నిత్యం భద్రతా సిబ్బందితో పలువురు గొడవ పడుతూనే ఉన్నారు. ఈ విషయమై ఆస్పత్రి యాజమాన్యం నిర్దిష్ట నిబంధనలు అమలు చేయకపోవడంతో పసిపిల్లల చోరీ ఘటనలకు ఆస్కారం ఉంది. సాధారణ, శస్త్రచికిత్స కాన్పుల తర్వాత ఒకట్రెండు రోజులకు వార్డులోకి తల్లీబిడ్డలను తరలిస్తారు. వార్డులోకి ఎవరెవరు వెళ్తున్నారు.. రోగితో ఎంతమంది ఉంటున్నారనే విషయాలను ఆస్పత్రి యాజమాన్యం విస్మరిస్తోంది. కాన్పుల వార్డు వరకే తమ పరిధి అంటూ ఆస్పత్రి యాజమాన్యం వ్యవహరిస్తోంది.
* ఈ పరికరం ఎలా పనిచేస్తుందంటే..: రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైజ్ (జియో ట్యాగ్) విధానాన్ని 2017 నుంచి అమలులోకి తెచ్చారు. ప్రసవం జరిగిన వెంటనే తల్లీబిడ్డల చేతులకు వీటిని అమర్చుతారు. తల్లి, బిడ్డ మధ్య దూరం వంద అడుగుల కన్నా ఎక్కువ ఉంటే ఈ పరికరం శబ్దం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వార్డు నుంచి వేర్వేరుగా తల్లీబిడ్డలు బయటకు వచ్చే అవకాశం ఉండేది కాదు. ముఖ్యంగా ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లడం అసాధ్యంగా మారేది.
జియో ట్యాగ్ పరికరాలు
* నాలుగేళ్లుగా విస్మరించడంతో..: బిడ్డల చోరీలు.. మార్పుల ఆరోపణలను నియంత్రించే లక్ష్యంగా అమల్లోకి తెచ్చిన జియో ట్యాగింగ్ వ్యవస్థను విస్మరించారు. ఈ విధానాన్ని కరోనాకు ముందు నుంచే నిర్వీర్యం చేశారు. ఆ సమయంలో పుట్టిన మగబిడ్డను మార్చేశారనే ఆరోపణలు.. ఓ బిడ్డ మృతదేహం డ్రైనేజీలో కన్పించడం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత కరోనా విజృంభించడంతో కాన్పుల సంఖ్య తగ్గడం ఈ తరహా ఆరోపణలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం పూర్తిస్థాయిలో కాన్పులు జరుగుతుండటంతో మళ్లీ దొంగల కన్ను ప్రసూతి ఆస్పత్రిపై పడింది. ఇప్పటికైనా ప్రసూతి ఆస్పత్రి యాజమాన్యం పటిష్ఠ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
పునరుద్ధరణకు కృషి:
తల్లీబిడ్డలకు ప్రస్తుతం సాధారణ ట్యాగ్ వేస్తున్నాం. జియో ట్యాగ్ల వ్యవస్థను కరోనా సమయం నుంచి నిలిపి వేశాం. దీని పునరుద్ధరణకు కృషి చేస్తాం.
పార్థసారథిరెడ్డి, సూపరింటెండెంట్, ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి
ఆసుపత్రిలో ఇన్పేషంట్లు: 340 - 360 మంది
రోజూ ప్రసవాలు: 30 -40
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిలోద‘కౌలు’
[ 24-04-2024]
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. కౌలుదారీ చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి రైతులు నష్టపోకుండా ఆదుకుంటాం. కౌలురైతులకు గుర్తింపు కార్డులిచ్చి బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు అందేలా చేస్తాం’. -
‘సిద్ధం సభలు వెలవెలబోతున్నాయి’
[ 24-04-2024]
సీఎం జగన్ కోడికత్తి తరహాలో ప్రజల సానుభూతి పొందాలన్న ప్రయత్నం విఫలైంది.. నుదుటిపై చిన్నపాటి దెబ్బ తగిలితే ఆ పార్టీ నాయకులు హత్యాయత్నం అంటూ హడావుడి చేస్తున్నారు.. అని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. -
బ్యానర్లు తొలగించరు.. నిబంధనలు వర్తింపజేయరు
[ 24-04-2024]
గత నాలుగు రోజుల్లో వరుసగా ఉల్లంఘనలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల అధికారులు సైతం పక్షపాతం చూపుతూ వైకాపా నాయకులైతే ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతున్నారు. -
గోపాలమిత్ర.. జగన్ మౌన పాత్ర
[ 24-04-2024]
మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా.. నన్ను గెలిపించండి.. మీ వెన్నంటి ఉంటా.. -
ఐదోరోజు 24 నామినేషన్ల దాఖలు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. చిత్తూరు ఎంపీ స్థానానికి సంబంధించి రిటర్నింగ్ అధికారి షన్మోహన్కు.. అభ్యర్థులు జగపతి (కాంగ్రెస్), రమేష్ (ఆలిండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ), భూలక్ష్మి(పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), జయకర్(స్వతంత్ర) నామినేషన్లు సమర్పించారు. -
ఏడేళ్ల చిన్నారికి పెద్ద కష్టం
[ 24-04-2024]
పట్టణంలోని ఈస్టుపేటకు చెందిన ఆటో డ్రైవర్ ప్రేమకుమార్, సుభాషిణి దంపతుల కుమార్తె జెస్సిక (7). ఏడాది కిందట తీవ్ర అనారోగ్యానికి గురైంది. -
‘వైకాపాను నమ్ముకొని.. నడిరోడ్డుపైకి వచ్చా’
[ 24-04-2024]
వైకాపా ఆవిర్భావం నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తే తగిన ప్రాధాన్యం దక్కలేదని 11వ డివిజన్ వైకాపా నాయకుడు, మాజీ కార్పొరేటర్ మార్తాళ్ భర్త శివకుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. -
నమ్ముకుంటే.. మోసపోయాం
[ 24-04-2024]
రాత్రింబవళ్లు పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషిచేసిన గోపాలమిత్రల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది.. తాను అధికారంలోకి రాగానే గోపాలమిత్రలను క్రమబద్ధీకరించి, వేతనాలు పెంచుతానని ప్రజాసంకల్ప పాదయాత్రలో నేటి సీఎం జగన్ నాడు హామీ ఇచ్చారు. -
‘అరాచక పాలనకు అంతం పలకాలి’
[ 24-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెదేపా ప్రచారం జోరందుకుంది. చిత్తూరు నగరం, గుడిపాల, చిత్తూరు గ్రామీణ మండలాల్లో నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. -
బస్టాండా.. అదెక్కడ..?
[ 24-04-2024]
నియోజకవర్గ కేంద్రమైన జీడీనెల్లూరులో బస్టాండు, బస్షెల్టరు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజూ ఇక్కడి నుంచి చిత్తూరు, తిరుపతి, వేలూరు, బెంగుళూరు, చెన్నై నగరాలతోపాటు సరిహద్దున ఉన్న తమిళనాడు, కర్నాటక రాష్ట్ర ప్రాంతాలకు బస్సులు ఎక్కుతుంటారు. -
కుమారుడి కోసమే ‘కరుణ’
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తన కుమారుడు అభినయ్రెడ్డిని గెలిపించుకునేందుకు తిరుపతి ఎమ్మెల్యే, తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తాపత్రయపడుతున్నా కాలం కలసి రావడం లేదు. -
వైకాపాకు వర్తించని నిబంధనలు.. అడుగడుగునా ఉల్లంఘనలు
[ 24-04-2024]
సత్యవేడు వైకాపా అభ్యర్థి నూకతోటి రాజేష్ నామినేషన్ కార్యక్రమంలో మంగళవారం ఎన్నికల నిబంధనలను గాలికి వదిలేసినా అధికారులు పట్టించుకోలేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?