ఆస్తులపై అడ్డగోలు బాదుడే..!
స్తిరాస్థి క్రయవిక్రయాలను ప్రభుత్వం ఆదాయ వనరుగా భావిస్తోంది. ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచి సొమ్ము చేసుకుంటోంది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సవరణల పేరిట ఏటికేడాది పెంచేస్తోంది.
విలువ పెంపుపై తీవ్ర వ్యతిరేకత
ఆదాయ వనరుగా మారిన రిజిస్ట్రేషన్ల శాఖ
గూడూరు, న్యూస్టుడే: స్తిరాస్థి క్రయవిక్రయాలను ప్రభుత్వం ఆదాయ వనరుగా భావిస్తోంది. ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచి సొమ్ము చేసుకుంటోంది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సవరణల పేరిట ఏటికేడాది పెంచేస్తోంది. దీంతో ఇటు స్థలాలతో పాటు నిర్మాణాల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదేం బాదుడు అంటూ రైతులు బావురుమంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఏటా 1.10 లక్షల డాక్యుమెంట్ల ద్వారా రూ.300 కోట్ల పైచిలుకు ఆదాయం వస్తోంది. తాజా పెంపుతో రూ.50 కోట్ల మేర అదనపు ఆదాయం రాబట్టడానికి యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్తుల క్రయవిక్రయాలు సర్వ సాధారణం కాగా స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉంటాయి. అన్నీ కలిపి ఆస్తి విలువలో 7% వరకు చెల్లించాల్సి ఉంటోంది. ఇలా ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా ప్రభుత్వం లాభాలు ఆశించడం మొదలు పెట్టింది. ఏటికేడాది పెంచుకుంటూ బాధ్యత విస్మరిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పట్టణాలతో పాటు పల్లెల్లో భూముల ధరలు లెక్కలేనంతగా పెరిగిపోవడంతో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
భాగ పరిష్కారానికి అప్పు
తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి కొడుకులు, కుమార్తెలకు పంపిణీ చేయాలన్నా ధరలు విపరీతంగా పెరిగాయి. తండ్రి పేరిట ఆస్తి మొత్తం ఉండటంతో సామాజిక భద్రత పింఛన్ రద్దు చేశారు. ఇద్దరు కొడుకులం కాగా విడిపోయి పదేళ్లయ్యింది. ఆస్తి మార్పిడికి వెళ్తే రూ.వేలల్లో ఫీజులు ఉండటంతో అప్పు చేయాల్సి వస్తోంది.
జలదంకి భక్తవత్సలరెడ్డి, వేముగుంటపాళెం, నాయుడుపేట
* తిరుపతి నగరంలోని శాంతినగర్, శ్రీనగర్కాలనీ, రాయల్నగర్ ప్రాంతాల్లో గజం ధర రూ.62 వేలుగా ఉంది. తాజా పరిస్థితుల్లో రూ.65 వేల వరకు పెంచేశారు. నిర్మాణాల విషయానికొస్తే ఇదే ప్రాంతాల్లో మొదటి అంతస్తు ధర రూ.4,600 ఉంది. సవరణల పేరిట రూ.5 వేల వరకు పెంచినట్లు సమాచారం.
* శ్రీకాళహస్తి పట్టణంలోని నగరి వీధిలో చదరపు గజం ధర రూ.12 వేలు కాగా ఇక్కడే మొదటి అంతస్తుకు రూ.1,900 ఉంది. నెహ్రూ రోడ్డు, పురంవారివీధిలో ఇవే ధరలు ఉండగా.. తాజా సవరణతో 10-20 శాతం మేర ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. గతేడాది ఇదే సమయంలో పెంచగా మళ్లీ బాదడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
* వెంకటగిరి పట్టణంలోని రాజావీధి, పద్మశాలి వీధి, మార్కెట్ వీధి తదితర ప్రాంతాల్లో చదరపు గజం మార్కెట్ విలువ రూ.11,700 కాగా ప్రస్తుతం పెరిగిన ధరలతో రూ.12,500 వరకు ఉన్నట్లు సమాచారం. ఇదే ప్రాంతాల్లో తొలి అంతస్తు ధర చదరపు అడుగుకు రూ.1,900 ఉండగా రూ.2,100 వరకు పెంచారు.
సవరణలు అమలు చేస్తాం
నిబంధనల మేరకు సవరణలు అమలు చేయడం జరుగుతోంది. నిర్ణయించిన ధరల మేరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి.
శ్రీరామ్కుమార్, జిల్లా రిజిస్ట్రార్, తిరుపతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ బీ‘మాయ’
[ 25-04-2024]
ఆపత్కాలంలో కుటుంబానికి తోడుగా నిలుస్తోన్న చంద్రన్న బీమాపై జగనన్న ప్రభుత్వం వచ్చీరాగానే అక్కసు చూపించింది. రెండేళ్లు అరకొరగా అమలు చేసి చివరకు కుటుంబంలో ఒక్కరికే బీమా అవకాశం ఇవ్వడం శాపంగా మారింది. -
భరత్ నామినేషన్ ర్యాలీకి పక్క రాష్ట్రాల జనం
[ 25-04-2024]
కుప్పంలో వైకాపా అభ్యర్థి భరత్ నామినేషన్ ర్యాలీకి బుధవారం రాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తమిళనాడు, కర్ణాటక గ్రామాల నుంచి భారీఎత్తున జన సమీకరణ చేయడం చర్చనీయాంశమైంది. -
ఆలస్యమైనా వేటు తప్పదు..!
[ 25-04-2024]
అధికార పార్టీ నేతల మాటలకు తానా.. తందానా అంటూ వంతపాడుతున్న అధికారులపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటోంది. విచారణ ప్రక్రియ ఆలస్యమైనా.. చర్యలు మాత్రం పక్కా. రాష్ట్ర నిఘా విభాగాధిపతి, విజయవాడ సీపీ, చిత్తూరు సీఐలపై వేటు ఘటనల్లో ఇది స్పష్టమైంది. -
ప్రజల జోలికొస్తే ఊరుకోం
[ 25-04-2024]
చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు తాము అండగా ఉంటామని, అమాయక ప్రజల కొస్తే ఎంతటి వారైనా ఊరుకునేది లేదని తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ హెచ్చరించారు. -
జులై దర్శన టికెట్లు క్షణాల్లో..
[ 25-04-2024]
శ్రీవారి జులై నెల ఆన్లైన్ దర్శన టికెట్లకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. జులై నెలకు సంబంధించి అంగప్రదక్షిణం టికెట్లను బుధవారం విడుదల చేయగా నాలుగు నిమిషాల వ్యవధిలో.. -
మండిపోతున్నా పట్టక..!
[ 25-04-2024]
సూర్యుడు భగభగ మండిపోతున్నాడు.. వారం రోజులుగా ఎండలు 42-45 డిగ్రీలకు చేరాయి.. విద్యుత్తు వినియోగం మరింతగా పెరిగింది.. గృహ, వ్యవసాయ రంగానికి విద్యుత్తు వినయోగం అధికమైంది.. -
ఒకటి నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
మే ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు ఓటర్లకు బీఎల్వోల ద్వారా ఓటరు స్లిప్పులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
‘శోకో’పాధ్యాయ పాఠశాలలు
[ 25-04-2024]
జగన్ పాలనలో బడి పిల్లలు, పంతుళ్ల బతుకులు అతలాకుతలమయ్యాయి. జీవో 117 వారి జీవితాల్లో చీకట్లు నింపింది. విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మాణం అవుతుందని కొఠారి కమిషన్ చెబితే.. పాఠాలు చెప్పేవారిని ఇబ్బందులు పెట్టాలంటుంది జగన్ కమిషన్. -
ఆరో రోజు.. 63 నామినేషన్లు
[ 25-04-2024]
రిటర్నింగ్ అధికారి షన్మోహన్కు.. ఎంపీ అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు (తెదేపా), భూలక్ష్మీ (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), గణపతి (వీసీకే పార్టీ), దగ్గుమళ్ల రాధే (తెదేపా), జయకర్ (స్వతంత్ర), రవి (స్వతంత్ర), మునికృష్ణ (స్వతంత్ర), విజయకుమార్ (బీఎస్పీ)లు నామపత్రాలు సమర్పించారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ సంస్థల కరస్పాడెంట్ నాయుని చంద్రశేఖర్మూర్తి బుధవారం తెలిపారు. -
‘నగరిలో రోజాను ఓడించండి’
[ 25-04-2024]
నగరిలో రోజాను ఓడించాలని.. ఇండియా కూటమి తరఫున పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రాకేష్రెడ్డిని గెలిపించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి పిలుపునిచ్చారు. పుత్తూరు అంబేడ్కర్ భవనంలో బుధవారం సీఐటీయూ సమావేశం జరిగింది. -
వైఎస్ఆర్ బీమా.. జగన్ డ్రామా
[ 25-04-2024]
సీఎం జగన్ వైఎస్ఆర్ బీమా ద్వారా పేదలను ఆదుకుంటామని ఆర్భాటపే ప్రకటనలు చేశారు. ఏడాదికి రూ.15 ప్రీమియం కడితే 18-50 సంవత్సరాల లోపు అయితే సహజ మరణానికి రూ.లక్ష, 18-70 సంవత్సరాల వరకు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించారు. -
చిత్తూరు నగరం.. పసుపు మయం
[ 25-04-2024]
చిత్తూరు నగరం పసుపుమయమైంది. తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ బుధవారం తన నామినేషన్ను అట్టహాసంగా దాఖలు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన తెదేపా, జనసేన, భాజపా శ్రేణులతో నగర వీధులు జనసంద్రమయ్యాయి. -
మంత్రి పేరుతో.. విధ్వంసం
[ 25-04-2024]
నగరంలోని లీలామహల్ కూడలి నుంచి కరకంబాడి వెళ్లే మార్గంలో ఇటీవలే స్మార్ట్సిటీ నిధులతో నిర్మించిన రోడ్డును అడ్డదిడ్డంగా తవ్వేశారు. లీలామహల్ సమీపంలో తన అల్లుడు నిర్మించిన బహుళ అంతస్థుల వాణిజ్య భవనం అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటుకు సుమారు 150 మీటర్ల స్మార్ట్సిటీ రోడ్డును మంత్రి పీఏ తన పలుకుబడి ఉపయోగించి ధ్వంసం చేశారు. -
హస్తకళలూ.. విస్తుపోయాయి
[ 25-04-2024]
హస్తకళా గ్రామం అన్నారు. అన్ని హస్తకళలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి కళాకారులకు చేయూత.. మార్కెటింగ్.. పర్యాటకులను ఆకర్షించి ఆశించిన రీతిలో మార్కెటింగ్ వసతి తదితర ప్రయోజనాలంటూ హామీలు గుప్పించారు. -
నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారం మధ్యాహ్నం మూడు గంటలతో ముగియనుంది. జిల్లా వ్యాప్తంగా ఒక లోక్సభ, ఏడు శాసనసభ స్థానాలకు సంబంధించి ఈనెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
ఏమబ్బా.. కాస్త చూసుకుపోండి
[ 25-04-2024]
‘ఏమబ్బా.. పోస్టల్ బ్యాలెట్కు ఫారం - 12 ఇచ్చావా.. ఏంటి పరిస్థితి.. కాస్త చూసుకుపోండి.. తెలుసుకదా ఎవరికి ఓటు వేయాలో..’ ఇదీ కొందరు పోలీసు అధికారులు తమ సిబ్బందితో అంటున్న మాటలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు