పారిశ్రామిక నడవాల అభివృద్ధికి ఏడీబీ రుణం
పారిశ్రామిక నడవాల అభివృద్ధికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నుంచి ఎట్టకేలకు రుణం అందింది. తెదేపా ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక నడవాలకు అడుగులుపడగా వాటిల్లో మౌలిక వసతులు, రహదారుల నిర్మాణాలకు ప్రతిపాదనలు వెళ్లాయి.
సౌత్ క్లస్టర్లో రూ.536 కోట్లతో మౌలిక వసతులు
నాయుడుపేట బాహ్య రహదారికి రూ.120 కోట్లు
విస్తరించనున్న నెలబల్లి వద్ద పునబాక రహదారి
గూడూరు, న్యూస్టుడే: పారిశ్రామిక నడవాల అభివృద్ధికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నుంచి ఎట్టకేలకు రుణం అందింది. తెదేపా ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక నడవాలకు అడుగులుపడగా వాటిల్లో మౌలిక వసతులు, రహదారుల నిర్మాణాలకు ప్రతిపాదనలు వెళ్లాయి. పలు రోడ్ల నిర్మాణానికి టెండర్లు సైతం పూర్తయ్యాయి. అప్పటి నుంచి కదలిక లేకపోగా తాజాగా పురోగతి మొదలైంది. చిత్తూరు దక్షిణ నోడ్లో మౌలిక వసతులకు టెండర్లు పిలిచారు. ఏడీబీ రుణంతో పారిశ్రామిక నడవాల పరిధిలో మౌలిక వసతులు సమకూరనున్నాయి. బుచ్చినాయుడు కండ్రిగ, తొట్టంబేడు మండలాల్లో పారిశ్రామిక నగరం ఏర్పాటు కానుంది. చిత్తూరు దక్షిణ బ్లాక్లో స్టార్టప్ ఏరియా 938 హెక్టార్లలో రూ.536 కోట్లతో మౌలిక వసతులు ఏర్పాటు కానున్నాయి. తొట్టంబేడు, బుచ్చినాయుడు కండ్రిగ మండలాల్లో పారిశ్రామికవాడ ఏర్పాటు కానుంది. ఈ క్లస్టర్కు అనుసంధానంగా రహదారి విస్తరించనున్నారు. పెళ్లకూరు మండలం నెలబల్లి జాతీయ రహదారి 71 నుంచి దక్షిణ వైపున శ్రీకాళహస్తి-తడ రహదారి మార్గం పల్లమాల వరకు రోడ్డు విస్తరించనున్నారు. దీనికి గతంలోనే టెండర్లు పిలవగా సుమారు 9.5 కి.మీ.లకు రూ.67 కోట్లు వెచ్చించనున్నారు. నాయుడుపేట పారిశ్రామికవాడ బాహ్య రహదారి 8.5 కి.మీ. మేర విస్తరించనున్నారు. దీనికి టెండర్లు పూర్తికాగా రూ.120 కోట్లు వెచ్చించనున్నారు. పండ్లూరు నుంచి తిమ్మాజికండ్రిగ వరకు రహదారి ఏర్పాటు కానుంది. పండ్లూరు దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జి రానుంది.
* వీసీఐసీడీపీలో భాగంగా చిత్తూరు దక్షిణ క్లస్టర్లో స్టార్టప్ ఏరియాను రౌతుసూరమాల, గౌడమాల, కొత్తపాళెం, బీఎస్పురం, ఆలత్తూరులో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడ తొలిదశలో 30 వేల మందికి ఉపాధి కల్పించాలన్నది లక్ష్యం. మౌలిక వసతులకు 21 ఎకరాలు కేటాయించారు. ఇక్కడ ఏటీఎం, మెడికల్ దుకాణం, విశ్రాంతి గదులు, ఫుడ్, బేవరేజస్ తదితర దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ఇక్కడ ఓ నగరం ఏర్పాటుకు అప్పట్లోనే అడుగులుపడగా నాలుగేళ్లు అనంతరం ఎట్టకేలకు కదలిక వచ్చింది.
* ఎంపిక చేసిన ప్రాంతంలో పరిశ్రమల కోసం 1,380, లాజిస్టిక్స్కు 35, వాణిజ్య అవసరాలకు 40, నివాసాలకు 176 ఎకరాల చొప్పున వినియోగించనున్నారు. ఇవికాకుండా రహదారులు, పార్కింగ్, పాత్వేలు, పచ్చదనం కోసం మరో 255 ఎకరాలతో మాస్టర్ ప్లాన్ తయారు చేశారు.
రెండు రోడ్లకు రూ.187 కోట్లు
ఏపీఆర్డీసీ ఆధ్వర్యంలో రెండు రోడ్లకు రూ.187 కోట్లు విడుదల కానున్నాయి. నాయుడుపేట క్లస్టర్లోని బాహ్య రహదారి, దక్షిణ క్లస్టర్ అనుసంధాన రహదారిని, ఇప్పటికే ఉన్న వాటిని విస్తరించి డివైడర్లు ఏర్పాటు చేయనున్నారు. 100 కి.మీ. వేగంతో వెళ్లేలా రహదారులు నిర్మించనున్నారు. ఈ రెండు రోడ్లకు 2019లో టెండర్లు పిలవగా నిధుల రాక ఆలస్యమైంది. ఏడీబీ సాయంతో మళ్లీ అడుగులుపడ్డాయి.
టెండర్ల ప్రక్రియ నడుస్తోంది
నడవాల ప్రగతి పనులకు రుణ సాయం చేయడాని ఏడీబీ ముందుకొచ్చింది. టెండర్లు వివిధ దశల్లో నడుస్తున్నాయి.
చంద్రశేఖర్, జోనల్ మేనేజర్, ఏపీఐఐసీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రులకు జగన్ జబ్బు
[ 23-04-2024]
కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా పేదలకు వైద్య సేవలు అందిస్తామని, ప్రభుత్వ వైద్యశాలలను రోగులకు అనుగుణంగా అప్గ్రేడ్ చేసి ఆ మేరకు సేవలు విస్తరిస్తామని సీఎం జగన్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో హామీ ఇచ్చారు. -
ఫ్యాను పార్టీలో ఉక్కపోత
[ 23-04-2024]
వైకాపాలో అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయి. ఐదేళ్లలో ఆ పార్టీలో గౌరవం దక్కలేదని, ప్రజలకు ఏం చేయలేకపోయామనే భావనతో ఉన్న నాయకులు, కార్యకర్తలు విసిగివేశారి సైకిల్ ఎక్కుతున్నారు. -
‘పది’లో 11 మెట్లు పైకెక్కి
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో గతేడాది 17వ స్థానంలో నిలిచిన జిల్లా.. ఈ విడత ఆరో స్థానానికి చేరింది.. ముఖ్యంగా ఈసారి బాలికలదే పైచేయి. జిల్లాలో 20,939మంది(బాలురు 10,793మంది, బాలికలు 10,146మంది) విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. -
44 నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని చిత్తూరు లోక్సభ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం 44 నామినేషన్లు దాఖలయ్యాయి. -
మాటల్లో బాగా.. చేతల్లో దగా..
[ 23-04-2024]
అధికారంలోకి వచ్చాక ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయేలా ఫిట్మెంట్ ఇస్తామని ఎన్నికల సందర్భంగా సీఎం జగన్ హామీ ఇచ్చారు.. సీఎం అయ్యాక జగన్ ఉద్ధరిస్తారని భావిస్తే నమ్మకంగా ముంచేశారని వాపోతున్నారు. -
ఆ ఆలయం అందరికీ సెంటిమెంట్
[ 23-04-2024]
ఎన్నికల్లో పలు సెంటిమెంట్లు చూస్తుంటాం. ఆ గుడిలో పూజలు చేసి.. నామపత్రాలు దాఖలు చేస్తే.. గెలుపు తథ్యమని.. ఫలానా చోట నుంచి ప్రచారం ప్రారంభిస్తే విజయం సులువుగా వరిస్తుందని నాయకులు నమ్మి ఆచరిస్తుంటారు. -
వైకాపా పాలనలో కేసుల పరంపర
[ 23-04-2024]
అమరనాథరరెడ్డి మీద వైకాపా ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా కేసులు నమోదు చేసింది. ఈ విషయం ఎన్నికల అధికారులకు అయన సమర్పించిన అఫిడవిట్లో పొందుపరిచారు. -
ఏడాదిలోపే.. నాణ్యత లోపాలు
[ 23-04-2024]
శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం దేశవిదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఈక్రమంలో శ్రీవారి దర్శనంతోపాటు మెరుగైన వసతిని తితిదే నుంచి ఆశిస్తారు. -
జగన్ అరెస్టుతో నాకేంటి సంబంధం: కిరణ్
[ 23-04-2024]
వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తే తనకేంటి సంబంధమని మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట పార్లమెంట్ ఎన్డీయే అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి ప్రశ్నించారు. -
నాటకాల జగన్.. సీఎం పదవికి అనర్హుడు
[ 23-04-2024]
గత ఎన్నికల్లో కోడికత్తి, బాబాయ్పై గొడ్డలి వేటు నాటకాలు ఆడి గద్దెనెక్కిన జగన్.. అరాచక పాలన సాగించారు. మళ్లీ ఇప్పుడు గులకరాయి డ్రామాకు తెరతీశారు. -
దంపతులపై వైకాపా నాయకుల దాడి అమానుషం
[ 23-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు నామినేషన్కు వెళ్లారని ముస్లిం దంపతులపై వైకాపా నాయకులు దాడి చేసి, చంపేస్తామని బెదిరించడం అమానుషమని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. -
ఈ ఆస్పత్రుల్లో ఎలా జగన్..
[ 23-04-2024]
ప్రభుత్వాసుపత్రుల్లో అసౌకర్యాలు తాండవిస్తున్నాయి. రోగులకు సరిపడా గదులు లేవు.. వరండాల్లోనే వైద్యసేవలు పొందాల్సిన దుస్థితి. -
పూతలపట్టులో.. తెదేపాకు ఒక్క అవకాశమివ్వండి...!
[ 23-04-2024]
పూతలపట్టులో తెదేపాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపుతానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీ మోహన్ అన్నారు. -
ఉత్తీర్ణత పెరిగి.. స్థానం దిగజారి
[ 23-04-2024]
పది పరీక్ష ఫలితాలు జిల్లాను కాస్త నిరుత్సాహ పరిచాయి. గతేడాది రాష్ట్రస్థాయిలో ఎనిమిదో స్థానంలో నిలవగా ఈసారి రెండు స్థానాలు దిగజారి పదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
జగనన్న పీఆర్సీ.. తీరని ద్రోహం
[ 23-04-2024]
ఎంతసేపు వెట్టిచాకిరీ చేయించుకున్నారే తప్ప ఈ ఐదేళ్లలో ఏనాడూ తమపక్షాన నిలబడింది లేదని.. నిజానికి జగనన్న పాలనలో వాలంటీర్కు ఇచ్చిన విలువకూడా ఇవ్వలేదని.. నెరవేరని హామీలు, రివర్స్ పీఆర్సీనే అందుకు నిదర్శనమన్న ఆవేదన ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM